రాష్ట్రంలోని కీలక పార్టీలకు కార్యకర్తల కొరత వెంటాడుతోంది. నిజానికి కార్యకర్తల దన్నుతోనే ఏ పార్టీ అయినా.. పుంజుకుంటుంది. అధికారంలోకి వచ్చేందుకు కూడా ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్నుగా నిలవాల్సి ఉంటుంది. అయితే.. కారణాలు ఏవైనా కూడా.. రాష్ట్రంలోని రెండు కీలక పార్టీలకు.. కార్యకర్తల కొరత వెంటాడుతోంది. దీంతో ఇప్పుడు కార్యకర్తల కోసం ఆ రెండుపార్టీలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నాయి. త్వరలోనే కార్యకర్తల నియామకాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నాయి.
ఈ జాబితాలో ముందున్న పార్టీ జనసేన. గత ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసి 100 పర్సంట్ స్ట్రయిక్ రేట్ సాధించిన పార్టీకి కార్యకర్తల కొరత వెంటాడుతోందంటే.. ఒకింత ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ, వాస్తవం. పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు.. అభిమాన గణం ఉంది. కానీ.. ఇదే సమయంలో జనసేనకు కార్యకర్తల బలం తక్కువగా ఉంది. పవన్ను అభిమానించే వారు ఉన్నా.. పార్టీ పరంగా కార్యక్రమాలు నిర్వహించేవారు.. బలమైన వాయిస్ వినిపించేవారు లేరు.
ఈ నేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కార్యకర్తల నియామకాలకు పార్టీ ప్రాధాన్యం ఇస్తోంది. త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేస్తున్న పార్టీకి.. దీనికి అనుబంధంగా మండలాల వారీగా కార్యకర్తలను నియమించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తద్వారా.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నది అధినేత ఆలోచన. గత ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు కూడా జనసేనకు జోరుగా పనిచేశారు. కానీ, వచ్చే ఎన్నికల నాటికి సొంత కార్యకర్తలతోనే ఎన్నికలకు వెళ్లాలన్నది కీలక నిర్ణయం.
ఇక, వైసీపీ విషయానికి వస్తే.. కార్యకర్తల పరంగా పెను సంక్షోభం ఎదుర్కొంటున్న పార్టీ ఇదే. పార్టీకి కార్యకర్తలు ఉన్నా.. పార్టీ అధిష్టానం నుంచి సరైన దన్నులేక.. కార్యకర్తలు చతికిలపడ్డారు. దీంతో వారు పార్టీకి కూడా దూరమయ్యారు. గత ఐదేళ్లలో పార్టీకి వారు పూర్తిగా దూరమైన ప్రభావం గత ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పార్టీని పటిష్ఠం చేయాలన్నది వైసీపీ వ్యూహం. ఈ క్రమంలోనే కార్యకర్తలకు ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు.. మరింత మందిని కొత్తగా పార్టీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.
This post was last modified on January 16, 2026 9:01 am
టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…
సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి…
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…