తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశాల్లో కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని హౌలా అని, ఆ హౌలాగాణ్ణి ఉరితీయాలని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ లీడర్ కాదని.. రీడర్ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. వరంగల్లో రైతులకు ఇచ్చిన హామీని మరిచిన రాహుల్ గాంధీని ఉరితీయాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చిన కేసీఆర్ను ఉరి తీయాలా? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డిని ఉరితీయడం కాదని, ఆయనను ఇంకా చాలా చేయాలని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి లాగులో తొండలిడిచిపెడదాం అంటూ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను మర్చిపోయారని విమర్శలు గుప్పించారు.
ఇక, తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న తీరును కేటీఆర్ తప్పుబట్టారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అని విమర్శించారు. శాసనసభ బూతుల సభగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా దొరకక రైతులు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు.
This post was last modified on January 6, 2026 6:41 pm
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…
రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…
ప్రపంచంలో ఏ భాషలో అయినా సినిమా గొప్పదనం ఒకటుంది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వాళ్ళను దశాబ్దాల తరబడి గుర్తుంచుకునేలా…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…