Political News

అసెంబ్లీలో రగడ… గవర్నర్ వాక్ అవుట్ !

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడులో గవర్నర్ వర్సెస్ డీఎంకే ప్రభుత్వం పోరు మరోసారి బహిరంగంగా బయటపడింది. మంగళవారం ఉదయం శాసనసభ సమావేశం ప్రారంభమైన వెంటనే సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. గవర్నర్ ఆర్‌.ఎన్‌.రవి శాసనసభను ఉద్దేశించి ప్రసంగించేందుకు వచ్చారు.

తొలుత తమిళనాడు రాష్ట్ర గీతం ఆలపించగా, ఆ తర్వాత జాతీయ గీతాన్ని కూడా పాడాలని గవర్నర్ సూచించారు. అయితే సభ ప్రారంభంలో ‘తమిళ్ తాయి వాజ్తు’ మాత్రమే ఆలపించడమే సంప్రదాయమని స్పీకర్ ఎం.అప్పావు తేల్చి చెప్పారు. ఈ అంశంపై తీవ్ర వివాదం చెలరేగింది.

గవర్నర్ ప్రసంగం మధ్యలో స్పీకర్ జోక్యం చేసుకోవడంతో సభలో ఉద్రిక్తత మరింత పెరిగింది. గవర్నర్ ప్రస్తావించిన అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం సిద్ధం చేసిన సంప్రదాయ ప్రసంగ పాఠాన్ని మాత్రమే చదవాలని స్పీకర్ సూచించారు. ఈ విషయంలో వివాదం ముదిరి, గవర్నర్ ప్రసంగించకుండానే సభ నుంచి వాకౌట్ చేశారు.

దీనికి గవర్నర్ స్పందిస్తూ, తన బాధ్యతలపై తనకు స్పష్టత ఉందన్నారు. శాసనసభలో అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సింది ఎమ్మెల్యేలే తప్ప ఇతరులు కాదని స్పీకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రసంగాన్ని చదవడమే గవర్నర్ విధి అని స్పష్టం చేశారు.

ఈ క్రమంలో గవర్నర్ ఆర్‌.ఎన్‌.రవి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తప్పులతడకగా ఉన్న ప్రభుత్వ ప్రసంగాన్ని తాను చదవలేనని స్పష్టంగా చెప్పిన గవర్నర్, తాను మాట్లాడుతుండగా మైక్‌ను స్విచ్‌ఆఫ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీలో జాతీయ గీతానికి తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. గత రెండేళ్లుగా ఇదే తరహా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తాజా ఘటనతో తమిళనాడు రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది.

This post was last modified on January 20, 2026 12:59 pm

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

3 hours ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

5 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

5 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

6 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

7 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

7 hours ago