Political News

అందుకే నాకు కన్నీళ్లు ఆగలేదు: చంద్రబాబు

గత వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పాలకులు అసెంబ్లీలో అవమానించిన తీరుకు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని అన్నారు. ఆ సమయంలో తనకు కన్నీళ్లు ఆగలేదని చెప్పారు.

“2019-24 మధ్య నాలాగే చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. విశాఖకు వెళ్తే పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్నారు. గతంలో ఎన్నో దుర్మార్గాలకు ఒడిగట్టిన వారు ఇప్పుడు నీతులు చెబుతున్నారు” అని వైసీపీ నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తొలి రోజు గవర్నర్ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం చంద్రబాబు శుక్రవారం సభలో ప్రసంగించారు. ఈ సమయంలో వైసీపీ హయాంలో జరిగిన అనేక పరిణామాలను ఆయన వివరించారు. ప్రజలు ప్రతి అంశాన్నీ గమనిస్తూనే ఉంటారని తెలిపారు. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన విధ్వంసంపై అధికారంలోకి వచ్చిన వెంటనే 7 శ్వేతపత్రాలను విడుదల చేశామని పేర్కొన్నారు.

వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు సీఎం తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు.

పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను ఆనాడు వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టి పేదల పొట్ట కొట్టిందని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే 213 క్యాంటీన్లను ఏర్పాటు చేశామని వివరించారు. వచ్చే మూడు నెలల్లో అన్నా క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.

పీపీపీ వల్ల సంపద సృష్టి జరుగుతోందని ఆయన అన్నారు. ఈ విషయం తెలియని వారే పీపీపీని వ్యతిరేకిస్తున్నారని, వారికి కావాల్సింది అభివృద్ధి కాదని, విధ్వంసమని పేర్కొన్నారు. ఎవరు ఏం చేసినా, ఎలాంటి విమర్శలు చేసినా రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులు పీపీపీ విధానంలోనే నిర్మిస్తామని సీఎం తేల్చిచెప్పారు. పీ4 ద్వారా భవిష్యత్‌లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. పేదరిక నిర్మూలనకు సంబంధించి దేశంలోనే ఇది అత్యుత్తమ మోడల్ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Satya

Recent Posts

వాయిస్ మెసేజ్‌తోనూ FIR… భళా బాబు గారు

పోలీసు స్టేష‌న్ల‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్‌ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…

5 hours ago

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

5 hours ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

7 hours ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

7 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

7 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

8 hours ago