రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ నుంచి దక్షిణాది సహా ఉత్తర భారతంలో అనేక ధార్మిక సంస్థలు ఉన్నాయి. కంచి కామాక్షీ పీఠం నుంచి శ్రీకృష్ణ మఠం వరకు.. ఎన్నో సంస్థలు ధార్మిక వాదనలు చేస్తున్నాయి. ధర్మాన్ని ప్రబోధిస్తున్నాయి. మరి వీరికి తిరుమల లడ్డూ వ్యవహారం పట్టదా? అనేది ప్రశ్న. ఏపీలో జరుగుతున్న వ్యవహారంపై ఇప్పటి వరకు ధార్మిక సంస్థలుగా ఉన్న ఏ ఒక్కటీ స్పందించలేదు.
ముఖ్యంగా చిన్నజీయరు స్వామి ఆధ్వరంలోని జీయర్ మఠం తిరుమలలోనే ఉంది. అదేవిధంగా తమిళనాడుకు చెందిన మఠాలు కూడా అక్కడే తిష్ఠవేశాయి. శ్రీవారి కైంకర్యాలకు ప్రత్యేక సూచనలు కూడా చేస్తున్నారు. అలాంటి సంస్థలు.. శ్రీవారి కల్తీ లడ్డూ వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలోని సిట్ ఇచ్చిన నివేదికపై ఎందుకు మౌనంగా ఉన్నాయన్నది ప్రశ్న.
వీరే కాదు.. వ్యక్తిగతంగా అనేక మంది మఠాధిపతులు కూడా తిరుమల శ్రీవారి కొండపై నాచుమొక్కను పీకినా స్పందిస్తారే.. మరి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ఎసరు పెడుతూ.. వైసీపీ హయాంలో జరిగిన నెయ్యి కల్తీపై ఎందుకు స్పందించరు?!.
ఆర్ ఎస్ ఎస్ మాటేంటి?
ఇక, దేశంలో హిందూత్వకు తామేపునాదులు వేశామని.. గొడుగులు పడుతున్నామని చెప్పుకొనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్) ఏం చేస్తోంది.? అనేది ప్రధాన ప్రశ్న. దేశంలో ధర్మాన్ని నిలబెడతామని.. అందరూ ధర్మాన్ని పాటించాలని ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పదే పదే చెబుతుంటారు. దేశవ్యాప్తంగా ధర్మాన్ని కూడా ఆయన ప్రచారం చేస్తుంటారు. మరి అలాంటి వారు ఇప్పుడు ఎందుకు నోరు పెగల్చలేక పోతున్నారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం ఒక ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారం. అంతేకాదు.. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవారి పవిత్రతతకు సంబంధించిన అంశం. ఇలాంటి అంశాలను చూసీ చూడనట్టు.. వినీ విననట్టు వ్యవహరిస్తే.. సదరు మఠాలు, ధార్మిక సంస్థలు, ఆర్ ఎస్ ఎస్ వంటి హిందూత్వ సంస్థలు భవిష్యత్తు వర్గాలకు.. ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నట్టు?! అనేది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇది రాజకీయ రొచ్చుకాదని.. హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయమనిగ్రహించి.. వారి వాదనను ప్రజల మధ్యకు తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on February 7, 2026 8:26 am
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…