Political News

‘దాదా’ మృతిపై ‘దీదీ’ కీలక వ్యాఖ్యలు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందిన వార్తతో మహారాష్ట్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అజిత్ దాదా మరణ వార్త విని ఆయన అనుచరులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో అజిత్ పవార్ మృతిపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

అజిత్ పవార్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన దీదీ…ఆ ప్రమాదం పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు వేరే దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదని అన్నారు. అజిత్ పవార్ మృతిపై సుప్రీంకోర్టు నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టుపై మాత్రమే తమకు నమ్మకం ఉందని అన్నారు.

అంతేకాదు, ఆ కమిటీ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నివేదికను సమర్పించాలని కోరారు. దీదీతోపాటు బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా దర్యాప్తు కోసం కమిటీని నియమించాలని కోరారు.

అయితే, మహాయుతి కూటమి నుంచి అజిత్ పవార్ బయటకు రావాలనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. తన పెద్దనాన్న శరద్ పవార్‌తో తిరిగి కలిసిపోయేందుకు అజిత్ దాదా ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ఈ ఘటనపై పక్కాగా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని దీదీ, లాలూ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా, తమ విమానంలో ఎటువంటి లోపం లేదని , పొగమంచు వల్లే ల్యాండింగ్ లో ఇబ్బంది వచ్చి ప్రమాదం జరిగి ఉంటుందని ఆ విమానాన్ని ఆపరేట్ చేస్తున్న వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ చెబుతోంది.

This post was last modified on January 28, 2026 2:26 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

57 minutes ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

2 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

2 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

4 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

4 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

6 hours ago