ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ యువకులతోపాటు.. చిన్నారులకు కూడా ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, పాటలు వంటివి నిర్వహించారు. ఆయా క్రీడలు, సంబరాల్లో సీఎం చంద్రబాబు , ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా చిన్నారులకు నిర్వహించిన ఆటల పోటీల్లో దేవాన్ష్ పాల్గొని సందడి చేశాడు.
విజిల్ ఆట, కుర్చీలాట, కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడల్లో దేవాన్ష్ ఉత్సాహంగా పాల్గొన్నాడు. స్థానిక చిన్నారులతో కలిసి కలివిడి గా ఆటలాడాడు. దేవాన్ష్ దూకుడు, అతను ఆడిన విధానాన్ని వేదికపై నుంచి చాలా ఆసక్తిగా వీక్షించిన సీఎం చంద్రబాబు ఎంతో మురిసిపోయారు.
తన మనవడిని ప్రోత్సహిస్తూ.. వేదికపై నుంచి చప్పట్లు చరిచారు. ప్రతి సందర్భంలోనూ దేవాన్ష్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా క్రీడల్లో విజేతలుగా నిలిచిన పలువురికి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కానుకలు అందించారు.
కాగా.. బుధవారం భోగిని పురస్కరించుకుని నారావారి పల్లెలోని నివాసం ముందు సీఎం చంద్రబాబు దంపతులు భోగి మంటలు వేయనున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొననున్నారు.
అనంతరం .. స్థానిక నాగాలమ్మ ఆలయంలో సీఎం దంపతులు ప్రత్యేక పూజలు చేయనున్నారు. గురువారం సంక్రాంతిని పురస్కరించుకు ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదేసమయంలో స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకునేందుకు గురువారంప్రత్యేక కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. మొత్తంగా ఈ మూడురోజులు నారా వారిపల్లెలో సందడి వాతావరణం నెలకొంది.
అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…
మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…
మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రంలో జరిగిన అనేక అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం విచారణ చేస్తున్న…
వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…
ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…