సీఎం చంద్రబాబును అనుచిత పదజాలంతో దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటి రాంబాబును పోలీస్ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల కస్టడీ పిటిషన్ ను గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు తిరస్కరించింది. అయితే, మరో కేసులో అంబటికి ఈ నెల 22 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
గత ఏడాది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టిన అంబటిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు 2 వారాలపాటు రిమాండ్ విధించింది. దీంతో, ఆయనకు బెయిల్ లభించినా ఊరట లభించలేదు. దీంతో, అంబటిని గుంటూరు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
మరోవైపు, ఏపీ హైకోర్టులో అంబటికి ఊరట లభించింది. పట్టాభిపురం, నగరం పాలెంతో పాటు పలు స్టేషన్లలో తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో అంబటి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో 35 (3) బీఎన్ఎస్ఎస్ ప్రొసీజర్ ఫాలో కావాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…
మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…
సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…
టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంతమంది అతణ్ని అభిమానిస్తే.. కొంతమంది తనను అదే…
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…
మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…