Political News

లోకేశ్ పై జోగి వివాదాస్పద కామెంట్లు

కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టై 84 రోజుల పాటు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. బెయిల్ పై వచ్చీ రాగానే జోగి రమేశ్ తన నోటికి పని చెప్పారు.

గతంలో కూడా పలుమార్లు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ లను దుర్భాషలాడిన జోగి రమేశ్…తాజాగా మరోసారి వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ కు ఒళ్లు తగ్గింది కదా కొవ్వు కూడా తగ్గిందనుకున్నానని, కానీ, లోకేశ్ మెదడుకు చిప్ దొబ్బింది అని జోగి రమేశ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

వాడు వీడు అంటూ లోకేశ్ ను పరుష పదజాలంతో జోగి రమేశ్ విమర్శించిన వైనం వివాదాస్పదమైంది. ఇక, చంద్రబాబు, లోకేశ్ తప్పుడు మనుషులు అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడారు. దేవుడిని, గుడిని అపవిత్రం చేయాలని చూసి ఏడాదిన్నరలోనే భ్రష్టు పట్టిపోయారని విమర్శించారు. కల్తీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును అడుగుతున్నానని..లడ్డూ కల్తీ అన్నారని, కానీ, అది నిరూపితం కాలేదని అన్నారు.

ఇక, పరకామణి కేసు, తనపై పెట్టిన కల్తీ మద్యం కేసు కూడా అంతే అవుతాయని చెప్పారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ విచారణ కోరానని, నార్కో అనాలసిస్ కోరానని అయినా స్పందించలేదని అన్నారు. తిరుమల వెంకన్న గుడికి, చంద్రబాబు ఇంటికి వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పినా చంద్రబాబు, లోకేశ్ స్పందించలేదన్నారు. 84 రోజులు తనను జైల్లో పెట్టి పైశాచికానందం పొందారని, అయినా తన గొంతు నొక్కలేకపోయారని అన్నారు.

జగన్ ను సీఎం చేసేదాకా ఈ పోరాటం ఆగదని, కూటమి ప్రభుత్వం అంటేనే మోసాలు, కల్తీ అని తేలిపోయిందని, ఏడాదిన్నరలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. దావోస్ పర్యటన తర్వాత ఏపీకి పెట్టుబడుల వరద అన్నారని, ఎక్కడి నుంచి వరద వస్తోందని ప్రశ్నించారు. దావోస్ కు వెళ్లి డబ్బాలు కొడుతున్నారని….దవాఖానాలో ఆరోగ్య శ్రీ బిల్లులు రాక, మందులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

24 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

9 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

11 hours ago