Political News

కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత విషయంలో పలు సందేహాలు వస్తున్నాయన్న చర్చ జరిగింది. ముఖ్యంగా రెండు కీలక అంశాలపై ప్రజల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా రాజకీయ వివాదాలను ఎదుర్కొనాలన్నది ఇప్పుడు ప్రధాన లక్ష్యం.

తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య పోరుగా చర్చ సాగుతోంది. అంటే.. దీనిలో ఇతర కూటమి పార్టీలకు సంబంధం లేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాత్రమే పోరు సాగుతోంది. వాస్తవానికి గతంలోనే ఏ సమస్య వచ్చిన కలసి కట్టుగా స్పందించాలని, ఎదుర్కొనాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ, తాజా పరిణామాల్లో జనసేన పార్టిసిపేషన్ తగ్గింది.

జనసేన నేతలు చేస్తున్న రాజకీయ వ్యవహారాలు కూడా కాకరేపుతున్నాయి. అరవ శ్రీధర్ ఎపిసోడ్ నుంచి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ అధికార ప్రతినిధి రజనీ సహా పలువురు నాయకుల వ్యవహారం ఈ పార్టీని కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎదురుదాడి కనిపిస్తోంది. దీనికి బలమైన కౌంటర్ ఇచ్చే విషయంలో టీడీపీ నేతలు సహా బీజేపీ నాయకులు కలిసి రావడం లేదన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమిపై అనుమానాలు పెరిగాయి.

దీనిని పసిగట్టిన సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు హుటాహుటిన భేటీ అయ్యారు. పైకి రాజ్యసభ వ్యవహారమేనని అంటున్నా, అంతర్గత చర్చల్లో సఖ్యత పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకుని, నాయకుల మధ్య కలివిడిని పెంచకపోతే ఇది రాబోయే రోజుల్లో ఇబ్బందులకు గురిచేయొచ్చని భావిస్తున్నారు. అందుకే సఖ్యతపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సో, మొత్తంగా చూస్తే కూటమి బలం తగ్గలేదన్న సంకేతాలు ఇస్తున్నారు.

This post was last modified on February 5, 2026 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పాపం కాదు… బాగుంది ప్రయత్నం అనిపించాలి

తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం…

3 minutes ago

ఇక ఎవరొచ్చినా అమరావతిని ముట్టుకోలేరు

తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి,…

27 minutes ago

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

1 hour ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

2 hours ago

పవన్ భార్యకు కూడా చిరు అన్నయే…

​మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…

2 hours ago

‘ఉస్తాద్’కు లాస్ట్ ఛాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ముందు అనుకున్న ప్రకారం అయితే ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ…

3 hours ago