తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో మొదలైంది ఈ డిబేట్. ఏడాది కాలంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వాదనలు ప్రతివాదనలు ఎన్నో జరిగాయి. ఐతే దీనిపై విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థలు లడ్డులో జంతు కొవ్వులు కలిసినట్లు స్పష్టమైన ఆధారాలు లేవంటూనే.. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమని.. అసలది నెయ్యే కాదని తేల్చాయి.
కానీ వైసీపీ మాత్రం అసలు విషయాన్ని పక్కన పెట్టి.. జంతుకొవ్వులు లేవనే విషయాన్నే పట్టుకుని ఎదురుదాడి చేస్తున్నాయి. దీనికి ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు, పవన్ స్వయంగా దీటుగా బదులిచ్చారు. ఐతే ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ మీడియా స్థాయికి వెళ్లింది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డు ఇష్యూను టేకప్ చేశారు. తాజా చర్చలో లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఆయన జగన్ అండ్ కోను కడిగి పారేశారు.
లడ్డు కల్తీ జరిగిందని నివేదికలు వందశాతం తేల్చాయని.. అసలది నెయ్యే కాదని.. కెమికల్స్ మిశ్రమం అంటూ వివరాలు చదివిన అర్నాబ్.. ఇలా అడ్డంగా దొరికాక కూడా ఎదురు దాడి ఏంటని ప్రశ్నించాడు. 300 ఏళ్ల నుంచి తిరుమల లడ్డును హిందూ భక్తులు పరమ పవిత్రంగా స్వీకరిస్తున్నారని.. ఉత్తరాదిన కూడా ఈ లడ్డును అందుకుంటే అదొక ఆశీర్వాదం అనుకుంటారని..
అలాంటి ప్రసాదాన్ని 2019-24 మధ్య కల్తీ చేసిన వైసీపీ ప్రభుత్వం మహా పాపం చేసిందని అర్నాబ్ అన్నారు. క్రిస్టియన్ల విషయంలో ఇలా సెంటిమెంట్లతో మీరు ఆడుకోగలరా అని జగన్ను ప్రశ్నించిన అర్నాబ్.. చేసిన పాపానికి జనం ముందుకు వచ్చి రెండు చేతులు జోడించి క్షమాపణ అడగాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఇష్యూ మీద జరిగిన చర్చలోనూ వైసీపీ ప్రతినిధులను ఉతికి ఆరేశాడు అర్నాబ్.
రాయలసీమను కూటమి ప్రభుత్వం పెట్టుబడుల సీమగా మారుస్తోంది. పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తున్నాయి. తాజాగా దాల్మియా సిమెంట్ భారీ…
బూజు పట్టిన, ప్రజలకు పనికిరాని రూల్స్ను బుట్టదాఖలు చేయాలని సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ…
ప్రమోషన్లు చేసే పద్ధతిని సమూలంగా మార్చిన దర్శకుల్లో అనిల్ రావిపూడి పేరు ముందు వరసలో ఉంటుంది. సినిమాతో సంబంధం లేని…
రాజకీయాల్లోకి రాకముందు తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించిన జన నాయకుడు ఆరు నెలల తర్వాత విడుదలవుతున్నా కూడా రిలీజ్…
ఇటీవలే విడుదలైన హాలీవుడ్ మూవీ ఈవిల్ డెడ్ బర్న్ ఇండియా మొత్తం మీద మొదటి వీకెండ్ కాకుండానే 18 కోట్లకు…
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడ్డి కన్ను మూశారు. కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ…