ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రులు, రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న విషయం ఈ రోజు విచారణ తర్వాత తేటతెల్లమైందని ఆరోపించారు. సిట్ అధికారులు పదే పదే అడిగిన ప్రశ్నలనే అడిగారని అన్నారు.
అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, లీకు వీరుల ప్రభుత్వానికి బెదరబోమని అన్నారు. తమ ఫోన్లను రేవంత్ సర్కార్ ట్యాప్ చేస్తోందని తాను పోలీసులను ప్రశ్నించానని కేటీఆర్ చెప్పారు. ఆ ప్రశ్నకు సిట్ అధికారులు నీళ్లు నమిలారని అన్నారు.
ఆ మాటనడానికే తనకు సిగ్గుగా ఉందని, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారని తాను ప్రశ్నించగా…అది నిజం కాదని పోలీసులు సమాధానమిచ్చారని తెలిపారు. కానీ, మీడియాలో ఇష్టం వచ్చినట్లు కథనాలు వచ్చాయని, తమ కుటుంబాలు పడ్డ క్షోభకు బాధ్యులు ఎవరని అన్నారు.
మీడియాకు అప్పీల్ చేస్తున్నానని, ప్రభుత్వం ఇచ్చే అడ్డగోలు లీకులు అలాగే ప్రచురించవద్దని …వాస్తవాలు తెలుసుకొని రాయాలని మీడియాకు రిక్వెస్ట్ చేశారు. రెండేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోందని, లీకులు ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదని చెప్పారు.
నేతల వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులని తాను సిట్ అధికారులను ప్రశ్నించానని అన్నారు. సింగరేణి బొగ్గు టెండర్ లో అవకతవకల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రభుత్వం ఈ డ్రామాలాడుతోందని ఎద్దేవా చేశారు.
This post was last modified on January 23, 2026 8:36 pm
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…
అనుకున్నది ఒకటి.. అవుతున్నది మరొకటి అన్నట్లుగా మారింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు. ఇరాన్ తో మొదలు పెట్టిన యుద్ధాన్ని…
ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్.. చిన్న, మిడ్ రేంజ్ సినిమాల గురించి ఒక ట్వీట్ వేసినా చాలు..…
భారత రాజ్యాంగ చరిత్రలో అరుదైన సన్నివేశానికి బుధవారం (ఏప్రిల్ 1, 2026) వేదిక కానుంది. ఈ ప్రత్యేక సందర్భానికి కారణం…
రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. ఎవరికి నచ్చిన దిక్కుకు వారు వెళ్లిపోవడమూ కొత్తకాదు. ఎవరికి అవసరం.. అవకాశం ఉన్న దిశగా నాయకులు,…
ఎటు చూసినా వైసీపీకి ఛాన్స్ కనిపించడం లేదా? ఏ వర్గం కూడా వైసీపీకి ఆశించిన మేరకు చేరువ అయ్యే అవకాశం…