బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులతోపాటు తమ అందరి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు.
సింగరేణి బొగ్గు స్కాం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అంటూ తమకు నోటీసులిస్తున్నారని ఆరోపించారు. 10 సార్లు పిలిచినా సిట్ విచారణకు హాజరవుతానని అన్నారు. తప్పు చేయని తాను భయపడాల్సిన పనిలేదని, సిట్ విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతానని, ఈ కేసులు తనకు కొత్తేమీ కాదని అన్నారు.
తాను పుట్టిన మట్టి సాక్షిగా చెబుతున్నానని, తాను ఎటువంటి తప్పు చేయలేదని కేటీఆర్ అన్నారు. తనకు హీరోయిన్లతో సంబంధం అంటగట్టారని, తన వ్యక్తిత్వహననానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఆ అసత్య ఆరోపణల వల్ల తన కుటుంబం ఎంతో ఇబ్బంది పడిందని, అయినా సరే తట్టుకొని నిలబడ్డానని ఎమోషనల్ అయ్యారు.
తనకు లేనిపోని లింకులు అంటగట్టి తనపై తప్పుడు ప్రచారం చేసిన రేవంత్, ఆయన తొత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు.
4 కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేసి, నయవంచనకు పాల్పడ్డ ముఖ్యమంత్రిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ కొత్త ఆరోపణలతో కాలయాపన చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాడతామని అన్నారు. రాజకీయ కక్షలకు పాల్పడినప్పటికీ ఈ ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు.
This post was last modified on January 23, 2026 12:52 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…