Political News

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో మొదలైంది ఈ డిబేట్. ఏడాది కాలంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వాదనలు ప్రతివాదనలు ఎన్నో జరిగాయి. ఐతే దీనిపై విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థలు లడ్డులో జంతు కొవ్వులు కలిసినట్లు స్పష్టమైన ఆధారాలు లేవంటూనే.. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమని.. అసలది నెయ్యే కాదని తేల్చాయి.

కానీ వైసీపీ మాత్రం అసలు విషయాన్ని పక్కన పెట్టి.. జంతుకొవ్వులు లేవనే విషయాన్నే పట్టుకుని ఎదురుదాడి చేస్తున్నాయి. దీనికి ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు, పవన్ స్వయంగా దీటుగా బదులిచ్చారు. ఐతే ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ మీడియా స్థాయికి వెళ్లింది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డు ఇష్యూను టేకప్ చేశారు. తాజా చర్చలో లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఆయన జగన్ అండ్ కోను కడిగి పారేశారు.

లడ్డు కల్తీ జరిగిందని నివేదికలు వందశాతం తేల్చాయని.. అసలది నెయ్యే కాదని.. కెమికల్స్ మిశ్రమం అంటూ వివరాలు చదివిన అర్నాబ్.. ఇలా అడ్డంగా దొరికాక కూడా ఎదురు దాడి ఏంటని ప్రశ్నించాడు. 300 ఏళ్ల నుంచి తిరుమల లడ్డును హిందూ భక్తులు పరమ పవిత్రంగా స్వీకరిస్తున్నారని.. ఉత్తరాదిన కూడా ఈ లడ్డును అందుకుంటే అదొక ఆశీర్వాదం అనుకుంటారని..

అలాంటి ప్రసాదాన్ని 2019-24 మధ్య కల్తీ చేసిన వైసీపీ ప్రభుత్వం మహా పాపం చేసిందని అర్నాబ్ అన్నారు. క్రిస్టియన్ల విషయంలో ఇలా సెంటిమెంట్లతో మీరు ఆడుకోగలరా అని జగన్‌ను ప్రశ్నించిన అర్నాబ్.. చేసిన పాపానికి జనం ముందుకు వచ్చి రెండు చేతులు జోడించి క్షమాపణ అడగాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఇష్యూ మీద జరిగిన చర్చలోనూ వైసీపీ ప్రతినిధులను ఉతికి ఆరేశాడు అర్నాబ్.

This post was last modified on February 7, 2026 2:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

2029 ఆయుధాలు రెడీ చేసుకుంటోన్న టీడీపీ – వైసీపీ…!

2029లో జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించి వైసీపీ, టీడీపీలు ఇప్ప‌టి నుంచే ఆయుధాల‌ను రెడీ చేసుకుంటు న్నాయా? వాటికి ప‌దును కూడాపెంచుకుంటున్నాయా?…

1 hour ago

సజ్జనార్ మాటలు వింటారా?

సోష‌ల్ మీడియా యావ‌లో ప‌డిన చాలా మంది యువ‌కులు, య‌వ‌తులు త‌మ ప్రాణాల‌ను కూడా బ‌లి చేసుకుంటున్నార‌న్న‌ది వాస్త‌వం. ఇలాంటి…

2 hours ago

ఆ విషయంపై నోరు విప్పిన పవన్

వైసీపీ హ‌యాంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం చంద్ర‌బాబు, ఇత‌ర మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. అయితే.. తొలిసారి..…

4 hours ago

క‌థ మార్చార‌ని ర‌చ‌యిత హ‌ర్టు

సినిమా క‌థ‌లు ఒక‌లా మొద‌లై చివ‌రికి ఇంకో స్వ‌రూపం తీసుకోవ‌డం మామూలే. ఐతే మొద‌ట క‌థ ఇచ్చిన ర‌చ‌యిత అనుమ‌తితో..…

6 hours ago

ప్రపంచవ్యాప్తంగా అణు ఆయుధాల లెక్కలివే.. ఏ దేశం దగ్గర ఎన్ని?

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడుల నేపధ్యంలో మరోసారి న్యూక్లియర్ బాంబులపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9…

10 hours ago