తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు.
ఈ కేసు విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను సిట్ అధికారులు విచారణ జరిపారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుకు సిట్ అధికారులు షాకిచ్చారు. హరీశ్ రావుకు సిట్ అధికారులు కొద్ది సేపటి క్రితం నోటీసులిచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారణ జరిపేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
తన ఫోన్ను ట్యాప్ చేయించారంటూ హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా దానిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా….ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది.
అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి, హరీశ్ రావు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on January 19, 2026 9:35 pm
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 108 సీట్లు గెలుచుకున్న విజయ్ పార్టీ…మ్యాజిక్…
పొట్లూరి వరప్రసాద్.. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా వినిపించిన పేరు. రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ ‘బలుపు’తో ఆయన…
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…