Political News

‘ఆ నెయ్యి’లో బాత్‌రూం క్లీన్ చేసే రసాయనాలు: చంద్రబాబు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ లడ్డూలో వినియోగించిన నెయ్యిలో మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు ఉపయోగించే రసాయనాలు వాడారని ఆయన తెలిపారు. ఇది భక్తుల మనో విశ్వాసాలతోనే కాదు, తిరుమల శ్రీవారి పవిత్రతతో కూడా ఆడుకోవడం కాదా అని వైసీపీ నాయకులను ఉద్దేశించి చంద్రబాబు ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని వెలికి తీస్తుంటే వైసీపీ నాయకులు ఎదురు దాడి చేస్తున్నారని నిప్పులు చెరిగారు.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శుక్రవారం సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ‘మీ భూమి మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొని పలువురికి పట్టా పుస్తకాలను అందించారు. అనంతరం మాట్లాడుతూ తిరుమల శ్రీవారి లడ్డూలో వినియోగించిన నెయ్యిపై వైసీపీ ఎదురు దాడి చేస్తోందని తెలిపారు. ఇప్పటికే నియమించిన కమిటీ కల్తీ జరిగినట్టు స్పష్టంగా చెప్పినా, ఏమీ జరగలేదని పేర్కొంటూ క్లీన్ చిట్ ఇచ్చారనే ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని సీఎం తెలిపారు. ఒక్క తిరుమల శ్రీవారి లడ్డూలోనే కాకుండా శ్రీశైలం మల్లన్న ఆలయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి వాడినట్టు తనకు నివేదికలు అందాయని చంద్రబాబు చెప్పారు. వెంటనే సంబంధిత అధికారులను బదిలీ చేశామని, ఆలయాల పవిత్రతను కాపాడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తిరుమల, శ్రీశైలం లడ్డూ ప్రసాదాలు ఎంతో రుచిగా, పవిత్రంగా ఉన్నాయని భక్తులే చెబుతున్నారని పేర్కొన్నారు.

ఇక పాస్ బుక్స్ ద్వారా రైతులకు, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గతంలో భూములు ఒకరి వాటిని మరొకరు ఆక్రమించుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా చేశామని చెప్పారు. ఎవరి ఫోన్లలో వారు తమ భూముల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకునే అవకాశం కల్పించామని తెలిపారు. దీనివల్ల రైతులకు, ప్రజలకు భూ కబ్జా సమస్యలు తగ్గుతాయని అన్నారు. అదే సమయంలో లంచాల వ్యవస్థకు కూడా పూర్తిగా అడ్డుకట్ట వేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

This post was last modified on February 6, 2026 10:12 pm

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

3 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

6 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

6 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

6 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

7 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

7 hours ago