Political News

అందుకే నాకు కన్నీళ్లు ఆగలేదు: చంద్రబాబు

గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. ఆ సమయంలో తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పారు.

“2019-24 మధ్య నాలాగే చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. విశాఖకు వెళ్తే పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారు. గతంలో ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారు” అని వైసీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సభలో ప్రసంగించారు. ఈ సమయంలో వైసీపీ హయాంలో జరిగిన అనేక పరిణామాలను ఆయన వివరించారు. ప్రజలు ప్రతి అంశాన్నీ గమనిస్తూనే ఉంటారని తెలిపారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై అధికారంలోకి వచ్చిన వెంటనే 7 శ్వేతపత్రాలను విడుదల చేశామని పేర్కొన్నారు.

వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు సీఎం తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు.

పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఆనాడు వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టి పేదల పొట్ట కొట్టిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే 213 క్యాంటీన్లను ఏర్పాటు చేశామని వివరించారు. వచ్చే మూడు నెలల్లో అన్నా క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

పీపీపీ వల్ల సంపద సృష్టి జరుగుతోందని ఆయన అన్నారు. ఈ విషయం తెలియని వారే పీపీపీని వ్యతిరేకిస్తున్నారని, వారికి కావాల్సింది అభివృద్ధి కాదని, విధ్వంసమని పేర్కొన్నారు. ఎవరు ఏం చేసినా, ఎలాంటి విమర్శలు చేసినా రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు పీపీపీ విధానంలోనే నిర్మిస్తామని సీఎం తేల్చిచెప్పారు. పీ4 ద్వారా భవిష్యత్‌లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పేదరిక నిర్మూలనకు సంబంధించి దేశంలోనే ఇది అత్యుత్తమ మోడల్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

This post was last modified on February 13, 2026 3:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కొరటాల మాస్… బాలయ్య కార్పెంటర్

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు…

48 minutes ago

సువేందు అధికారి ఆనే నేను..

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువు తీరింది. ఉదయం 11 గంటలకు బ్రిగేడ్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో బెంగాల్‌ సీఎంగా సువేందు…

59 minutes ago

వీరభద్రుడికి ముందు నుయ్యి వెనుక గొయ్యి

ఇప్పటికే పలు వాయిదాల్లో నలిగిపోయిన సూర్య వీరభద్రుడు మే 14 విడుదల కానుంది. మొన్నటిదాకా వాయిదా పడుతుందనే ప్రచారం చెన్నై…

1 hour ago

పవన్ అభిమానులు… కొత్త ట్రాప్ లో పడొద్దు…

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…

2 hours ago

సుమంత్ పేరు వెనుక‌ ప్ర‌భాస్ ఎందుకు?

మేం ఫేమ‌స్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ న‌టుడు సుమంత్ ప్ర‌భాస్. షార్ట్ ఫిలిమ్స్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ఈ…

3 hours ago

దిల్ రాజుకు దెబ్బ మీద దెబ్బ‌

ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్ ప‌రిస్థితీ అంత బాగా లేదు. స‌క్సెస్ రేట్ అంత‌కంత‌కూ ప‌డిపోతోంది. జ‌నాలు థియేట‌ర్ల‌కు…

4 hours ago