Political News

కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత విషయంలో పలు సందేహాలు వస్తున్నాయన్న చర్చ జరిగింది. ముఖ్యంగా రెండు కీలక అంశాలపై ప్రజల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా రాజకీయ వివాదాలను ఎదుర్కొనాలన్నది ఇప్పుడు ప్రధాన లక్ష్యం.

తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య పోరుగా చర్చ సాగుతోంది. అంటే.. దీనిలో ఇతర కూటమి పార్టీలకు సంబంధం లేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాత్రమే పోరు సాగుతోంది. వాస్తవానికి గతంలోనే ఏ సమస్య వచ్చిన కలసి కట్టుగా స్పందించాలని, ఎదుర్కొనాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ, తాజా పరిణామాల్లో జనసేన పార్టిసిపేషన్ తగ్గింది.

జనసేన నేతలు చేస్తున్న రాజకీయ వ్యవహారాలు కూడా కాకరేపుతున్నాయి. అరవ శ్రీధర్ ఎపిసోడ్ నుంచి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ అధికార ప్రతినిధి రజనీ సహా పలువురు నాయకుల వ్యవహారం ఈ పార్టీని కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎదురుదాడి కనిపిస్తోంది. దీనికి బలమైన కౌంటర్ ఇచ్చే విషయంలో టీడీపీ నేతలు సహా బీజేపీ నాయకులు కలిసి రావడం లేదన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమిపై అనుమానాలు పెరిగాయి.

దీనిని పసిగట్టిన సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు హుటాహుటిన భేటీ అయ్యారు. పైకి రాజ్యసభ వ్యవహారమేనని అంటున్నా, అంతర్గత చర్చల్లో సఖ్యత పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకుని, నాయకుల మధ్య కలివిడిని పెంచకపోతే ఇది రాబోయే రోజుల్లో ఇబ్బందులకు గురిచేయొచ్చని భావిస్తున్నారు. అందుకే సఖ్యతపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సో, మొత్తంగా చూస్తే కూటమి బలం తగ్గలేదన్న సంకేతాలు ఇస్తున్నారు.

This post was last modified on February 5, 2026 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

36 minutes ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

2 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

3 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

6 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

10 hours ago

మోడీపై సీనియర్ నటుడి ఊహించ‌ని ఎలివేషన్

సినిమా వాళ్ల‌కు రాజ‌కీయ ఆస‌క్తులు, అభిమానాలు ఉండ‌డం కొత్త కాదు. అందులో త‌ప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజ‌కీయాల…

10 hours ago