Political News

ఆ ‘కమ్మ’టి కామెంట్లతో బీజేపీకి సంబంధం లేదా?

బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అది స్వపక్షమైనా..విపక్షమైనా.. ముందు వెనుక చూసుకోకుండా మాట్లాడి కొన్ని సందర్భాల్లో ఆయన చిక్కుల్లో పడుతుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా తమ మిత్రపక్షమైన టీడీపీని, కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన కమ్మగా ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

గతంలో ఎన్టీఆర్ పాలన కమ్మగా ఉందని అనుకునేవారని, ఇప్పటికీ అదే పరిస్థితి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కమ్మ సామాజిక వర్గంతో పాటు మిగిలిన సామాజిక వర్గాలు కూడా ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కామెంట్లపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఈ రోజు స్పందించారు. ఆ వ్యాఖ్యలు ఆదినారాయణ రెడ్డి వ్యక్తిగతంగా చేసినవని మాధవ్ వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. 

అయినా సరే, ఆ వ్యాఖ్యలపై ఆదినారాయణ రెడ్డి నుంచి వివరణ తీసుకుంటానని చెప్పారు. అయితే, మాధవ్ సమక్షంలోనే ఆదినారాయణ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని, అది బీజేపీ సమావేశం అని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.

అప్పుడే ఆదినారాయణ రెడ్డి కామెంట్లను వేదికపై నుంచి మాధవ్ ఖండించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెెబుతున్నారు. వివరణ కాదు…ఆదినారాయణ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

లేదంటే టీడీపీ శ్రేణులకు తప్పుడు సంకేతాలు వెళతాయని అంటున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు కూటమి సమైక్యతను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on February 10, 2026 8:54 pm

Share

Recent Posts

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

9 minutes ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

53 minutes ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

1 hour ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

3 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

4 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

11 hours ago