సీఎం చంద్రబాబును అనుచిత పదజాలంతో దూషించిన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. అంబటి రాంబాబును పోలీస్ కస్టడీకి అప్పగించాలన్న పోలీసుల కస్టడీ పిటిషన్ ను గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు తిరస్కరించింది. అయితే, మరో కేసులో అంబటికి ఈ నెల 22 వరకు కోర్టు రిమాండ్ విధించింది.
గత ఏడాది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ చేపట్టిన అంబటిపై పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఆయనకు 2 వారాలపాటు రిమాండ్ విధించింది. దీంతో, ఆయనకు బెయిల్ లభించినా ఊరట లభించలేదు. దీంతో, అంబటిని గుంటూరు నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
మరోవైపు, ఏపీ హైకోర్టులో అంబటికి ఊరట లభించింది. పట్టాభిపురం, నగరం పాలెంతో పాటు పలు స్టేషన్లలో తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ హైకోర్టులో అంబటి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో 35 (3) బీఎన్ఎస్ఎస్ ప్రొసీజర్ ఫాలో కావాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.
This post was last modified on February 9, 2026 9:46 pm
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…