Political News

అమ‌రావతిపై సుజ‌నా మంత్రాంగం… !

రాజధాని అమ‌రావ‌తి విష‌యంలో రెండో ద‌శ భూ స‌మీక‌ర‌ణ వ్య‌వ‌హారం ఒకింత ఇబ్బందిగా మారింది. కొంద‌రు గ‌తంలో భూములు ఇచ్చిన రైతులు.. త‌మ‌కు ఇంకా ప్ర‌భుత్వం నుంచి అందాల్సిన‌వి అంద‌లేదని భీష్మించారు. దీంతో రెండోద‌శ భూసేక‌ర‌ణ విష‌యంలో ప్ర‌భుత్వానికి ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఇప్ప‌టికే కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్‌, రాష్ట్ర మంత్రి నారాయ‌ణ‌ల‌తో కూడిన క‌మిటీని వేసింది. అయిన‌ప్ప‌టికీ.. రైతులు ప‌ట్టుద‌లతో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రిని ప్ర‌భుత్వం రంగంలోకి దింపింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న‌స‌మ‌యంలో రెండు ప‌ర్యాయాలు ఆయ‌న రాజ‌ధాని ప్రాంతం లో ప‌ర్య‌టించి.. రైతుల స‌మ‌స్య‌లు విన్నారు. భూ స‌మీక‌ర‌ణ‌కు అప్ప‌ట్లో ఆయ‌న కూడా రైతుల‌ను ఒప్పించారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా రైతుల‌తో చ‌ర్చించేందుకు మ‌రోసారి సుజ‌నా చౌద‌రి రంగంలోకి దిగారు. తాజాగా ఆయ‌న‌.. రాజ‌ధాని రైతుల‌తో భేటీ అయ్యారు.

వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హ‌క‌రిస్తుంద‌ని.. రాజ‌ధానిని మ‌రింత అభివృద్ధి చేసుకుంటే.. ఆదాయం మ‌రింత పెరుగుతుంద‌ని.. రైతుల‌కు ఇచ్చిన ప్ర‌తిహామీని ప్ర‌భుత్వం నెరవేరుస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌స్తుతం భూస‌మీక‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న సూచించారు. అంతేకాదు.. రైతుల‌కు అవ‌స‌ర‌మైన సాంకేతిక స‌హ‌కారం అందించేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌న్నారు. అధికారులు స్పందించేలా రైతుల‌కు సాయం చేసేలా చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

గ‌తంలో 14 ర‌కాల స‌మ‌స్య‌లు ఉంటే.. అధికారుల ఉదాసీన‌త కార‌ణంగా.. ఇప్పుడు 20 స‌మ‌స్య‌ల‌కు చేరుకున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. ఈ వ్య‌వ‌హారంపై అధికారుల‌తోనూ సంప్ర‌దించి రైతుల‌కు మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇచ్చారు. మొత్తంగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు రైతులు భీష్మించినా.. సుజనా చౌద‌రి మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో ఒకింత దిగి వ‌చ్చారు. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యేందుకు స‌హ‌క‌రించాల‌ని.. తాము కూడాస‌హ‌క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు.

This post was last modified on January 17, 2026 10:16 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

40 minutes ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

44 minutes ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

1 hour ago

షాకిచ్చిన రామ్ చరణ్… పెద్ది వస్తోందా?

ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ…

2 hours ago

మే 1 కోసం కొత్త సినిమాల కొట్లాట

ఏప్రిల్ 30 'పెద్ది' తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన 'గాయపడ్డ సింహం'…

3 hours ago

ఇలా అర్థం చేసుకున్నారా.. టొవినో ఆవేద‌న‌

మ‌ల‌యాళ స్టార్ హీరో టొవినో థామ‌స్.. తాను జూనియ‌ర్ ఎన్టీఆర్, ప్ర‌శాంత్ నీల్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న‌ డ్రాగ‌న్ (వ‌ర్కింగ్ టైటిల్)…

4 hours ago