సోషల్ మీడియా…రెండు వైపులా పదునున్న కత్తి. పిల్లల నుంచి పెద్దల వరకు టెక్ యుగంలో ఏదో ఒక సోషల్ మీడియా అకౌంట్ కలిగి ఉంటున్నారు. ఇక, రీల్స్..షార్ట్స్ హవా మొదలైన తర్వాత గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోతున్నారు. అయితే, పెద్దల సంగతి పక్కనబెడితే 16 ఏళ్ల లోపు పిల్లలపై సోషల్ మీడియా దుష్ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అందుకే ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలోనే ఏపీలో కూడా 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
దావోస్ పర్యటన సందర్భంగా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసే అంశంపై స్టడీ చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. ఒక నిర్దిష్ట వయస్సుకంటే తక్కువ ఉన్నవారు ఇలాంటి ప్లాట్ ఫామ్ లలో ఉండకూడదని, సోషల్ మీడియాలో కంటెంట్ ను వారు పూర్తిగా అర్థం చేసుకోలేరని లోకేశ్ అభిప్రాయపడ్డారు.
అందుకే 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చేయడంపై బలమైన, చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ అవసరం కావచ్చని, ఆ దిశగా ఆలోచిస్తున్నామని అన్నారు.
This post was last modified on January 22, 2026 6:42 pm
విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న 'ఆదర్శ కుటుంబం (AK47)' ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో…
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' ట్రైలర్ వారం క్రితమే రిలీజయింది. బాలీవుడ్…
వాల్తేరు వీరయ్య కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిరంజీవి చేయబోతున్న మెగా 158 కోసం దర్శకుడు బాబీ క్యాస్టింగ్ ఫైనల్ చేసే…
దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి మేఘాల్లో తేలిపోతున్నారు. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ కో బ్లాక్ బస్టర్ ఇచ్చి…
సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వడానికి వయసుతో సంబంధం లేదని ఉత్తర ప్రదేశ్కు చెందిన వినోద్ కుమార్ శర్మ నిరూపించారు. 70…
పార్టీ అధినేత మనసులో ఉన్న మాటే.. నాయకులూ చెబుతున్నారా..? వైసీపీలో వలంటీర్ల విషయంలో తమ వైఖరిని తేల్చేసిందా..? ఈ రోజు…