Political News

జగన్‌ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి

తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో మొదలైంది ఈ డిబేట్. ఏడాది కాలంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వాదనలు ప్రతివాదనలు ఎన్నో జరిగాయి. ఐతే దీనిపై విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థలు లడ్డులో జంతు కొవ్వులు కలిసినట్లు స్పష్టమైన ఆధారాలు లేవంటూనే.. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమని.. అసలది నెయ్యే కాదని తేల్చాయి.

కానీ వైసీపీ మాత్రం అసలు విషయాన్ని పక్కన పెట్టి.. జంతుకొవ్వులు లేవనే విషయాన్నే పట్టుకుని ఎదురుదాడి చేస్తున్నాయి. దీనికి ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు, పవన్ స్వయంగా దీటుగా బదులిచ్చారు. ఐతే ఈ వ్యవహారం ఇప్పుడు జాతీయ మీడియా స్థాయికి వెళ్లింది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి లడ్డు ఇష్యూను టేకప్ చేశారు. తాజా చర్చలో లడ్డు కల్తీ వ్యవహారానికి సంబంధించి ఆయన జగన్ అండ్ కోను కడిగి పారేశారు.

లడ్డు కల్తీ జరిగిందని నివేదికలు వందశాతం తేల్చాయని.. అసలది నెయ్యే కాదని.. కెమికల్స్ మిశ్రమం అంటూ వివరాలు చదివిన అర్నాబ్.. ఇలా అడ్డంగా దొరికాక కూడా ఎదురు దాడి ఏంటని ప్రశ్నించాడు. 300 ఏళ్ల నుంచి తిరుమల లడ్డును హిందూ భక్తులు పరమ పవిత్రంగా స్వీకరిస్తున్నారని.. ఉత్తరాదిన కూడా ఈ లడ్డును అందుకుంటే అదొక ఆశీర్వాదం అనుకుంటారని..

అలాంటి ప్రసాదాన్ని 2019-24 మధ్య కల్తీ చేసిన వైసీపీ ప్రభుత్వం మహా పాపం చేసిందని అర్నాబ్ అన్నారు. క్రిస్టియన్ల విషయంలో ఇలా సెంటిమెంట్లతో మీరు ఆడుకోగలరా అని జగన్‌ను ప్రశ్నించిన అర్నాబ్.. చేసిన పాపానికి జనం ముందుకు వచ్చి రెండు చేతులు జోడించి క్షమాపణ అడగాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఇష్యూ మీద జరిగిన చర్చలోనూ వైసీపీ ప్రతినిధులను ఉతికి ఆరేశాడు అర్నాబ్.

This post was last modified on February 7, 2026 2:14 pm

Share

Recent Posts

ఆ భూములన్నీ తన కష్టార్జితమే అన్న కవిత!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బుధవారం సాయంత్రం అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి చెందినవారు, ఆయన పార్టీకి…

7 minutes ago

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

2 hours ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

2 hours ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

2 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

2 hours ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

3 hours ago