భోగి పండుగ రోజు ఉదయాన్నే మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి తన ప్రత్యేక ప్రతిభను బయటపెట్టారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే పాటకు భోగి మంటల చుట్టూ తిరుగుతూ స్టెప్పులు వేసి, “సంక్రాంతి అంటే నేనే” అన్నట్లుగా సోషల్ మీడియాలో సందడి చేశారు.
గతంలో సత్తెనపల్లిలో వేసిన స్టెప్పులు ఎలా వైరల్ అయ్యాయో, ఈసారి గుంటూరు పశ్చిమలోనూ అదే ఫార్ములా రిపీట్ అయింది. పండుగంటే పూజలు కాదు… డ్యాన్స్ కావాలన్నట్లు కార్యక్రమం స్థానికంగా ఆకర్షణగా మారింది.
తన డ్యాన్స్కు వచ్చిన క్రేజ్కి కారణం ఎవరో కాదు… పవన్ కళ్యాణే అని అంబటి తేల్చేశారు. “సంక్రాంతి అంటే అంబటి రాంబాబు గుర్తొచ్చేలా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణే” అని చెప్పారు. తాను డ్యాన్స్ చేస్తే సంబరాలు, పవన్ చేస్తే సినిమాటిక్ సీన్స్ అన్నట్టుగా పోలికలు కూడా ఇచ్చారు. ‘సంబరాల రాంబాబు’ అనే బిరుదు కూడా పవన్ వల్లే వచ్చిందని అన్నారు.
ఇంతటితో ఆగకుండా, “నేను రాజకీయ నాయకుడిని… ఆయన సినిమా యాక్టర్” అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ‘బ్రో’ సినిమాలో తన పాత్ర పెట్టి గేలి చేశారని ఆరోపించారు, కానీ అదే స్టెప్పులు పవన్ కూడా వేసారని కౌంటర్ ఇచ్చారు. దీంతో సంక్రాంతి పండుగ ముగిసినా… అంబటి స్టెప్పుల హడావుడి మాత్రం ఇంకా ఆగేలా లేదని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు.
This post was last modified on January 14, 2026 10:59 am
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…