Political News

దావోస్ టూర్‌: ఏపీకి పెట్టుబ‌డులు ఎన్ని?

స్విట్జ‌ర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వ‌హించిన ప్ర‌పంచ ఆర్థిక ఫోరం స‌ద‌స్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారాలోకేష్‌లు తిరుగు ప‌య‌న‌మ‌య్యారు. నాలుగు రోజులు జ‌రిగిన ఈ స‌ద‌స్సులో భార‌త్ నుంచి మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, తెలంగాణ, అసోం, ఏపీ స‌హా ప‌లు రాష్ట్రాల‌కు చెందిన ముఖ్య‌మంత్రులు.. మంత్రులు  కూడా హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు ఈ ప‌ర్య‌ట‌న‌పై భారీగానే ఆశ‌లు పెట్టుకున్నారు.

ఈ క్ర‌మంలో ప్ర‌పంచ దేశాల‌కు చెందిన ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు స‌హా.. దిగ్గ‌జ కంపెనీల ప్ర‌తినిధులు, సీఈవోల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో అమ‌రావ‌తిలోని స్పోర్ట్స్ సిటీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ర‌త‌న్ టాటా సంస్థ అంగీక‌రించింది. విశాఖ‌లో పెట్టుబ‌డుల‌కు ముఖ్యంగా ఐటీ రంగంలో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు. ఇక‌, మంత్రి నారా లోకేష్ కూడా.. ప‌లు సంస్థ‌ల‌తో పెట్టుబ‌డుల‌పై చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో ఆయా సంస్థ‌లు వ‌చ్చేందుకు అంగీక‌రించాయి.

+ ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ ఐటీ డెవలప్ మెంట్ సెంటర్, జీసీసీ, వర్టికల్ బీపీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు క్యాప్ జెమినీ సంస్థ అంగీక‌రించింది.

+ డిజిటల్ టాలెంట్ పైప్ లైన్ కో డెవలప్ మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్‌లు, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇంజనీరింగ్ కోసం ఏపీ విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో ప‌నిచేసేందుకు ర‌తన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ముందుకు వ‌చ్చింది.

+ భారత్ లో ఏఐ, క్లౌడ్-రెడీ వర్క్‌ఫోర్స్‌ను నిర్మించడానికి 45 వేల మంది ఉద్యోగుల నియామక ప్రణాళిక రూపొందించినట్లు క్యాప్ జెమిని సీఈవో ఐమన్ ఎజ్జట్ తెలిపారు.

+ బ్లాక్ స్టోన్ సంస్థ‌ ఎంబసీ ఆఫీస్ పార్క్స్, నెక్సస్ సెలక్ట్ ట్రస్ట్ వంటి సంస్థల ద్వారా విశాఖపట్నంలో గ్రేడ్ ఎ ఆఫీస్ స్పేస్, ఇంటిగ్రేటెడ్ మిక్స్ డ్ యూజ్ డెవలప్ మెంట్ లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీక‌రించింది.

+ టెక్ మహీంద్ర సంస్థ‌.. విజయవాడలో టెక్ మహీంద్ర ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చింది. దీని వ‌ల్ల 6 వేల మందికి ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. విశాఖపట్నంలో డెలివరీ విస్తరణ పనులను వేగవంతం చేయ‌నుంది. వైజాగ్ లో టెక్ మహీంద్రా స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీంతో 3 వేల మందికి నైపుణ్య శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

This post was last modified on January 23, 2026 12:41 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

1 hour ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

3 hours ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

4 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

4 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

6 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

7 hours ago