Political News

అందుకే నాకు కన్నీళ్లు ఆగలేదు: చంద్రబాబు

గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. ఆ సమయంలో తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పారు.

“2019-24 మధ్య నాలాగే చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. విశాఖకు వెళ్తే పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారు. గతంలో ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారు” అని వైసీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సభలో ప్రసంగించారు. ఈ సమయంలో వైసీపీ హయాంలో జరిగిన అనేక పరిణామాలను ఆయన వివరించారు. ప్రజలు ప్రతి అంశాన్నీ గమనిస్తూనే ఉంటారని తెలిపారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై అధికారంలోకి వచ్చిన వెంటనే 7 శ్వేతపత్రాలను విడుదల చేశామని పేర్కొన్నారు.

వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు సీఎం తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు.

పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఆనాడు వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టి పేదల పొట్ట కొట్టిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే 213 క్యాంటీన్లను ఏర్పాటు చేశామని వివరించారు. వచ్చే మూడు నెలల్లో అన్నా క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

పీపీపీ వల్ల సంపద సృష్టి జరుగుతోందని ఆయన అన్నారు. ఈ విషయం తెలియని వారే పీపీపీని వ్యతిరేకిస్తున్నారని, వారికి కావాల్సింది అభివృద్ధి కాదని, విధ్వంసమని పేర్కొన్నారు. ఎవరు ఏం చేసినా, ఎలాంటి విమర్శలు చేసినా రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు పీపీపీ విధానంలోనే నిర్మిస్తామని సీఎం తేల్చిచెప్పారు. పీ4 ద్వారా భవిష్యత్‌లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పేదరిక నిర్మూలనకు సంబంధించి దేశంలోనే ఇది అత్యుత్తమ మోడల్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

This post was last modified on February 13, 2026 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

7 minutes ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

1 hour ago

30 కోట్ల‌తో సీనియ‌ర్ నిర్మాత సాహ‌సం

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ కాలంగా నిర్మాత‌గా ఉన్నారు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు. 90వ ద‌శ‌కంలోనే దివంగ‌త న‌టుడు శోభ‌న్ బాబు…

1 hour ago

రౌడీ కోసం నాని వస్తే… అంత విశేషమా?

ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…

4 hours ago

తమిళంలో అదరగొట్టిన చంద్రబాబు

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…

4 hours ago

ధనుష్ కూడా ఇలా చేస్తే ఎలా?

పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్‌గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…

10 hours ago