ఏపీలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల ఇళ్లపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రచ్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు వెలుపల వైసీపీ ఎంపీలు ఆ వ్యవహారాలపై నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎదుట వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు.
ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని, తమకు న్యాయం కావాలని వారు నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అవసరమైతే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు.
కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసిన వైసీపీ ఎంపీలు ఏపీలో తాజా పరిస్థితిని వివరించారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవాలని వారు భావిస్తున్నారు.
మరోవైపు, రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల బాబూరావు కూడా ఈ విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
ఏపీలో మాజీ మంత్రుల ఇళ్లు తగులబెడుతున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. ప్రధాని మోదీ, షా వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ నానాటికీ దిగజారిపోతోందని చెప్పారు. అయితే, లా అండ్ ఆర్డర్ స్టేట్ కి సంబంధించిన విషయమని రాజ్య సభ ఛైర్మన్ అన్నారు.
This post was last modified on February 3, 2026 7:38 pm
తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు…
ప్రభాస్ అభిమానులకు పీడకలగా మిగిలిపోయిన ఆదిపురుష్ మరోసారి సోషల్ మీడియా టాపిక్ అయ్యింది. కారణం రామాయణ ట్రైలర్. రెండు సినిమాల్లో…
వైసీపీ అధినేత జగన్ ఏలక్ష్యంతో అయితే.. శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారో.. ఆ లక్ష్యం నెరవేరకుండానే వెనుదిరిగే పరిస్థితి ఏర్పడింది. దీనికి…
రెండేళ్ల క్రితం వచ్చిన లక్కీ భాస్కర్ ఓ మోస్తరు అంచనాలతో బ్లాక్ బస్టర్ విజయం సాధించడం దుల్కర్ సల్మాన్ టాలీవుడ్…
ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు వంద, రెండు వందల రోజులు ఆడటం మాములు విషయం. ప్రేమాభిషేకం, అడవి రాముడు ఏడాది…
ఇంతకూ కేంద్ర విద్యా శాఖలో ఏం జరుగుతుంది. నీట్ పేపర్ లీకేజి తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో జరిగిన…