Political News

కూటమి మరింత స్ట్రాంగ్…!

ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత విషయంలో పలు సందేహాలు వస్తున్నాయన్న చర్చ జరిగింది. ముఖ్యంగా రెండు కీలక అంశాలపై ప్రజల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా రాజకీయ వివాదాలను ఎదుర్కొనాలన్నది ఇప్పుడు ప్రధాన లక్ష్యం.

తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య పోరుగా చర్చ సాగుతోంది. అంటే.. దీనిలో ఇతర కూటమి పార్టీలకు సంబంధం లేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాత్రమే పోరు సాగుతోంది. వాస్తవానికి గతంలోనే ఏ సమస్య వచ్చిన కలసి కట్టుగా స్పందించాలని, ఎదుర్కొనాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ, తాజా పరిణామాల్లో జనసేన పార్టిసిపేషన్ తగ్గింది.

జనసేన నేతలు చేస్తున్న రాజకీయ వ్యవహారాలు కూడా కాకరేపుతున్నాయి. అరవ శ్రీధర్ ఎపిసోడ్ నుంచి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ అధికార ప్రతినిధి రజనీ సహా పలువురు నాయకుల వ్యవహారం ఈ పార్టీని కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎదురుదాడి కనిపిస్తోంది. దీనికి బలమైన కౌంటర్ ఇచ్చే విషయంలో టీడీపీ నేతలు సహా బీజేపీ నాయకులు కలిసి రావడం లేదన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమిపై అనుమానాలు పెరిగాయి.

దీనిని పసిగట్టిన సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు హుటాహుటిన భేటీ అయ్యారు. పైకి రాజ్యసభ వ్యవహారమేనని అంటున్నా, అంతర్గత చర్చల్లో సఖ్యత పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకుని, నాయకుల మధ్య కలివిడిని పెంచకపోతే ఇది రాబోయే రోజుల్లో ఇబ్బందులకు గురిచేయొచ్చని భావిస్తున్నారు. అందుకే సఖ్యతపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సో, మొత్తంగా చూస్తే కూటమి బలం తగ్గలేదన్న సంకేతాలు ఇస్తున్నారు.

This post was last modified on February 5, 2026 4:59 pm

Share

Recent Posts

రక్తంతో రాసుకున్న ‘ప్యారడైజ్’ శాసనం

న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24 విడుదలకు రెడీ…

44 minutes ago

డీఎస్సీపైనే వైసీపీకి ఎందుకంత మంకుపట్టు?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు, ఒక్క ఉపాధ్యాయ నియామకాన్ని…

1 hour ago

కొత్త మార్పుల వైపు చరణ్ & సుకుమార్ ?

ఇంకా ప్రారంభం కాలేదు కానీ క్యాస్టింగ్ ముందే ఫైనల్ చేసుకోవాలి కాబట్టి ఆర్సి 17కి సంబంధించిన పనుల్లో సుకుమార్ టీమ్…

2 hours ago

నాగార్జున 100 గురించి ఎప్పుడు చెబుతారు

అక్కినేని నాగార్జున వందో సినిమా హడవిడి లేకుండా షూటింగ్ జరుపుకుంటోంది. మాములుగా ఏదో ఒక అప్డేట్ లీకుల రూపంలో కానీ…

3 hours ago

జార్ఖండ్ లో మరో సోనమ్ వాంగ్ చుక్ దీక్ష

దేశంలో ఎక్కడ చూసినా విద్యార్థి ఉద్యమాలు జరుగున్నాయి. ఢిల్లీ నుంచి మొదలుపెట్టుకొని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్…

5 hours ago

హీలియం సిలిండర్… సిఏ ఆత్మహత్య

హైదరాబాద్‌కు చెందిన 33 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ సిద్దిపేటలోని ఒక హోటల్ గదిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.…

5 hours ago