Political News

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు షాక్

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడు.

ఈ కేసు విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కొనసాగుతోంది. ప్రభాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను సిట్ అధికారులు విచారణ జరిపారు.

ఈ క్రమంలోనే తాజాగా ఆ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావుకు సిట్ అధికారులు షాకిచ్చారు. హరీశ్ రావుకు సిట్ అధికారులు కొద్ది సేపటి క్రితం నోటీసులిచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారణ జరిపేందుకు అనుమతివ్వాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా దానిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా….ఆ కేసును హైకోర్టు కొట్టివేసింది.

అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోబోమని సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో హరీశ్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి, హరీశ్ రావు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on January 19, 2026 9:35 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Harish Rao

Recent Posts

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

3 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

3 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

4 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

4 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

5 hours ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

5 hours ago