అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకే ప్రభుత్వం పోరు మరోసారి బహిరంగంగా బయటపడింది. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ ఆర్.ఎన్.రవి శాసనసభను ఉద్దేశించి ప్రసంగించేందుకు వచ్చారు.
తొలుత తమిళనాడు రాష్ట్ర గీతం ఆలపించగా, ఆ తర్వాత జాతీయ గీతాన్ని కూడా పాడాలని గవర్నర్ సూచించారు. అయితే సభ ప్రారంభంలో ‘తమిళ్ తాయి వాజ్తు’ మాత్రమే ఆలపించడమే సంప్రదాయమని స్పీకర్ ఎం.అప్పావు తేల్చి చెప్పారు. ఈ అంశంపై తీవ్ర వివాదం చెలరేగింది.
గవర్నర్ ప్రసంగం మధ్యలో స్పీకర్ జోక్యం చేసుకోవడంతో సభలో ఉద్రిక్తత మరింత పెరిగింది. గవర్నర్ ప్రస్తావించిన అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం సిద్ధం చేసిన సంప్రదాయ ప్రసంగ పాఠాన్ని మాత్రమే చదవాలని స్పీకర్ సూచించారు. ఈ విషయంలో వివాదం ముదిరి, గవర్నర్ ప్రసంగించకుండానే సభ నుంచి వాకౌట్ చేశారు.
దీనికి గవర్నర్ స్పందిస్తూ, తన బాధ్యతలపై తనకు స్పష్టత ఉందన్నారు. శాసనసభలో అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సింది ఎమ్మెల్యేలే తప్ప ఇతరులు కాదని స్పీకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రసంగాన్ని చదవడమే గవర్నర్ విధి అని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పులతడకగా ఉన్న ప్రభుత్వ ప్రసంగాన్ని తాను చదవలేనని స్పష్టంగా చెప్పిన గవర్నర్, తాను మాట్లాడుతుండగా మైక్ను స్విచ్ఆఫ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో జాతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. గత రెండేళ్లుగా ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తాజా ఘటనతో తమిళనాడు రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది.
This post was last modified on January 20, 2026 12:59 pm
ఒకప్పుడంటే మెగాస్టార్ చిరంజీవిని, ఆయన సినిమాలను అల్లు అర్జున్ కొనియాడడం పెద్ద విశేషంగా అనిపించేది కాదు. కానీ గత కొన్నేళ్లలో…
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో…
కేరళ రాష్ట్రంలో ఇప్పుడొక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం…
టాలీవుడ్ లో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత తీవ్రంగా ఉంది. అందులోనూ తమ భుజాల మీద సినిమాను మోసి నిలబెట్టే…
టాలీవుడ్ కోరుకున్న శుభారంభం 2026కి దొరికేసింది. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో నాలుగు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాక మన శంకరవరప్రసాద్…
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన…