సీఎం చంద్రబాబును అనుచిత పదజాలంతో దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటి రాంబాబును పోలీస్ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల కస్టడీ పిటిషన్ ను గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు తిరస్కరించింది. అయితే, మరో కేసులో అంబటికి ఈ నెల 22 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
గత ఏడాది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టిన అంబటిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు 2 వారాలపాటు రిమాండ్ విధించింది. దీంతో, ఆయనకు బెయిల్ లభించినా ఊరట లభించలేదు. దీంతో, అంబటిని గుంటూరు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
మరోవైపు, ఏపీ హైకోర్టులో అంబటికి ఊరట లభించింది. పట్టాభిపురం, నగరం పాలెంతో పాటు పలు స్టేషన్లలో తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో అంబటి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో 35 (3) బీఎన్ఎస్ఎస్ ప్రొసీజర్ ఫాలో కావాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…