మరోసారి జనసేన అధినేత బీజేపీ ఒత్తిడికి లొంగిపోయినట్లే అర్ధమవుతోంది. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేయబోతున్నట్లు కమలంపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించేశారు. శనివారం తిరుపతిలో మొదలైన రెండురోజుల పార్టీ కార్యవర్గ సమావేశాల్లో వీర్రాజు మాట్లాడుతు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో జనసేన బలపరిచే బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారంటు చేసిన ప్రకటన ఒక్కసారిగా సంచలనమైంది.
తిరుపతిలో మిత్రపక్షాల అభ్యర్ధిగా పోటీ చేయబోయేది కమలంపార్టీ నేతే అనేది అందరు అనుకుంటున్నదే. రెండు నెలల నుండి ఇదే విషయాన్ని వీర్రాజు పదే పదే ప్రకటిస్తున్నారు. అయితే మధ్యలో పవన్ బెట్టుచేయటంతో వీర్రాజు తన ప్రకటనలకు విరామం ఇచ్చారు. ఇంతలో తెలంగాణాలో దుబ్బాక ఉపఎన్నికల నోటిఫికేషన్ రావటంతో అందరి దృష్టి దానిపై పడింది. అక్కడ అనూహ్యంగా బీజేపీ గెలవటంతో పార్టీలో ఒక్కసారిగా ఊపు వచ్చేసింది.
ఈ వేడి చల్లారకముందే గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ రావటం తర్వాత జరిగిన వ్యవహారాలన్నీ అందరికీ తెలిసిందే. గ్రేటర్ లో కూడా ఊహించని విధంగా ఏకంగా 48 డివిజన్లలో గెలవటంతో బీజేపీని పట్టుకోవటం కష్టమైపోయింది. ఈ నేపధ్యంలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశం ఎట్టి పరిస్దితి జనసేనకు ఇవ్వదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. అందరు అనుకున్నట్లుగానే పవన్ పై కమలంపార్టీ మైండ్ గేమ్ మొదలుపెట్టేసింది.
తిరుపతి లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు పార్టీల బలాబలాలపై పవన్ కు బీజేపీ పెద్ద ప్రజంటేషనే ఇచ్చింది. ఇదే సమయంలో పార్టీ నేతలతో సమావేశమైన పవన్ కూడా వాస్తవాలను గ్రహించారు. ఇక లాభం లేదనుకుని తిరుపతిలో పోటీ చేసే విషయమై బీజేపీకి త్యాగం చేసేసినట్లే అర్ధమవుతోంది. ఎందుకంటే తిరుపతిలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారని వీర్రాజు ప్రకటించారంటే ఈ విషయం పవన్ తో చర్చించకుండా బహిరంగంగా ప్రకటించే అవకాశం లేదు.
సో తెరవెనుక జరిగింది చూస్తుంటే బీజేపీ ఒత్తిడికి పవన్ మరోసారి లొంగిపోయినట్లే అర్ధమైపోతోంది. గ్రేటర్ ఎన్నికల్లో కూడా పార్టీ తరపున అభ్యర్ధులను ప్రకటించిన పవన్ తర్వాత కమలం ఒత్తిడికి లొంగిపోయి పోటీనుండే విత్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. పోటీనుండి విత్ డ్రా అయినా ప్రచారం చేస్తారని బీజేపీ నేతలు ముందు ప్రకటించారు. పోటీ నుండి జనసేన అభ్యర్ధులు విత్ డ్రా అయిపోయిన తర్వాత చివరకు ప్రచారానికి కూడా వద్దని చెప్పి దూరంగా పెట్టేశారు. మొత్తానికి ఎక్కడికక్కడ పవన్ పై మైండ్ గేమ్ ఆడటం, ఒత్తిడి పెట్టడం తనకు అనుకూలంగా మలుచుకోవటంలో బీజేపీ నేతలు సక్సెస్ అవుతున్నారు.
లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం…
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…