ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సారి నంది నగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి కేసీఆర్ పీఏ చేతికి నోటీసులిచ్చిన సిట్ అధికారులు…రెండోసారి మాత్రం నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోని గోడకు నోటీసులు అంటించి వచ్చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ హర్ట్ అయ్యారు. సిట్ విచారణకు వస్తానని, కానీ, తన గౌరవానికి భంగం కలిగిందని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే సిట్ విచారణాధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ ఏసీపీకి కేసీఆర్ 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. రేపు మ.3 గంటలకు విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పారు. కానీ, నంది నగర్ లో అని చెప్పలేదు. నంది నగర్ లోని తన ఇంటి గోడకి నోటీసులు అంటించడంపై కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోడకు నోటీసులు అంటించమని చట్టంలో ఎక్కడ ఉందని కేసీఆర్ ప్రశ్నించారు.
సిట్ అధికారులు వ్యవహరించిన తీరు చట్టాలకి వ్యతిరేకమని, సుప్రీంకోర్టు తీర్పులను సిట్ అధికారులు తుంగలో తొక్కారని మండిపడ్డారు. సిట్ అధికారులకి నోటీసు ఇచ్చే అధికారమే లేదని, తన రాజ్యాంగ హక్కులను వారు కాలరాస్తున్నారని ఆరోపించారు. తన తదుపరి నోటీసులన్నీ ఎర్రవల్లిలోని తన నివాసానికే పంపాలని చెప్పానని, అయినా సరే గుర్తుతెలియని వ్యక్తులు సిట్ అధికారుల సంతకంతో ఉన్న లేఖను గోడకు అంటించి వెళ్లినట్లు తెలిసిందని లేఖలో పేర్కొన్నారు.
ఆ లేఖ సిట్ అధికారులు పంపినట్లయితే దానిని ఆక్షేపిస్తున్నానని చెప్పారు. సీఆర్పీసీ 160 నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలని, కానీ చట్టాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను సిట్ అధికారులు ఉల్లంఘించారని విమర్శించారు. అది కోర్టు ధిక్కరణ అని, ఆ రెండో నోటీసు చట్టబద్ధంగా అందలేదని, అది చెల్లదని చెప్పారు. అంతేకాదు, తాను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ, పొరుగు పోలీస్ స్టేషన్ పరిధిలో గానీ నివసించడం లేదని, నోటీసు ఇచ్చే సమయానికి వ్యక్తి నివసిస్తున్న ప్రదేశం ముఖ్యమని తెలిపారు.
ఎలక్షన్ అఫిడవిట్ లో నంది నగర్ అడ్రస్ ఉందని చెబుతున్నారని, కానీ, కొన్ని సంవత్సరాలుగా ఎర్రవల్లిలో తాను నివసిస్తున్నాను అన్నది నిర్వివాద అంశమని గుర్తు చేశారు. అక్కడే తన స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కోరారు.
హరీష్ రావు ఎన్నికల అఫిడవిట్ లో సిద్దిపేట చిరునామా ఉన్నా…హైదరాబాద్ లో నోటీసులిచ్చారని గుర్తు చేశారు. మరి, హరీశ్ రావు విషయంలో కేసీఆర్ లాజిక్, ఆ లేఖపై సిట్ అధికారుల స్పందన ఏంటి? ఆయనను ఎర్రవెల్లిలోనే విచారణ జరుపుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
This post was last modified on January 31, 2026 8:39 pm
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు దుర్భాషలాడిన వైనంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం... పెట్టుబడులకు స్వర్గధామంగా మారుస్తామని చెబుతున్న హైదరాబాద్లో గన్ కల్చర్ పెరుగుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వ్యక్తిగతంగా…
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న…
తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు కేవలం సౌత్ ఇండియాకో లేదా దేశానికో పరిమితం కాలేదు. గ్లోబల్ మార్కెట్లో టాలీవుడ్ సృష్టించిన…