ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. అంబటిపై కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే, తనను తిట్టిన వారిని తిరిగి తిట్టానని, చంద్రబాబును తిట్టలేదని అంబటి రాంబాబు క్లారిటీనిచ్చే ప్రయత్నం చేసినా తెలుగు తమ్ముళ్ల ఆవేశం తగ్గలేదు. ఈ క్రమంలోనే గుంటూరులోని అంబటి రాంబాబు క్యాంపు కార్యాలయంపై, ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.
అంబటి ఇల్లు, ఆఫీసుపై రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడి చేశారు. తలుపులు, కిటికీలు పగల గొట్టి లోపల ఫర్నిచర్ ధ్వసం చేశారు. అంబటి రాంబాబుకు చెందిన కార్లను కూడా ధ్వంసం చేశారు.
గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలోనే అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంబటి ఇంట్లోకి వారు చొరబడి దాడి చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
ఈ దాడి తర్వాత అంబటి నివాసం దగ్గరకు భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అంబటి ఇంటి దగ్గర భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అక్కడ ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
అంతకుముందు, అంబటి రాంబాబు ఇంటికి పోలీసులు వెళ్లారు. తన ఇంట్లోకి ఎందుకు వచ్చారని అంబటి వారిని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చేందుకు తాము వచ్చామని చెప్పారు. నోటీసులు ఇవ్వాలని అడగగా…మళ్లీ వస్తామని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
This post was last modified on January 31, 2026 6:44 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…