Political News

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో మొదలైంది ఈ డిబేట్. ఏడాది కాలంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వాదనలు ప్రతివాదనలు ఎన్నో జరిగాయి. ఐతే దీనిపై విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థలు లడ్డులో జంతు కొవ్వులు కలిసినట్లు స్పష్టమైన ఆధారాలు లేవంటూనే.. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమని.. అసలది నెయ్యే కాదని తేల్చాయి.

కానీ వైసీపీ మాత్రం అసలు విషయాన్ని పక్కన పెట్టి.. జంతుకొవ్వులు లేవనే విషయాన్నే పట్టుకుని ఎదురుదాడి చేస్తున్నాయి. దీనికి ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు, పవన్ స్వయంగా దీటుగా బదులిచ్చారు. ఐతే ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ మీడియా స్థాయికి వెళ్లింది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డు ఇష్యూను టేకప్ చేశారు. తాజా చర్చలో లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఆయన జగన్ అండ్ కోను కడిగి పారేశారు.

లడ్డు కల్తీ జరిగిందని నివేదికలు వందశాతం తేల్చాయని.. అసలది నెయ్యే కాదని.. కెమికల్స్ మిశ్రమం అంటూ వివరాలు చదివిన అర్నాబ్.. ఇలా అడ్డంగా దొరికాక కూడా ఎదురు దాడి ఏంటని ప్రశ్నించాడు. 300 ఏళ్ల నుంచి తిరుమల లడ్డును హిందూ భక్తులు పరమ పవిత్రంగా స్వీకరిస్తున్నారని.. ఉత్తరాదిన కూడా ఈ లడ్డును అందుకుంటే అదొక ఆశీర్వాదం అనుకుంటారని..

అలాంటి ప్రసాదాన్ని 2019-24 మధ్య కల్తీ చేసిన వైసీపీ ప్రభుత్వం మహా పాపం చేసిందని అర్నాబ్ అన్నారు. క్రిస్టియన్ల విషయంలో ఇలా సెంటిమెంట్లతో మీరు ఆడుకోగలరా అని జగన్‌ను ప్రశ్నించిన అర్నాబ్.. చేసిన పాపానికి జనం ముందుకు వచ్చి రెండు చేతులు జోడించి క్షమాపణ అడగాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఇష్యూ మీద జరిగిన చర్చలోనూ వైసీపీ ప్రతినిధులను ఉతికి ఆరేశాడు అర్నాబ్.

This post was last modified on February 7, 2026 2:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

12 minutes ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

3 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

4 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

4 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

5 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

5 hours ago