మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. గుంటూరు కోర్టుకు తరలిస్తుండగా పోలీసు వ్యాన్లో నుంచే ‘పుష్ప’ సినిమా స్టైల్లో “తగ్గేదే లే” అంటూ చేసిన సైగలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టిక్కెట్ల అవినీతి కేసు విచారణలో భాగంగా అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్పై గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. కోర్టు ప్రాంగణానికి చేరుకున్న సమయంలో వ్యాన్ దిగే ముందు కిటికీలోంచి గెడ్డం కింద చేయి పెట్టి అల్లు అర్జున్ తరహాలో ‘తగ్గేదే లే’ మేనరిజం ప్రదర్శించడం అక్కడున్నవారిని ఆకర్షించింది.
ఆయన చూపిన ఈ మాస్ యాటిట్యూడ్పై పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేస్తుండగా, నెటిజన్లు మాత్రం విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ధైర్యానికి సంకేతమంటుంటే, మరికొందరు దీనిని అనుచితంగా విమర్శిస్తున్నారు.
ఇటీవల సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటికి బెయిల్ లభించింది. అలాగే గతేడాది మెడికల్ కాలేజీ అంశంపై జరిగిన ఆందోళనల్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కేసులోనూ బెయిల్ వచ్చింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన విడుదల కావడం లాంఛనమేనని భావించిన వేళ, సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పోలీసులు పీటీ వారెంట్పై కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
దీంతో అంబటికి మరోసారి నిరాశే ఎదురైంది. తాజా రిమాండ్ నేపథ్యంలో ఆయన తదుపరి న్యాయపరమైన చర్యలపై ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.
This post was last modified on February 12, 2026 11:32 pm
ఫిబ్రవరి మొత్తం దాదాపుగా డ్రైగా గడిపేసిన టాలీవుడ్ బాక్సాఫీస్ మార్చిలో మంచి బోణీ కోసం ఎదురు చూస్తోంది. ఎంత పిల్లల…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. వచ్చే ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. ఒంటరి పోరు చేస్తామంటూ..…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా రూపొందిస్తున్న పెద్ది సినిమాకు సంబంధించి ప్రతి ప్రోమో బ్లాక్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై మరోసారి తన పట్టును గట్టిగా నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలోనూ ఆయన అనేక సందర్భాల్లో…
హఠాత్తుగా ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19కి ప్రీ పోన్ అయ్యిందన్న వార్త ఒక్కసారిగా నిన్న సాయంత్రం సోషల్ మీడియాని…
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం.. భారత్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందా? ప్రజలకు కష్టాలు ప్రారంభం కానున్నాయా? అంటే..…