Political News

ఆ ‘కమ్మ’టి కామెంట్లతో బీజేపీకి సంబంధం లేదా?

బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అది స్వపక్షమైనా..విపక్షమైనా.. ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడి కొన్ని సందర్భాల్లో ఆయన చిక్కుల్లో పడుతుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా తమ మిత్రపక్షమైన టీడీపీని, కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన కమ్మగా ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

గతంలో ఎన్టీఆర్ పాలన కమ్మగా ఉందని అనుకునేవారని, ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ సామాజిక వర్గంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కామెంట్లపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఈ రోజు స్పందించారు. ఆ వ్యాఖ్యలు ఆదినారాయణ రెడ్డి వ్యక్తిగతంగా చేసినవని మాధవ్ వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. 

అయినా సరే, ఆ వ్యాఖ్యలపై ఆదినారాయణ రెడ్డి నుంచి వివరణ తీసుకుంటానని చెప్పారు. అయితే, మాధవ్ సమక్షంలోనే ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని, అది బీజేపీ సమావేశం అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

అప్పుడే ఆదినారాయణ రెడ్డి కామెంట్లను వేదికపై నుంచి మాధవ్ ఖండించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెెబుతున్నారు. వివరణ కాదు…ఆదినారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

లేదంటే టీడీపీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని అంటున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు కూటమి సమైక్యతను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on February 10, 2026 8:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

15 minutes ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

37 minutes ago

పవన్ భార్యకు కూడా చిరు అన్నయే…

​మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…

1 hour ago

‘ఉస్తాద్’కు లాస్ట్ ఛాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…

2 hours ago

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

2 hours ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

2 hours ago