Political News

మరో దావోస్ గా హైదరాబాద్?

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ప్రసంగించిన రేవత్ రెడ్డి కీలక సూచన చేశారు. ఇకపై, ప్రతి సంవత్సరం జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్ లో డబ్ల్యూఈఎఫ్ ఫాలో-అప్ మీటింగ్ నిర్వహించాలని ప్రతిపాదించారు. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రమోట్ చేయాలని కోరారు. రేవంత్ ప్రతిపాదనకు సానుకూల మద్దతు లభించింది.

ఈ హైటెక్ యుగంలో వ్యాపారానికి, పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు త్వరగా తీసుకోవాల్సిన అవసరముందని రేవంత్ అభిప్రాయపడ్డారు. ఏడాదికి ఒకసారి దావోస్ లో సదస్సు సరిపోదని, మధ్యలో ఒకసారి…దాదాపు 6 నెలల తర్వాత మరో సమావేశం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సూచించారు.

దావోస్ లో వార్షిక, హైదరాబాద్ లో అర్ధ-వార్షిక సదస్సు నిర్వహిస్తే బాగుంటుందని రేవంత్ చేసిన ప్రతిపాదనకు పారిశ్రామికవేత్తలు, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే పెట్టుబడులు ఆకర్షించే కేంద్రంగా, మరో దావోస్ గా హైదరాబాద్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్, ఏఐ, లైఫ్ సైన్సెస్, ఇతర రంగాలలో భారీగా పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే గూగుల్, సేల్స్‌ఫోర్స్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల సీఈఓలతో భేటీ అవుతున్నారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030 & ఏఐ హబ్ ఆవిష్కరణ వంటి అంశాలపై చర్చించారు.

Kumar

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

2 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

2 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago