మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. గుంటూరు కోర్టుకు తరలిస్తుండగా పోలీసు వ్యాన్లో నుంచే ‘పుష్ప’ సినిమా స్టైల్లో “తగ్గేదే లే” అంటూ చేసిన సైగలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టిక్కెట్ల అవినీతి కేసు విచారణలో భాగంగా అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్పై గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. కోర్టు ప్రాంగణానికి చేరుకున్న సమయంలో వ్యాన్ దిగే ముందు కిటికీలోంచి గెడ్డం కింద చేయి పెట్టి అల్లు అర్జున్ తరహాలో ‘తగ్గేదే లే’ మేనరిజం ప్రదర్శించడం అక్కడున్నవారిని ఆకర్షించింది.
ఆయన చూపిన ఈ మాస్ యాటిట్యూడ్పై పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేస్తుండగా, నెటిజన్లు మాత్రం విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ధైర్యానికి సంకేతమంటుంటే, మరికొందరు దీనిని అనుచితంగా విమర్శిస్తున్నారు.
ఇటీవల సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటికి బెయిల్ లభించింది. అలాగే గతేడాది మెడికల్ కాలేజీ అంశంపై జరిగిన ఆందోళనల్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కేసులోనూ బెయిల్ వచ్చింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన విడుదల కావడం లాంఛనమేనని భావించిన వేళ, సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పోలీసులు పీటీ వారెంట్పై కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
దీంతో అంబటికి మరోసారి నిరాశే ఎదురైంది. తాజా రిమాండ్ నేపథ్యంలో ఆయన తదుపరి న్యాయపరమైన చర్యలపై ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.
This post was last modified on February 12, 2026 11:32 pm
ఫ్యామిలీ థ్రిల్లర్స్ లో కొత్త ఒరవడికి చుట్టిన దృశ్యం ఫ్రాంచైజ్ లో చివరి భాగం మలయాళంలో షూటింగ్ పూర్తి చేసుకుంది.…
టీ20 వరల్డ్ కప్ భాగంగా జరిగిన రెండో గ్రూప్ మ్యాచ్ లో నమీబియాపై భారత్ 93 పరుగుల తేడాతో భారీ…
నిన్న నిఖిల్ సిద్దార్థ స్వయంభు రెండు నిమిషాల టీజర్ వచ్చాక సోషల్ మీడియా రియాక్షన్లు అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ…
కొద్దిరోజుల క్రితం టాక్సిక్ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు 120 కోట్లకు తీసుకున్నారనే వార్త మీడియాలో హాట్ టాపిక్…
సాయిధరమ్ తేజ్ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకడు. కానీ 40వ పడికి చేరువ అవుతున్నా ఇంకా అతను పెళ్లి పీటలు ఎక్కలేదు.…
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా పిటిషన్ను విచారించాలంటే ఆయన ముందుగా భారత్కు తిరిగి రావాల్సిన అవసరం ఉందని బాంబే…