సీఎం చంద్రబాబును అనుచిత పదజాలంతో దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటి రాంబాబును పోలీస్ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల కస్టడీ పిటిషన్ ను గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు తిరస్కరించింది. అయితే, మరో కేసులో అంబటికి ఈ నెల 22 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
గత ఏడాది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టిన అంబటిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు 2 వారాలపాటు రిమాండ్ విధించింది. దీంతో, ఆయనకు బెయిల్ లభించినా ఊరట లభించలేదు. దీంతో, అంబటిని గుంటూరు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
మరోవైపు, ఏపీ హైకోర్టులో అంబటికి ఊరట లభించింది. పట్టాభిపురం, నగరం పాలెంతో పాటు పలు స్టేషన్లలో తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో అంబటి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో 35 (3) బీఎన్ఎస్ఎస్ ప్రొసీజర్ ఫాలో కావాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
This post was last modified on February 9, 2026 9:46 pm
మహిళలు మీసాలు పెంచలేరని.. పురుషులు గర్భాన్ని దాల్చలేరని సామెత!. అయితే.. ఇటీవల కాలంలో రష్యాకు చెందిన ఓ మహిళ మీసాలు…
విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…
ఇంకో 15 రోజుల్లో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ టికెట్ రేట్లకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలైపోయాయి. పెంచాలా…
వైసీపీ హయాంలో మూడేళ్ల క్రితం జరిగిన తన అరెస్టు ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు జరిగిన ఘటనలను…
పుట్టిన 13 రోజులకే పాస్పోర్ట్ తీసుకోవడం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని దాసన్నపేటకు చెందిన…
కొన్ని సినిమాల ఫెయిల్యూర్లు కొందరు కెరీర్ల మీద తీవ్ర ప్రభావమే చూపిస్తుంటాయి. ఒక మూవీలో చాలామంది భాగం అయినా.. కొందరి మీదే ఎక్కువ ప్రభావం…