Movie News

అక్కినేని కుటుంబానికీ బెదిరింపులు తప్పలేదు

నేను కూడా సైబర్ బాదితుడినే… అందుకే వారానికోసారి మొబైల్ ఫోన్ పాస్వర్డ్ మారుస్తుంటానని చెప్పారు హీరో నాగార్జున. కంప్యూటర్ విప్లవం దశ దాటి డిజిటల్, ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో సైబర్ నేరాలు ఊపందుకున్నాయి. సామాన్యుల కంటే ఉన్నతోద్యోగులు, సెలబ్రిటీలే ఎక్కువగా సైబర్ నేరాల ఉచ్చులో పడుతున్నారు. ఈక్రమంలో హైదరాబాద్ బంజారాహిల్స్ లో జరిగిన సురక్షా కా తిరంగా కార్యక్రమంలో సైబర్ నేరాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన నాగార్జున తన అనుభవాలను పంచుకున్నారు.

ఐదు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి బ్యాంక్ అధికారినంటూ ఫోన్ చేసి మోసం చేసేందుకు ప్రయత్నం చేసాడని తెలిపారు. విదేశాలకు మాదక ద్రావ్యాలను పార్సెల్ చేసినట్లు కొందరు నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. చివరికి నా కుటుంబంలో కొందరిని భయపెట్టి ఆరేడు గంటల పాటు డిజిటల్ అరెస్టు కూడా చేసినట్లు తెలిపారు. 1977లో తాను ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లోనే కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయని, అప్పట్లోనే మాల్ వేర్ హ్యాకింగ్ పై ప్రొఫెసర్లు హెచ్చరించారని చెప్పారు. అప్పటినుంచే ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయని చెప్పారు.

అందుకే తాను వారానికి ఒకసారి మొబైల్ పాస్వర్డ్, నెలకు ఒకసారి వై ఫైవ్ పాస్వర్డ్ మారుస్తుంటానని తెలిపారు. చివరికి మొబైల్ ఫోన్ లో నా ఫోటోలు కూడా షేర్ చేయనని చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతిఒక్కరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అంటే సైబర్ నేరాలకు 50 ఏళ్లకు పైగానే చరిత్ర ఉందని నాగార్జున ప్రసంగాన్ని బట్టి అర్ధం అవుతుంది. ఇప్పుడు ఈ సమస్య తీవ్రత పెరిగింది. బాధితుల సంఖ్య వంద శాతం పెరిగింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు చేసింది. తగినంత సిబ్బంది లేకపోవడంతో నిందితులు సేఫ్ గా తప్పించుకుంటున్నారు. బాధితులు నెలల తరబడి పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు. జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా ఒక్క పొరపాటుతో పోగొట్టుకోవడం బాధాకరం. సైబర్ నేరాలపై అవగాహనా పెంపొందించుకోవడం ఒక్కటే దీనికి పరిష్కారం అని పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.

This post was last modified on August 14, 2026 5:05 pm

Share

Recent Posts

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

27 minutes ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

1 hour ago

రెండో భాస్కర్ అంత వేగంగా రాగలడా

సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…

2 hours ago

నాపై కాదు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…

3 hours ago

మలేరియా టాబ్లెట్లు మింగి ఒక బాలిక మృతి… 53 మందికి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేగింది. వైద్య సిబ్బంది పంపిణీ చేసిన మలేరియా మాత్రలు మింగిన…

3 hours ago

ప్యారడైజ్ దుస్తులకు ఖరీదు ఎక్కువే

సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…

5 hours ago