Political News

బీజేపీ ఒత్తిడికి లొంగిపోయిన పవన్

మరోసారి జనసేన అధినేత బీజేపీ ఒత్తిడికి లొంగిపోయినట్లే అర్ధమవుతోంది. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేయబోతున్నట్లు కమలంపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేశారు. శనివారం తిరుపతిలో మొదలైన రెండురోజుల పార్టీ కార్యవర్గ సమావేశాల్లో వీర్రాజు మాట్లాడుతు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో జనసేన బలపరిచే బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారంటు చేసిన ప్రకటన ఒక్కసారిగా సంచలనమైంది.

తిరుపతిలో మిత్రపక్షాల అభ్యర్ధిగా పోటీ చేయబోయేది కమలంపార్టీ నేతే అనేది అందరు అనుకుంటున్నదే. రెండు నెలల నుండి ఇదే విషయాన్ని వీర్రాజు పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే మధ్యలో పవన్ బెట్టుచేయటంతో వీర్రాజు తన ప్రకటనలకు విరామం ఇచ్చారు. ఇంతలో తెలంగాణాలో దుబ్బాక ఉపఎన్నికల నోటిఫికేషన్ రావటంతో అందరి దృష్టి దానిపై పడింది. అక్కడ అనూహ్యంగా బీజేపీ గెలవటంతో పార్టీలో ఒక్కసారిగా ఊపు వచ్చేసింది.

ఈ వేడి చల్లారకముందే గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ రావటం తర్వాత జరిగిన వ్యవహారాలన్నీ అందరికీ తెలిసిందే. గ్రేటర్ లో కూడా ఊహించని విధంగా ఏకంగా 48 డివిజన్లలో గెలవటంతో బీజేపీని పట్టుకోవటం కష్టమైపోయింది. ఈ నేపధ్యంలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశం ఎట్టి పరిస్దితి జనసేనకు ఇవ్వదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. అందరు అనుకున్నట్లుగానే పవన్ పై కమలంపార్టీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది.

తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు పార్టీల బలాబలాలపై పవన్ కు బీజేపీ పెద్ద ప్రజంటేషనే ఇచ్చింది. ఇదే సమయంలో పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కూడా వాస్తవాలను గ్రహించారు. ఇక లాభం లేదనుకుని తిరుపతిలో పోటీ చేసే విషయమై బీజేపీకి త్యాగం చేసేసినట్లే అర్ధమవుతోంది. ఎందుకంటే తిరుపతిలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారని వీర్రాజు ప్రకటించారంటే ఈ విషయం పవన్ తో చర్చించకుండా బహిరంగంగా ప్రకటించే అవకాశం లేదు.

సో తెరవెనుక జరిగింది చూస్తుంటే బీజేపీ ఒత్తిడికి పవన్ మరోసారి లొంగిపోయినట్లే అర్ధమైపోతోంది. గ్రేటర్ ఎన్నికల్లో కూడా పార్టీ తరపున అభ్యర్ధులను ప్రకటించిన పవన్ తర్వాత కమలం ఒత్తిడికి లొంగిపోయి పోటీనుండే విత్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. పోటీనుండి విత్ డ్రా అయినా ప్రచారం చేస్తారని బీజేపీ నేతలు ముందు ప్రకటించారు. పోటీ నుండి జనసేన అభ్యర్ధులు విత్ డ్రా అయిపోయిన తర్వాత చివరకు ప్రచారానికి కూడా వద్దని చెప్పి దూరంగా పెట్టేశారు. మొత్తానికి ఎక్కడికక్కడ పవన్ పై మైండ్ గేమ్ ఆడటం, ఒత్తిడి పెట్టడం తనకు అనుకూలంగా మలుచుకోవటంలో బీజేపీ నేతలు సక్సెస్ అవుతున్నారు.

This post was last modified on December 14, 2020 12:49 am

Share
Show comments
Published by
satya

Recent Posts

వీరమల్లు హఠాత్తుగా ఎందుకు వస్తున్నట్టు

నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా అదిగో ఇదిగో అనడమే తప్ప హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజనే సంగతి ఎంతకీ తేలక అభిమానులు దాని…

26 mins ago

ఆ ఒక్కటి ఇచ్చేయండి ప్లీజ్

అవును. అల్లరి నరేష్ తో పాటు ఈ శుక్రవారం వస్తున్న పోటీ సినిమాలకు టాలీవుడ్ ఇదే విన్నపం చేస్తోంది.  చాలా…

1 hour ago

ఎన్నిక‌ల‌కు ముందే ఆ రెండు ఖాయం చేసుకున్న టీడీపీ?

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల పోరు ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య నిప్పులు చెరుగుకునే…

2 hours ago

సైడ్ ఎఫెక్ట్స్ మాట నిజమే.. కోవిషీల్డ్!

కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…

3 hours ago

తారక్ హృతిక్ జోడి కోసం క్రేజీ కొరియోగ్రాఫర్

జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…

3 hours ago

పుష్ప 2 ఖాతాలో అరుదైన ఘనత

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…

4 hours ago