అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందా? అంటే మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి ఆరోపించారు కాబట్టి ఔననే అనాలా? లేక ప్రస్తుత, గత పరిణామాలను అంచనా వేస్తే కాదని అనాలా? అనేది ప్రశ్న. ఎందుకంటే క్రాంతి అనుకుంటున్నట్టుగా కాపులను అంతగా ప్రభావితం చేసే శక్తి అంబటికి లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఒకప్పుడు అంబటికి కొంత గౌరవం ఉండేది. కానీ తరువాత పదేపదే పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం, గంటల తరబడి వ్యాఖ్యలు చేయడం వంటివి కాపుల్లో ఆయన ఇమేజ్ను గణనీయంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా పవన్కు సవాళ్లు విసిరిన తీరు కాపులలో చాలా మందికి నచ్చలేదనే అభిప్రాయం ఉంది. అందుకే ఇటీవల ఆయన చుట్టూ వివాదం చెలరేగినా, ఇంటిపై దాడి జరిగినా, అరెస్టు చేసి జైలుకు తరలించినా కాపు వర్గాల్లో పెద్దగా అలజడి కనిపించలేదని చెబుతున్నారు.
అంతేకాదు, కాపు నాయకులు లేదా మేధావులు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ముద్రగడ పద్మనాభం మాత్రమే స్పందించారు. అయితే ఆయన లేఖలు, వ్యాఖ్యలను కూడా కాపులు గతంలా పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. ఎందుకంటే ఆయన న్యూట్రల్ రాజకీయాలు చేసినంత వరకు, కాపుల కోసం ఉద్యమించినంత వరకు ఆదరణ లభించింది. కానీ వైసీపీకి అనుకూలంగా మారిన తర్వాత ఆయన ప్రభావం తగ్గిందని అంటున్నారు.
ఈ పరిణామాలను పరిశీలిస్తే అంబటి ఎపిసోడ్ కాపులను గణనీయంగా ప్రభావితం చేసినట్టు ఆధారాలు కనిపించడం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలే ఆయనకు నష్టం చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు.
మొత్తంగా చూస్తే క్రాంతి వ్యక్తం చేసిన ఆవేదనకు పెద్ద రాజకీయ ప్రభావం కనిపించడం లేదని, అంబటి చుట్టూ కాపు సెంటిమెంట్ పెరుగుతుందన్న వాదనకు బలమైన ఆధారాలు లేవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on February 5, 2026 4:41 pm
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…