ఏపీలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల ఇళ్లపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రచ్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు వెలుపల వైసీపీ ఎంపీలు ఆ వ్యవహారాలపై నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎదుట వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు.
ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని, తమకు న్యాయం కావాలని వారు నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అవసరమైతే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు.
కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసిన వైసీపీ ఎంపీలు ఏపీలో తాజా పరిస్థితిని వివరించారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవాలని వారు భావిస్తున్నారు.
మరోవైపు, రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల బాబూరావు కూడా ఈ విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
ఏపీలో మాజీ మంత్రుల ఇళ్లు తగులబెడుతున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. ప్రధాని మోదీ, షా వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ నానాటికీ దిగజారిపోతోందని చెప్పారు. అయితే, లా అండ్ ఆర్డర్ స్టేట్ కి సంబంధించిన విషయమని రాజ్య సభ ఛైర్మన్ అన్నారు.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…