పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగానే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడింగ్ లో ఉన్నారు. 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా 5 కార్పొరేషన్లలో కాంగ్రెస్ గెలుపొందింది. బీఆర్ఎస్ ఇంకా బోణీ కొట్టలేదు. బీజేపీ ఒక కార్పొరేషన్ లో లీడ్ లో ఉంది. ఇతరులు ఒక కార్పొరేషన్ లో లీడ్ లో ఉన్నారు.
116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా 65 మున్సిపాలిటీలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. 53 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ విజయం సాధించగా…11 స్థానాల్లో బీఆర్ఎస్, ఇతరులు ఒక స్థానంలో గెలుపొందారు.
మొత్తం 414 డివిజన్లకు ఎన్నికలు జరగగా..211 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. అందులో, 133 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 22 స్థానాల్లో బీఆర్ఎస్, 22 స్థానాల్లో బీజేపీ, 34 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.
ఇక, మొత్తం 2581 వార్డులకు ఎన్నికలు జరిగగా..2400 స్థానాల్లో ఫలితాలు వెలువడ్డాయి. 1310 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 671 స్థానాల్లో బీఆర్ఎస్, 213 స్థానాల్లో బీజేపీ, 206 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. ఓవరాల్ గా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ప్రత్యేకించి ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ బాగా పుంజుకుంది.
మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…
ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…