ఏపీలో కూటమి ప్రభుత్వం మరింత బలోపేతం అవుతోందా? పార్టీల మధ్య సమన్వయం కట్టుతప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సఖ్యత విషయంలో పలు సందేహాలు వస్తున్నాయన్న చర్చ జరిగింది. ముఖ్యంగా రెండు కీలక అంశాలపై ప్రజల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉమ్మడిగా రాజకీయ వివాదాలను ఎదుర్కొనాలన్నది ఇప్పుడు ప్రధాన లక్ష్యం.
తిరుమల లడ్డూ వ్యవహారంపై వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య పోరుగా చర్చ సాగుతోంది. అంటే.. దీనిలో ఇతర కూటమి పార్టీలకు సంబంధం లేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారంపై వైసీపీ నేతలు వర్సెస్ టీడీపీ నేతల మధ్య మాత్రమే పోరు సాగుతోంది. వాస్తవానికి గతంలోనే ఏ సమస్య వచ్చిన కలసి కట్టుగా స్పందించాలని, ఎదుర్కొనాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ, తాజా పరిణామాల్లో జనసేన పార్టిసిపేషన్ తగ్గింది.
జనసేన నేతలు చేస్తున్న రాజకీయ వ్యవహారాలు కూడా కాకరేపుతున్నాయి. అరవ శ్రీధర్ ఎపిసోడ్ నుంచి బొలిశెట్టి సత్యనారాయణ, పార్టీ అధికార ప్రతినిధి రజనీ సహా పలువురు నాయకుల వ్యవహారం ఈ పార్టీని కూడా ఇబ్బంది పెడుతోంది. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎదురుదాడి కనిపిస్తోంది. దీనికి బలమైన కౌంటర్ ఇచ్చే విషయంలో టీడీపీ నేతలు సహా బీజేపీ నాయకులు కలిసి రావడం లేదన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమిపై అనుమానాలు పెరిగాయి.
దీనిని పసిగట్టిన సీఎం చంద్రబాబు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు హుటాహుటిన భేటీ అయ్యారు. పైకి రాజ్యసభ వ్యవహారమేనని అంటున్నా, అంతర్గత చర్చల్లో సఖ్యత పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేసుకుని, నాయకుల మధ్య కలివిడిని పెంచకపోతే ఇది రాబోయే రోజుల్లో ఇబ్బందులకు గురిచేయొచ్చని భావిస్తున్నారు. అందుకే సఖ్యతపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సో, మొత్తంగా చూస్తే కూటమి బలం తగ్గలేదన్న సంకేతాలు ఇస్తున్నారు.
This post was last modified on February 5, 2026 4:59 pm
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
దేశ రాజధానిలో ఈరోజు భారత్ ట్యాక్సీ అడుగుపెట్టడంతో క్యాబ్ సర్వీసుల రంగంలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఓలా, ఉబేర్…
ఈ రోజుల్లో చిన్న సినిమాలు ప్రేక్షకుల దృష్టిలో పడడం.. వాళ్లు థియేటర్లు రావడం కష్టమైపోయింది. అందుకోసం ప్రమోషన్లను విభిన్న రీతిలో నిర్వహిస్తూ.. తమ…