పదుల సంఖ్యలో కార్లు, వందల సంఖ్యలో బైక్లు.. కాన్వాయ్ నడుస్తుండగా చుట్టూ జనాలు.. పార్టీ జెండాలు.. పూల వర్షాలు.. సందర్భం ఏదైనా కావచ్చు.. పరామర్శల పేరుతో వైఎస్ జగన్ చేస్తున్న యాత్రల తీరు ఇదే. గంటలోపు పూర్తయ్యే ప్రయాణం 6 గంటల పాటు సాగడం సాధారణమైపోయింది. జనాలను సమీకరిస్తున్నారా? కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తున్నారా? అన్నది పక్కన పెడితే, దాదాపు ఏడాది కాలంగా ఒకే రీతిలో మూస పద్ధతిలో సాగుతున్న జగన్ పరామర్శ పర్యటనలపై చర్చ జరుగుతోంది.
గతంలో వైఎస్ జగన్ పాదయాత్ర చేశారు. అంతకుముందు ఓదార్పు యాత్ర చేశారు. ఆ యాత్రలకు ఇప్పుడు చేస్తున్న పర్యటనలకు పెద్దగా తేడా కనిపించడం లేదు. ప్రజల్లో భావోద్వేగాలను ప్రేరేపించే విధంగానే ఈ యాత్రలు సాగుతున్నాయి. మరోవైపు సామాన్య జనాలను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మొన్న జరిగిన గుంటూరు పర్యటన సుమారు 6 గంటల పాటు సాగింది. ఈ పర్యటన కారణంగా నగర ప్రజలు తీవ్ర ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొన్నారు. వైసీపీ యువ కార్యకర్తల హడావుడి కూడా ఎక్కువగానే కనిపించింది. అదే దృశ్యం ఇబ్రహీంపట్నం పర్యటనలో కూడా కనిపించింది.
6 గంటల పాటు జనాన్ని వెంటబెట్టుకుని ప్రయాణం చేయడం, అరగంట పాటు విలేకరులతో మాట్లాడడం, పోలీసులకు మరియు ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం వంటి అంశాలు పునరావృతమవుతున్నాయి. ‘జంగిల్ రాజ్’ అనే పదాన్ని పదేపదే ఉపయోగిస్తున్నారు. అయితే నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మీరు ఇలా పర్యటనలు చేసేవారా? అని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిపాలన కొనసాగుతున్నందునే జగన్ ప్రశాంతంగా పర్యటిస్తున్నారని వారు అంటున్నారు.
జగన్ పర్యటనలపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు పర్యటనపై స్పందిస్తూ, గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లడానికి 6 గంటలు పట్టాలా? రోడ్డుపై ఇంకెవరూ వెళ్లకూడదా? రోడ్డంతా బ్లాక్ చేసి రౌడీయిజం చేస్తారా? అని ప్రశ్నించారు.
మొత్తం మీద వైఎస్ జగన్ పర్యటనలు ఒకే తరహాలో కొనసాగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో పోల్ మేనేజ్మెంట్ ఉన్నట్లే, ఇప్పుడు పబ్లిక్ మేనేజ్మెంట్ తరహాలో పర్యటనలు సాగుతున్నాయని చర్చ జరుగుతోంది. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచడానికి ఇవి ఉపయోగపడవచ్చు. కానీ సామాన్య ప్రజల్లో మాత్రం కొంత అసహనాన్ని కలిగిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on February 6, 2026 6:53 pm
సాధారణంగా ఢిల్లీ లాంటి పెద్ద నగరాల్లో మనుషులు కనిపించకుండా పోవడం గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. అయితే ఇటీవల…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఆ లడ్డూలో…
'ఏపీలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లాగా జగన్ "కల్తీ రిక్రూట్మెంట్ బోర్డు" అనే వ్యవస్థను స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా…
ఒక పార్టీకి అధినేత అయిన వ్యక్తి తన పార్టీకి చెందిన నేతలను కాపాడుకోవాలనుకోవడంలో ఎటువంటి తప్పూ లేదు. కానీ, ఆ…
తూర్పు గోదావరి ప్రజలకు వారం నుండి కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్దపులిని అధికారులు కొద్దిసేపటి క్రితమే మత్తు…
తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త ఇంచార్జ్ కార్యనిర్వహణాధికారి (ఈవో)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు.…