బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులతోపాటు తమ అందరి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు.
సింగరేణి బొగ్గు స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అంటూ తమకు నోటీసులిస్తున్నారని ఆరోపించారు. 10 సార్లు పిలిచినా సిట్ విచారణకు హాజరవుతానని అన్నారు. తప్పు చేయని తాను భయపడాల్సిన పనిలేదని, సిట్ విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని, ఈ కేసులు తనకు కొత్తేమీ కాదని అన్నారు.
తాను పుట్టిన మట్టి సాక్షిగా చెబుతున్నానని, తాను ఎటువంటి తప్పు చేయలేదని కేటీఆర్ అన్నారు. తనకు హీరోయిన్లతో సంబంధం అంటగట్టారని, తన వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఆ అసత్య ఆరోపణల వల్ల తన కుటుంబం ఎంతో ఇబ్బంది పడిందని, అయినా సరే తట్టుకొని నిలబడ్డానని ఎమోషనల్ అయ్యారు.
తనకు లేనిపోని లింకులు అంటగట్టి తనపై తప్పుడు ప్రచారం చేసిన రేవంత్, ఆయన తొత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు.
4 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేసి, నయవంచనకు పాల్పడ్డ ముఖ్యమంత్రిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ కొత్త ఆరోపణలతో కాలయాపన చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడతామని అన్నారు. రాజకీయ కక్షలకు పాల్పడినప్పటికీ ఈ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…