Political News

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదని, అదనంగా వసూలు చేస్తున్నారని, ఎంఆర్‌పీ ధరలకే మద్యం విక్రయించాల‌ని చెప్పినా ఎవరూ స్పందించడం లేదన్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పవన్ హెచ్చరించారు.

లిక్కర్ వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలపై నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజలను దోచుకుంటే చూస్తూ ఊరుకోబోమని, దీనికి అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా పవన్ స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మద్యం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. గరిష్ట చిల్లర ధరపై ఒక్కో బాటిల్‌కు రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వమే మౌఖిక ఆదేశాలు ఇచ్చిందని వ్యాపారులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం అలా ఆదేశాలు ఇచ్చిందీ లేనిదీ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. అధిక ధరలకు అమ్మడం నిబంధనలకు విరుద్ధమని, అక్రమాలకు పాల్పడే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో వైసీపీ కూడా ఇలా అధిక ధరలకు మద్యం విక్రయించి చెడ్డపేరు తెచ్చుకుందని, ప్రజలు పక్కన పెట్టారని ఈ సందర్భంగా జనసేన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు వైన్ షాపులపై నిరంతరం నిఘా ఉంచాలని పవన్ సూచించారు.

This post was last modified on February 3, 2026 10:12 pm

Share

Recent Posts

కుబేర తర్వాత కమ్ముల ఏమయ్యారు

టాలీవుడ్ దర్శకుల్లో శేఖర్ కమ్ములకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కమర్షియల్ లెక్కలకు దూరంగా సెన్సిబుల్ కథలతో ఫ్యామిలీ ఆడియన్స్,…

46 minutes ago

విశ్వనాథ్ వసూళ్లకు కుటుంబాలే కీలకం

ఇండిపెండెన్స్ డేకి ఒక రోజు ముందు ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ ఎంత డబ్బింగ్ సినిమా…

1 hour ago

తెలివిగా ‘గేమ్’ తప్పించుకున్న దుల్కర్

పెద్ద సినిమాలకు షూటింగ్ పూర్తి చేయడమే కాదు సరైన రిలీజ్ డేట్లు సెట్ చేసుకోవడం చాలా పెద్ద ఛాలెంజ్. ఈ…

2 hours ago

మార్పు త‌ప్ప‌దు మిత్ర‌మా… కూట‌మి తేల్చేసింది!

కూట‌మిలో నాయ‌కుల‌కు క‌లివిడిత‌ప్ప‌దు. ఈ విష‌యాన్ని గ‌తంలో అనేక సంద‌ర్భాల్లో టీడీపీ-జ‌న‌సేన కూడా స్ప‌ష్టం చేశాయి. అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు నాయ‌కులు…

2 hours ago

కదిరి వెనుక అసలు కహాని

నిన్న జరిగిన కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో చిరంజీవి మెగా 158 గురించి ఇచ్చిన లీక్ అభిమానుల్లో రకరకాల…

2 hours ago

వైసీపీ హయాంలో గ్రూప్ -1లో అక్రమాలు నిజమే

డీఎస్సీలో అక్రమాలు జరిగినట్లు నిరాధార ఆరోపణలు గగ్గోలు పెడుతున్న వైసీపీ అసలు గుట్టు బయట పడింది. గత ప్రభుత్వం పాలనలో…

3 hours ago