Political News

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ నుంచి ద‌క్షిణాది స‌హా ఉత్త‌ర భారతంలో అనేక ధార్మిక సంస్థ‌లు ఉన్నాయి. కంచి కామాక్షీ పీఠం నుంచి శ్రీకృష్ణ మ‌ఠం వ‌ర‌కు.. ఎన్నో సంస్థ‌లు ధార్మిక వాద‌న‌లు చేస్తున్నాయి. ధ‌ర్మాన్ని ప్ర‌బోధిస్తున్నాయి. మ‌రి వీరికి తిరుమ‌ల ల‌డ్డూ వ్య‌వ‌హారం ప‌ట్ట‌దా? అనేది ప్ర‌శ్న‌. ఏపీలో జ‌రుగుతున్న వ్య‌వ‌హారంపై ఇప్ప‌టి వ‌ర‌కు ధార్మిక సంస్థ‌లుగా ఉన్న ఏ ఒక్క‌టీ స్పందించ‌లేదు.

ముఖ్యంగా చిన్న‌జీయ‌రు స్వామి ఆధ్వ‌రంలోని జీయ‌ర్ మ‌ఠం తిరుమ‌ల‌లోనే ఉంది. అదేవిధంగా త‌మిళ‌నాడుకు చెందిన మ‌ఠాలు కూడా అక్క‌డే తిష్ఠ‌వేశాయి. శ్రీవారి కైంక‌ర్యాల‌కు ప్ర‌త్యేక సూచ‌న‌లు కూడా చేస్తున్నారు. అలాంటి సంస్థ‌లు.. శ్రీవారి క‌ల్తీ ల‌డ్డూ వ్య‌వ‌హారంపై సీబీఐ నేతృత్వంలోని సిట్ ఇచ్చిన నివేదిక‌పై ఎందుకు మౌనంగా ఉన్నాయ‌న్న‌ది ప్ర‌శ్న‌.

వీరే కాదు.. వ్య‌క్తిగ‌తంగా అనేక మంది మ‌ఠాధిప‌తులు కూడా తిరుమ‌ల శ్రీవారి కొండ‌పై నాచుమొక్క‌ను పీకినా స్పందిస్తారే.. మ‌రి కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాల‌కు ఎస‌రు పెడుతూ.. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన నెయ్యి క‌ల్తీపై ఎందుకు స్పందించ‌రు?!.

ఆర్ ఎస్ ఎస్ మాటేంటి?

ఇక‌, దేశంలో హిందూత్వ‌కు తామేపునాదులు వేశామ‌ని.. గొడుగులు ప‌డుతున్నామ‌ని చెప్పుకొనే రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్‌) ఏం చేస్తోంది.? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. దేశంలో ధ‌ర్మాన్ని నిల‌బెడ‌తామ‌ని.. అంద‌రూ ధ‌ర్మాన్ని పాటించాల‌ని ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహ‌న్ భాగ‌వ‌త్ ప‌దే ప‌దే చెబుతుంటారు. దేశ‌వ్యాప్తంగా ధ‌ర్మాన్ని కూడా ఆయ‌న ప్ర‌చారం చేస్తుంటారు. మ‌రి అలాంటి వారు ఇప్పుడు ఎందుకు నోరు పెగ‌ల్చ‌లేక పోతున్నారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ వ్య‌వ‌హారం ఒక ప్ర‌భుత్వానికి సంబంధించిన వ్య‌వ‌హారం కాదు. కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాల‌కు సంబంధించిన వ్య‌వ‌హారం. అంతేకాదు.. అఖిలాండ కోటి బ్ర‌హ్మాండ‌నాయ‌కుడైన శ్రీవారి ప‌విత్ర‌త‌త‌కు సంబంధించిన అంశం. ఇలాంటి అంశాల‌ను చూసీ చూడ‌న‌ట్టు.. వినీ విన‌న‌ట్టు వ్య‌వ‌హరిస్తే.. స‌ద‌రు మ‌ఠాలు, ధార్మిక సంస్థ‌లు, ఆర్ ఎస్ ఎస్ వంటి హిందూత్వ సంస్థ‌లు భ‌విష్య‌త్తు వ‌ర్గాల‌కు.. ఎలాంటి సందేశాన్ని ఇస్తున్న‌ట్టు?! అనేది ఆలోచ‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

ఇది రాజ‌కీయ రొచ్చుకాద‌ని.. హిందువుల మ‌నోభావాల‌కు సంబంధించిన విష‌యమ‌నిగ్ర‌హించి.. వారి వాద‌న‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ప‌లువురు ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

Kumar

Recent Posts

అంత అత్యాశ ఎందుకు ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…

4 hours ago

అవమానంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ‘అల్ఫా’

మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…

4 hours ago

సంయుక్త హాట్ మోడ్ అదిరింది

సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…

5 hours ago

నాగార్జున నోట‌… చింటు మాట‌

టాలీవుడ్ నిర్మాతల్లో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీకి సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంత‌మంది అత‌ణ్ని అభిమానిస్తే.. కొంత‌మంది త‌న‌ను అదే…

5 hours ago

చింతమనేని Vs పవన్… ఎలా ముగిసింది?

టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…

5 hours ago

దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్

మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…

7 hours ago