Political News

ఇండియా విడిచిపోండి.. వాట్సాప్‌కు సుప్రీం గట్టి హెచ్చరిక

మెటా (Meta) ప్రస్తుతం అందరికీ పరిచయం ఉన్న పేరు. వాట్సాప్ ఈ సంస్థకు చెందినదనే విషయం తెలిసిందే. అయితే భారత్‌లో ఈ సంస్థ కార్యకలాపాల నిర్వహణపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని తేల్చి చెప్పింది. అలా కాకుండా వ్యక్తుల సమాచారాన్ని లీక్ చేస్తామంటే కుదరదని స్పష్టం చేసింది. మీకు నచ్చకపోతే ఈ దేశం నుంచి వెళ్లిపోవచ్చు అని తేల్చిచెప్పింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో తీసుకువచ్చిన గోప్యతా చట్టాన్ని ఏ సంస్థ అయినా పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఎవరికైనా చెందిన సమాచారాన్ని దోచుకునేందుకు తాము అంగీకరించబోమన్నారు. ఒకవేళ దేశంలోని చట్టాలను గౌరవించలేకపోతే లేదా వాటి ప్రకారం నడుచుకోలేకపోతే తక్షణమే దేశం నుంచి వెళ్లిపోవచ్చని తెలిపారు.

విషయం ఏంటి?

ఈరోజుల్లో తెల్లారినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు చాలా మంది వాట్సాప్‌లోనే గడుపుతున్నారు. ఆనందం, బాధ, ఆఫీసు పని ఏదైనా కూడా వాట్సాప్ కీలక వేదికగా మారింది. ప్రత్యామ్నాయ వేదికలు ఉన్నా వాట్సాప్‌తో ప్రజలకు గట్టి అనుబంధం ఏర్పడింది. అయితే ఈ వ్యవహారాన్ని అలుసుగా తీసుకున్న వాట్సాప్ వ్యక్తుల సమాచారాన్ని మెటాకు చేరవేస్తోందన్నది కొన్నేళ్లుగా ప్రధాన చర్చ. విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 2011లో దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది.

ఈ పిటిషన్‌పై తరచుగా విచారణలు జరుగుతున్నాయి. దేశంలోని ప్రైవసీ చట్టం ప్రకారం వ్యవహరించాల్సిందేనని, వాట్సాప్ సంస్థ తన వినియోగదారుల సమాచారాన్ని ఇతర ఏ సంస్థతోనూ పంచుకోకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎలాంటి అకౌంట్ అయినా వాట్సాప్ తన ఇష్టానుసారం వ్యవహరించకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే దేశం నుంచి వెళ్లిపోవచ్చని కూడా వ్యాఖ్యానించింది.

This post was last modified on February 3, 2026 4:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్నయ్య రూటులోనే బేబీ హీరో రిస్కు

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన ఆనంద్ దేవరకొండని సక్సెస్ వరించడానికి టైం అయితే పట్టింది. బేబీ…

17 minutes ago

ఏపీ సర్కారు వేసిన కమిషన్… దోషులను పట్టిస్తుందా?

తిరుమ‌ల శ్రీవారి ప‌విత్ర ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ఇప్ప‌టికే సీబీఐ నేతృత్వంలోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం విచార‌ణ…

33 minutes ago

చేతులు మారిన దురంధర్

ఈ మధ్య కాలంలో థియేటర్లలో సుదీర్ఘ కాలం ఆడిన సినిమా.. ‘దురంధర్’. డిసెంబరు 5న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికీ…

1 hour ago

అరవ శ్రీధర్ విచారణ పూర్తి… కేసు నమోదు

జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళా ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం…

1 hour ago

వైసీపీ రాష్ట్రపతి పాలన కోరుకుంటుందా?

ఏపీలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల ఇళ్లపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు, తిరుపతి…

2 hours ago

‘పోలీసులను పక్కనబెట్టి టీడీపీ, వైసీపీ తేల్చుకుందామా?’

వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొంతకాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే.…

3 hours ago