రాజధాని అమరావతి విషయంలో రెండో దశ భూ సమీకరణ వ్యవహారం ఒకింత ఇబ్బందిగా మారింది. కొందరు గతంలో భూములు ఇచ్చిన రైతులు.. తమకు ఇంకా ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందలేదని భీష్మించారు. దీంతో రెండోదశ భూసేకరణ విషయంలో ప్రభుత్వానికి ఇబ్బందులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణలతో కూడిన కమిటీని వేసింది. అయినప్పటికీ.. రైతులు పట్టుదలతో వ్యవహరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని ప్రభుత్వం రంగంలోకి దింపింది. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నసమయంలో రెండు పర్యాయాలు ఆయన రాజధాని ప్రాంతం లో పర్యటించి.. రైతుల సమస్యలు విన్నారు. భూ సమీకరణకు అప్పట్లో ఆయన కూడా రైతులను ఒప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రైతులతో చర్చించేందుకు మరోసారి సుజనా చౌదరి రంగంలోకి దిగారు. తాజాగా ఆయన.. రాజధాని రైతులతో భేటీ అయ్యారు.
వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని.. రాజధానిని మరింత అభివృద్ధి చేసుకుంటే.. ఆదాయం మరింత పెరుగుతుందని.. రైతులకు ఇచ్చిన ప్రతిహామీని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం భూసమీకరణకు సహకరించాలని ఆయన సూచించారు. అంతేకాదు.. రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. అధికారులు స్పందించేలా రైతులకు సాయం చేసేలా చేస్తానని హామీ ఇచ్చారు.
గతంలో 14 రకాల సమస్యలు ఉంటే.. అధికారుల ఉదాసీనత కారణంగా.. ఇప్పుడు 20 సమస్యలకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంపై అధికారులతోనూ సంప్రదించి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మొత్తంగా నిన్న మొన్నటి వరకు రైతులు భీష్మించినా.. సుజనా చౌదరి మధ్యవర్తిత్వంతో ఒకింత దిగి వచ్చారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు సహకరించాలని.. తాము కూడాసహకరిస్తామని హామీ ఇచ్చారు.
This post was last modified on January 17, 2026 10:16 pm
రామ్ చరణ్ తాజా జిమ్ లుక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పూర్తిగా వర్కౌట్…
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్…
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు…
తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు సింగిల్ స్క్రీన్ల మనుగడే ప్రమాదంలో పడ్డ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేరున్న ఒక్కో సింగిల్ స్క్రీన్ మూత…
కృష్ణా జలాల పంపకం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వాడీవేడీ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.…
కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్ల సమస్య వల్ల థియేటర్లు సరిపోకపోయినా, మరో నాలుగు సినిమాలతో స్క్రీన్లు పంచుకోవాల్సి వచ్చినా మన శంకరవరప్రసాద్…