వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాస్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందికి పరిచయమున్నారో లేరో తెలీదుగానీ…దువ్వాడ శ్రీనివాస్, మాధురిల జంట అంటే మాత్రం ఆ పేరు ఇట్టే గుర్తుపట్టేస్తారు. మాధురి పుణ్యమా అంటూ దువ్వాడ శ్రీనివాస్ ఓ రేంజ్ లో పాపులర్ అయ్యారు. మాధురితో రిలేషన్షిప్, భార్యతో ఆస్తి తగాదాలు, ధర్మానతో అంతర్గత విభేదాలు…వెరసి దువ్వాడను 7 నెలల క్రితం వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు జగన్.
అయినా సరే, శాసన మండలి సమావేశాల సమయంలో అసెంబ్లీకి దువ్వాడ శ్రీనివాస్ వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన దువ్వాడను జగన్ పలకరించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వస్తున్న జగన్ను దువ్వాడ కలిశారు. ఈ సందర్భంగా ‘ఏం చేద్దాం శ్రీనివాస్?’ అని దువ్వాడను జగన్ ఫ్రెండ్లీగా పలకరించారట. ధర్మానతో ఉన్న ఇష్యూ గురించి మాట్లాడాలని జగన్ ను దువ్వాడ రిక్వెస్ట్ చేశారట. అయితే, ఆ మ్యాటర్ పై డిస్కస్ చేసేందుకు తాడేపల్లి రావాలని దువ్వాడకు జగన్ చెప్పారట.
ఈ క్రమంలోనే త్వరలోనే జగన్ను కలుస్తానని, వైసీపీలో ఛాన్స్ ఇవ్వకుంటే సొంతంగా పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తానని మీడియాతో దువ్వాడ అన్నారు. మండలిలో ప్రజా సమస్యలను ప్రస్తావిస్తానని, తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతానని చెప్పారు. మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
This post was last modified on February 11, 2026 3:45 pm
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఈ ఏడాదిలో 10 వేలకుపైగా సర్కారీ…
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రిజవిజన్(సర్) ప్రక్రియ దాదాపు రెండు మాసాల పాటు సాగింది. రెండు…
టాలీవుడ్ లో కొన్ని ప్యాన్ ఇండియా సినిమాల సంకట స్థితి అంతా ఇంతా కాదు. విడుదల తేదీ తేల్చకుండా, అభిమానుల…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది. ఇటీవలే పుదుచెరి షెడ్యూల్…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ అధినేత జగన్ దూరం పెడుతున్నారా? తన పార్టీలోని మిగతా నేతలతో ఉన్నంత…
2027 సంక్రాంతి అయిదు నెలల ముందే టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మేమంటే మేమంటూ ఎవరికి వారు పోటీ పడి…