వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని కొద్ది నెలల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత యూ టర్న్ తీసుకున్న సాయిరెడ్డి…వైసీపీపై, జగన్ పై సునిశిత విమర్శలు చేయడం మొదలుబెట్టారు. లిక్కర్ స్కాం వ్యవహారంపై సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
ఈ క్రమంలోనే సాయిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ఆ దిశగానే సాయిరెడ్డి సందర్భానుసారంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడం, బీజేపీ పాలసీలకు మద్దతుగా ట్వీట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ క్రమంలోనే బీజేపీకి సాయిరెడ్డి మరింత దగ్గరవుతున్నారన్న సంకేతాలిచ్చేలా ఆయన తాజాగా ఎక్స్ లో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. దేశభక్తిని చాటుతూ బీజేపీకి అనుకూలంగా ఆయన చేసిన కామెంట్లు చరర్చనీయాంశమయ్యాయి.
ఇకపై “వందేమాతరం” పూర్తిగా పాడాల్సిందేనన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మనమంతా సమర్థించాలని, స్వాగతించాలని సాయిరెడ్డి అన్నారు. విదేశీ పాలకులు వెళ్ళిపోయినా విదేశీ మతాలు మాత్రం మన మధ్యే మిగిలిపోయాయని చెప్పారు.
అవి మన సంస్కృతి మీద ఇంకా పరిపాలన చెయ్యాలనే చూస్తున్నాయని, భారత దేశంలో పుట్టిన మనకు మనసే ఉండదా? అంటూ గుండెల నిండా దేశభక్తి నింపుకొని సాయిరెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికీ బానిసత్వపు సంకెళ్ళేనా? అని సాయిరెడ్డి ప్రశ్నించారు. విదేశీ మతాలవారు ఏదో అనుకుంటారని 120 ఏళ్లుగా మనమంతా సగం “వందేమాతరం” గేయాన్ని పాడామా?, మన జాతీయ గేయంలో మన “అమ్మవార్ల” పేర్లే ఉండకూడదా? అని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే జాతీయ భావం, దేశభక్తి, విదేశీ మతాలు అంటూ సాయిరెడ్డి చేసిన కామెంట్లు ఆయనను బీజేపీకి మరింత దగ్గర చేసేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రేపోమాపో ఆయన కాషాయం కట్టేయ్ బ్రదర్ అంటూ కమల దళంలో చేరతారని సెటైర్లు వేస్తున్నారు.
This post was last modified on February 13, 2026 5:52 pm
అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో అసలే అర్థం కాదు. ఎలాంటి ఆలోచన లేకుండా.. కేవలం సరదాగా కొన్న ఒక డొమైన్…
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. 116 మున్సిపాలిటీలకు గాను 64 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం…
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్, నమీబియా మధ్య జరిగిన మ్యాచ్ ఒక ఆసక్తికర చర్చకు దారితీసింది. నమీబియా…
నిర్మాత నాగవంశీకి మరోసారి అసహనం కలిగింది. ఇవాళ విడుదలైన ఫంకీ స్పందన గురించి మాట్లాడుతూ ఏదో ట్విట్టర్ సైంటిస్టుల్లా ఇందులో…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న 'పెద్ది' సినిమా ఏప్రిల్ 30న రాబోతోంది. విడుదలకు…
నందమూరి కళ్యాణ్ రామ్ గత ఏడాది అర్జున్ సన్నాఫ్ వైజయంతి రూపంలో డిజాస్టర్ చవి చూశాక మళ్ళీ కనిపించలేదు. దాని…