ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అంబటిపై కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, తనను తిట్టిన వారిని తిరిగి తిట్టానని, చంద్రబాబును తిట్టలేదని అంబటి రాంబాబు క్లారిటీనిచ్చే ప్రయత్నం చేసినా తెలుగు తమ్ముళ్ల ఆవేశం తగ్గలేదు. ఈ క్రమంలోనే గుంటూరులోని అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంపై, ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
అంబటి ఇల్లు, ఆఫీసుపై రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడి చేశారు. తలుపులు, కిటికీలు పగల గొట్టి లోపల ఫర్నిచర్ ధ్వసం చేశారు. అంబటి రాంబాబుకు చెందిన కార్లను కూడా ధ్వంసం చేశారు.
గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంబటి ఇంట్లోకి వారు చొరబడి దాడి చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
ఈ దాడి తర్వాత అంబటి నివాసం దగ్గరకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అంబటి ఇంటి దగ్గర భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అక్కడ ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అంతకుముందు, అంబటి రాంబాబు ఇంటికి పోలీసులు వెళ్లారు. తన ఇంట్లోకి ఎందుకు వచ్చారని అంబటి వారిని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చేందుకు తాము వచ్చామని చెప్పారు. నోటీసులు ఇవ్వాలని అడగగా…మళ్లీ వస్తామని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
This post was last modified on January 31, 2026 6:44 pm
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…
ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…