Political News

‘ఆ నెయ్యి’లో బాత్‌రూం క్లీన్ చేసే రసాయనాలు: చంద్రబాబు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ లడ్డూలో వినియోగించిన నెయ్యిలో మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు ఉపయోగించే రసాయనాలు వాడారని ఆయన తెలిపారు. ఇది భక్తుల మనో విశ్వాసాలతోనే కాదు, తిరుమల శ్రీవారి పవిత్రతతో కూడా ఆడుకోవడం కాదా అని వైసీపీ నాయకులను ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని వెలికి తీస్తుంటే వైసీపీ నాయకులు ఎదురు దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పలువురికి పట్టా పుస్తకాలను అందించారు. అనంతరం మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డూలో వినియోగించిన నెయ్యిపై వైసీపీ ఎదురు దాడి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే నియమించిన కమిటీ కల్తీ జరిగినట్టు స్పష్టంగా చెప్పినా, ఏమీ జరగలేదని పేర్కొంటూ క్లీన్ చిట్ ఇచ్చారనే ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని సీఎం తెలిపారు. ఒక్క తిరుమల శ్రీవారి లడ్డూలోనే కాకుండా శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి వాడినట్టు తనకు నివేదికలు అందాయని చంద్రబాబు చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులను బదిలీ చేశామని, ఆలయాల పవిత్రతను కాపాడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమల, శ్రీశైలం లడ్డూ ప్రసాదాలు ఎంతో రుచిగా, పవిత్రంగా ఉన్నాయని భక్తులే చెబుతున్నారని పేర్కొన్నారు.

ఇక పాస్ బుక్స్ ద్వారా రైతులకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గతంలో భూములు ఒకరి వాటిని మరొకరు ఆక్రమించుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా చేశామని చెప్పారు. ఎవరి ఫోన్లలో వారు తమ భూముల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. దీనివల్ల రైతులకు, ప్రజలకు భూ కబ్జా సమస్యలు తగ్గుతాయని అన్నారు. అదే సమయంలో లంచాల వ్యవస్థకు కూడా పూర్తిగా అడ్డుకట్ట వేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

This post was last modified on February 6, 2026 10:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

33 minutes ago

‘ఏపీలో కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు’…అసలేంటిది?

'ఏపీలో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు లాగా జగన్ "కల్తీ రిక్రూట్‌మెంట్ బోర్డు" అనే వ్యవస్థను స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా…

2 hours ago

మొన్న అంబటి.. నేడు జోగి తప్పేం లేదంటోన్న జగన్

ఒక పార్టీకి అధినేత అయిన వ్యక్తి తన పార్టీకి చెందిన నేతలను కాపాడుకోవాలనుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. కానీ, ఆ…

2 hours ago

హమ్మయ్య… ఎట్టకేలకు దొరికిన పెద్దపులి

తూర్పు గోదావరి ప్రజలకు వారం నుండి కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్దపులిని అధికారులు కొద్దిసేపటి క్రితమే మత్తు…

3 hours ago

టీటీడీకి కొత్త ఈవో.. సవాళ్ల స్వాగతమేనా?!

తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఇంచార్జ్ కార్యనిర్వహణాధికారి (ఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు.…

3 hours ago

బీఆర్‌ఎస్‌కు ఓటు వేయొద్దని కవిత పిలుపు

బీఆర్ ఎస్ పార్టీ మాజీ నాయకురాలు, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం…

3 hours ago