రాజధాని అమరావతి విషయంలో రెండో దశ భూ సమీకరణ వ్యవహారం ఒకింత ఇబ్బందిగా మారింది. కొందరు గతంలో భూములు ఇచ్చిన రైతులు.. తమకు ఇంకా ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందలేదని భీష్మించారు. దీంతో రెండోదశ భూసేకరణ విషయంలో ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణలతో కూడిన కమిటీని వేసింది. అయినప్పటికీ.. రైతులు పట్టుదలతో వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని ప్రభుత్వం రంగంలోకి దింపింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నసమయంలో రెండు పర్యాయాలు ఆయన రాజధాని ప్రాంతం లో పర్యటించి.. రైతుల సమస్యలు విన్నారు. భూ సమీకరణకు అప్పట్లో ఆయన కూడా రైతులను ఒప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రైతులతో చర్చించేందుకు మరోసారి సుజనా చౌదరి రంగంలోకి దిగారు. తాజాగా ఆయన.. రాజధాని రైతులతో భేటీ అయ్యారు.
వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని.. రాజధానిని మరింత అభివృద్ధి చేసుకుంటే.. ఆదాయం మరింత పెరుగుతుందని.. రైతులకు ఇచ్చిన ప్రతిహామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం భూసమీకరణకు సహకరించాలని ఆయన సూచించారు. అంతేకాదు.. రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. అధికారులు స్పందించేలా రైతులకు సాయం చేసేలా చేస్తానని హామీ ఇచ్చారు.
గతంలో 14 రకాల సమస్యలు ఉంటే.. అధికారుల ఉదాసీనత కారణంగా.. ఇప్పుడు 20 సమస్యలకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై అధికారులతోనూ సంప్రదించి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మొత్తంగా నిన్న మొన్నటి వరకు రైతులు భీష్మించినా.. సుజనా చౌదరి మధ్యవర్తిత్వంతో ఒకింత దిగి వచ్చారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు సహకరించాలని.. తాము కూడాసహకరిస్తామని హామీ ఇచ్చారు.
This post was last modified on January 17, 2026 10:16 pm
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…