Political News

అందుకే నాకు కన్నీళ్లు ఆగలేదు: చంద్రబాబు

గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. ఆ సమయంలో తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పారు.

“2019-24 మధ్య నాలాగే చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. విశాఖకు వెళ్తే పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారు. గతంలో ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారు” అని వైసీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సభలో ప్రసంగించారు. ఈ సమయంలో వైసీపీ హయాంలో జరిగిన అనేక పరిణామాలను ఆయన వివరించారు. ప్రజలు ప్రతి అంశాన్నీ గమనిస్తూనే ఉంటారని తెలిపారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై అధికారంలోకి వచ్చిన వెంటనే 7 శ్వేతపత్రాలను విడుదల చేశామని పేర్కొన్నారు.

వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు సీఎం తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు.

పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఆనాడు వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టి పేదల పొట్ట కొట్టిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే 213 క్యాంటీన్లను ఏర్పాటు చేశామని వివరించారు. వచ్చే మూడు నెలల్లో అన్నా క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

పీపీపీ వల్ల సంపద సృష్టి జరుగుతోందని ఆయన అన్నారు. ఈ విషయం తెలియని వారే పీపీపీని వ్యతిరేకిస్తున్నారని, వారికి కావాల్సింది అభివృద్ధి కాదని, విధ్వంసమని పేర్కొన్నారు. ఎవరు ఏం చేసినా, ఎలాంటి విమర్శలు చేసినా రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు పీపీపీ విధానంలోనే నిర్మిస్తామని సీఎం తేల్చిచెప్పారు. పీ4 ద్వారా భవిష్యత్‌లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పేదరిక నిర్మూలనకు సంబంధించి దేశంలోనే ఇది అత్యుత్తమ మోడల్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

This post was last modified on February 13, 2026 3:57 pm

Share

Recent Posts

బుట్టబొమ్మకు ఏ ప్రయోజనం లేదు

బుట్టబొమ్మ గా అల వైకుంఠపురములో నుంచి టాలీవుడ్ పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే చాలా కాలంగా ఫ్లాపుల్లో ఉంది. ఏ…

51 minutes ago

ఏడున్న‌ర గంట‌ల‌పాటు నిల‌బ‌డిన లోకేష్‌

ఒక గంట నిల‌బ‌డేందుకే ఇబ్బంది ప‌డ‌తాం. అలాంటిది ఏకంగా ఏడున్న‌ర‌గంట‌ల పాటు ఏక‌బిగిన నిల‌బ‌డ‌డం అంటే మాట‌లా? ఊహించేందుకే క‌ష్ట‌మైన…

1 hour ago

కనకవర్షం కురవాల్సిందే కనకరాజూ

కనకవర్షం కురిపించుకోవడమంటే బాక్సాఫీస్ దగ్గర అదో పెద్ద యుద్ధం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. ఏది ఎలా ఎప్పుడు ఆడుతుందో ఎవరూ…

2 hours ago

అంబటి నోటి దురుసు తగ్గేలా లేదు

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రమ్మను…ఆ…ని..చూసుకుందాం..అంటూ ముఖ్యమంత్రి…

3 hours ago

పోలీసుల అదుపులో రాహుల్ గాంధీ

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, సీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ…

4 hours ago

మోదీ ఇంటి ముందు రాహుల్… హై టెన్షన్

నీట్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారం నేపథ్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష భగ్నం, కాక్రోచ్ జనతా…

5 hours ago