Trends

జేడీ సతీమణి: పోయింది 2.5 కోట్లు.. దక్కింది 45 లక్షలు!

మాజీ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సతీమణి స్టాక్ మార్కెట్ మోసానికి గురైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌లో సైబర్ నేరస్తుల బారిన పడిన ఆమె, వారి సూచనల మేరకు కోట్ల రూపాయల సొమ్మును పెట్టుబడిగా పెట్టారు. చివరకు అది మోసమని గ్రహించే సరికి దాదాపు 2 కోట్ల 58 లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు.

చిత్రమేంటంటే, ఈ కేసులో నేరస్తులు పంపించిన వాట్సాప్ లింకు, అనంతరం ట్రేడింగ్ అంతా లక్ష్మీనారాయణ కనుసన్నల్లోనే సాగింది. ఆయన సతీమణికి అంత పరిజ్ఞానం లేకపోవడంతో ఆమె నేరస్తులకు లక్ష్మీనారాయణ వాట్సాప్ నెంబరే ఇచ్చారు.

దీంతో సైబర్ నేరస్తులు తమ లింకును లక్ష్మీనారాయణ ఫోన్‌కే పంపించారు. తదుపరి పెట్టుబడులు అన్నీ అదే ఫోన్ నెంబరు నుంచే జరిగాయి. మొత్తంగా 2.58 కోట్ల రూపాయల పెట్టుబడి మోసం జరిగిన తర్వాత విషయం తెలుసుకున్న లక్ష్మీనారాయణ దంపతులు హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో తాజాగా అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా మయన్మార్ సహా పలు దేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ అరెస్టులు జరిగే సమయానికి కేవలం 45 లక్షలు మాత్రమే పోలీసులకు లభించాయి. దీంతో ఆ సొమ్మును ఫ్రీజ్ చేశారు.

వాస్తవానికి ఈ మోసం వ్యవహారం మొత్తం రెండు నెలల పాటు సాగింది. నవంబరులో లక్ష్మీనారాయణ సతీమణికి లింకు వచ్చింది. దాని తర్వాత ఆమె ట్రేడింగ్‌లో కొద్దికొద్దిగా సొమ్ము పెట్టారు. వెంటనే నేరస్తులు లాభాలు వచ్చినట్టు డబ్బు పంపించి ఆమెను నమ్మించారు. ఇంకా పెట్టుబడి పెడితే మరింత లాభం వస్తుందని చెప్పుకొచ్చారు.

ఇది నిజమేనని నమ్మిన ఆమె తన భర్తతో కూడా పెట్టుబడి పెట్టించారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ కూడా ఇది నిజమేనని భావించారు. అంతేకాదు, తన వద్ద ఉన్న బంగారాన్ని కూడా కుదువ పెట్టి అప్పులు తెచ్చి మరీ ఇందులో పెట్టుబడి పెట్టారు.

ప్రస్తుతం నలుగురు నిందితులు మాత్రమే పట్టుబడ్డారని, దీని వెనుక చాలా పెద్ద ముఠా ఉందని పోలీసులు చెబుతున్నారు.

This post was last modified on January 28, 2026 1:54 pm

Share

Recent Posts

సిద్దార్థ్ సిరీస్ బాగా ట్రెండ్ అవుతోంది

సినిమాల్లో సక్సెస్ కోసం కిందా మీద పడుతున్నాడు కానీ సిద్దార్థ్ కు డిజిటల్ స్పేస్ లో మంచి కంటెంట్ దొరుకుతోంది.…

18 minutes ago

టాక్సిక్ కొంచెం జాగ్రత్త పడాల్సిందే

నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ టాక్సిక్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కి టికెట్ రేట్ల పెంపు తీసుకుంటారనే టాక్ బయటికి…

55 minutes ago

‘మల్లెపూల పల్లకి’ విమర్శలపై దర్శకుడేమన్నాడంటే?

అయ్యప్ప స్వామి భక్తులు పాడుకునే పాటల్ల ో ‘మల్లెపూల పల్లకి’కి ఉన్న ఆదరణే వేరు. అయ్యప్ప మాల సీజన్ మొదలైందంటే ఈ పాట ఊర్లలో మార్మోగిపోతుంటుంది.…

1 hour ago

పదో తరగతి విద్యార్థులే రూపారెడ్డి హంతకులు

నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి హత్య కేసులో చిక్కుముడి వీడింది. ఇద్దరు పదో…

2 hours ago

పెంచిన టికెట్ల రేట్లలో 20 పర్సంట్ కట్టాల్సిందే

ఒకప్పటితో పోలిస్తే తెలంగాణలో సినిమా టికెట్ల ధరల పెంపుకి సంబంధించి అంత తేలిగ్గా జీవోలు రావట్లేదు. ఓవైపు ప్రభుత్వం అంత తేలిగ్గా జీవోకు అంగీకరించట్లేదు. ఇంకోవైపు…

2 hours ago

అభిమాని చిరకాల కోరిక తీర్చిన రామ్

సినీ హీరోల మీద ఫ్యాన్స్ వీరాభిమానానికి సంబందించి ఎన్నో ఉదంతాలు చూశాం. కానీ ఇది చాలా చిత్రమైన వ్యవహారం. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు…

2 hours ago