ఏపీలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల ఇళ్లపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏర్పాటు చేసిన బ్యానర్ల విషయంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య రచ్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంటు వెలుపల వైసీపీ ఎంపీలు ఆ వ్యవహారాలపై నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంటు ఎదుట వైసీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు.
ఏపీలో ఆటవిక పాలన సాగుతోందని, తమకు న్యాయం కావాలని వారు నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అవసరమైతే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ ఎంపీలు అవినాష్ రెడ్డి తదితరులు డిమాండ్ చేశారు.
కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిసిన వైసీపీ ఎంపీలు ఏపీలో తాజా పరిస్థితిని వివరించారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవాలని వారు భావిస్తున్నారు.
మరోవైపు, రాజ్యసభలో వైసీపీ ఎంపీ గొల్ల బాబూరావు కూడా ఈ విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.
ఏపీలో మాజీ మంత్రుల ఇళ్లు తగులబెడుతున్నారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. ప్రధాని మోదీ, షా వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ నానాటికీ దిగజారిపోతోందని చెప్పారు. అయితే, లా అండ్ ఆర్డర్ స్టేట్ కి సంబంధించిన విషయమని రాజ్య సభ ఛైర్మన్ అన్నారు.
This post was last modified on February 3, 2026 7:38 pm
కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…
అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొందరు నాయకులు తమ పంథాను మార్చుకోవడం లేదు.…
దేశ రాజధాని ఢిల్లీ.. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు పోలీసుల పహారాలో ఉండనుంది. దాదాపు నగరం…
వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్తరాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్యవహారంతో పాటు.. పార్టీలో మరింత మంది…
జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…