Political News

జగన్ పర్యటనలు: క్యాడర్‌కు జోష్.. జనాలకు ట్రాఫిక్ కష్టాలు

పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్‌లు.. కాన్వాయ్ నడుస్తుండగా చుట్టూ జనాలు.. పార్టీ జెండాలు.. పూల వర్షాలు.. సందర్భం ఏదైనా కావచ్చు.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్ చేస్తున్న యాత్రల తీరు ఇదే. గంటలోపు పూర్తయ్యే ప్రయాణం 6 గంటల పాటు సాగడం సాధారణమైపోయింది. జనాలను సమీకరిస్తున్నారా? కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తున్నారా? అన్నది పక్కన పెడితే, దాదాపు ఏడాది కాలంగా ఒకే రీతిలో మూస పద్ధతిలో సాగుతున్న జగన్ పరామర్శ పర్యటనలపై చర్చ జరుగుతోంది.

గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. అంతకుముందు ఓదార్పు యాత్ర చేశారు. ఆ యాత్రలకు ఇప్పుడు చేస్తున్న పర్యటనలకు పెద్దగా తేడా కనిపించడం లేదు. ప్రజల్లో భావోద్వేగాలను ప్రేరేపించే విధంగానే ఈ యాత్రలు సాగుతున్నాయి. మరోవైపు సామాన్య జనాలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మొన్న జరిగిన గుంటూరు పర్యటన సుమారు 6 గంటల పాటు సాగింది. ఈ పర్యటన కారణంగా నగర ప్రజలు తీవ్ర ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొన్నారు. వైసీపీ యువ కార్యకర్తల హడావుడి కూడా ఎక్కువగానే కనిపించింది. అదే దృశ్యం ఇబ్రహీంపట్నం పర్యటనలో కూడా కనిపించింది.

6 గంటల పాటు జనాన్ని వెంటబెట్టుకుని ప్రయాణం చేయడం, అరగంట పాటు విలేకరులతో మాట్లాడడం, పోలీసులకు మరియు ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం వంటి అంశాలు పునరావృతమవుతున్నాయి. ‘జంగిల్ రాజ్’ అనే పదాన్ని పదేపదే ఉపయోగిస్తున్నారు. అయితే నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మీరు ఇలా పర్యటనలు చేసేవారా? అని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతున్నందునే జగన్ ప్రశాంతంగా పర్యటిస్తున్నారని వారు అంటున్నారు.

జగన్ పర్యటనలపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు పర్యటనపై స్పందిస్తూ, గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లడానికి 6 గంటలు పట్టాలా? రోడ్డుపై ఇంకెవరూ వెళ్లకూడదా? రోడ్డంతా బ్లాక్ చేసి రౌడీయిజం చేస్తారా? అని ప్రశ్నించారు.

మొత్తం మీద వైఎస్ జగన్ పర్యటనలు ఒకే తరహాలో కొనసాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్ ఉన్నట్లే, ఇప్పుడు పబ్లిక్ మేనేజ్మెంట్ తరహాలో పర్యటనలు సాగుతున్నాయని చర్చ జరుగుతోంది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచడానికి ఇవి ఉపయోగపడవచ్చు. కానీ సామాన్య ప్రజల్లో మాత్రం కొంత అసహనాన్ని కలిగిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Satya

Recent Posts

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

1 hour ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

1 hour ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

3 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

5 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

6 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

7 hours ago