సీఎం చంద్రబాబును దూషించిన కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. అయితే, గత ఏడాది నవంబర్ 12న పోలీసుల విధులను అడ్డుకున్నారన్న కేసులో అంబటి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ పై ఉన్న విషయం విదితమే.
ఈ నేపథ్యంలోనే తాజాగా అంబటికి కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఆ కేసులోనూ అంబటికి బెయిల్ లభించింది. ఈ క్రమంలోనే జైల్లో ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి అంబటి విడుదలయ్యే అవకాశముంది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తామన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అంబటి రాంబాబు ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో అంబటిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని గుంటూరు కోర్టులో పట్టాభిపురం పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
తాజాగా ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసిన కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు, తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టులో అంబటి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ పెండింగ్ లో ఉంది.
This post was last modified on February 11, 2026 2:49 pm
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…