Political News

ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయా ?

అమరావతి రాజధాని విషయంలో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయా ? ఇదే అంశంపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా తుళ్ళూరులో జరిగిన కిసాన్ సదస్సులో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలతో ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. రాజధానిగా అమరావతే ఉంటుందని రైతులతో మాట్లాడుతు వీర్రాజు ప్రకటించారు. మూడు రాజధానుల ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకిస్తోందంటూ ఆయన స్పష్టంగా చెప్పారు. పనిలోపనిగా తమకు అధికారం అప్పగిస్తే రూ. 5 వేల కోట్లతో రాజధానిని నిర్మించేస్తామని, రైతుల సమస్యలు పరిష్కరించేస్తామని..ఇలా చాలానే చెప్పారులేండి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇదే వీర్రాజు మొన్నటివరకు అమరావతికి వ్యతిరేకంగా ఇంతలా మాట్లాడింది లేదు. ఒకే సామాజివకర్గం కోసమే చంద్రబాబునాయుడు అమరావతిని రాజధానిగా చేసుకున్నారంటు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పైగా కేంద్రం ఇచ్చిన వేలాది కోట్లరూపాయల్లో చంద్రబాబు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఎన్ని ఆరోపణలు చేశారో అందరికీ తెలిసిందే. ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులకు మద్దతుగానే వీర్రాజు మాట్లాడారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

విచిత్రమేమిటంటే రాష్ట్ర రాజధానుల నిర్ణయం అంశంతో కేంద్రానికి ఏమీ సంబంధం లేదని ఒకవైపు కేంద్రప్రభుత్వం పదే పదే అఫిడవిట్లు కోర్టుల్లో దాఖలు చేసింది. దాంతో కేంద్రం రాజధాని విషయంలో ఓ స్టాండ్ తీసుకున్నది కాబట్టి రాష్ట్రంలో బీజేపీ నేతలు కూడా ఈ విషయమై పెద్దగా స్పందించేవారు కారు. కాకపోతే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయాన్ని తాము ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేసేవారంతే. అలాంటది తాజాగా అమరావతికి మద్దతుగా వీర్రాజు ప్రకటన చేయటం అందులోను నరేంద్రమోడి ప్రతినిధిగా తానీ విషయం చెబుతున్నట్లు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికే అమరావతికి మద్దతుగా టీడీపీ, వామపక్షాలు, కాంగ్రెస్, జనసేన ప్రకటనలు చేస్తున్న విషయం చూస్తున్నదే.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మూడురోజులు తిరుపతిలోనే ఉన్న సోమువీర్రాజు అమరావతికి మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే అంతకుముందు ఉత్తరాధి పర్యటనలో గానీ లేకపోతే అనంతపురం జిల్లా పర్యటనలో కూడా ఏమీ మాట్లాడలేదు. అలాంటిది అమరావతికి రాగానే రాజదాని ప్రస్తావన తెచ్చారు. మరి మళ్ళీ ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పర్యటించినపుడు ఈసారి ఏమి మాట్లాడుతారో చూడాల్సిందే. ఎందుకంటే ఇపుడు అమరావతిపై ఇంతటి స్పష్టమైన ప్రకటన చేసినాక పై ప్రాంతాల్లో పర్యటించినపుడు ఇదే ప్రస్తావనొస్తుంది కదా.

This post was last modified on December 15, 2020 4:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

57 minutes ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

1 hour ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

2 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

2 hours ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

2 hours ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

2 hours ago