సీఎం చంద్రబాబును దూషించిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. అయితే, గత ఏడాది నవంబర్ 12న పోలీసుల విధులను అడ్డుకున్నారన్న కేసులో అంబటి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ పై ఉన్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలోనే తాజాగా అంబటికి కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఆ కేసులోనూ అంబటికి బెయిల్ లభించింది. ఈ క్రమంలోనే జైల్లో ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి విడుదలయ్యే అవకాశముంది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తామన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అంబటి రాంబాబు ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో అంబటిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని గుంటూరు కోర్టులో పట్టాభిపురం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టులో అంబటి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ పెండింగ్ లో ఉంది.
This post was last modified on February 11, 2026 2:49 pm
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…