Political News

వైసీపీ రాష్ట్రపతి పాలన కోరుకుంటుందా?

ఏపీలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల ఇళ్లపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రచ్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు వెలుపల వైసీపీ ఎంపీలు ఆ వ్యవహారాలపై నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎదుట వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు.

ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని, తమకు న్యాయం కావాలని వారు నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అవసరమైతే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు.

కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసిన వైసీపీ ఎంపీలు ఏపీలో తాజా పరిస్థితిని వివరించారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవాలని వారు భావిస్తున్నారు.

మరోవైపు, రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల బాబూరావు కూడా ఈ విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

ఏపీలో మాజీ మంత్రుల ఇళ్లు తగులబెడుతున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. ప్రధాని మోదీ, షా వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ నానాటికీ దిగజారిపోతోందని చెప్పారు. అయితే, లా అండ్ ఆర్డర్ స్టేట్ కి సంబంధించిన విషయమని రాజ్య సభ ఛైర్మన్ అన్నారు.

This post was last modified on February 3, 2026 7:38 pm

Share
Show comments
Published by
Kumar
Tags: YCP

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

32 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago