Political News

సంచలనం… ఏకంగా 3 కోట్ల ఓట్లు గల్లంతు!

ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన విషయం బయటపడింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) విడుదల చేసిన కొత్త డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ఏకంగా 2.89 కోట్ల మంది పేర్లు మాయమయ్యాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత ఈ భారీ ప్రక్షాళన జరిగింది. ఇంతకుముందు 15.44 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 12.55 కోట్లకు పడిపోయింది.

ఈ తగ్గింపు ఎంత భారీగా ఉందంటే, మొత్తం ఓటర్లలో దాదాపు 18.7 శాతం మంది పేర్లు గల్లంతయ్యాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే, ప్రతి ఐదుగురు ఓటర్లలో ఒకరి పేరు లిస్ట్ నుంచి ఎగిరిపోయింది. ఇలాంటి భారీ మార్పు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఇంతమందిని ఎందుకు తొలగించారు అనే సందేహం మీకు రావచ్చు. దీనికి అధికారులు పక్కా లెక్కలు చెప్పారు.

చనిపోయిన వారు సుమారు 46.23 లక్షల మంది, వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారు ఏకంగా 2.17 కోట్ల మంది ఉన్నారు. ఇక ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం వల్ల 25.46 లక్షల మంది పేర్లను తొలగించారు. అయితే కంగారు పడాల్సిన పనిలేదు. ఒకవేళ అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున పోయి ఉంటే, వాటిని మళ్ళీ చేర్పించుకోవచ్చు. దీనికోసం జనవరి 6 నుంచి ఫిబ్రవరి 6 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ సమయం ఇచ్చారు.

ఫార్మ్ 6 నింపి, తగిన ఆధారాలు చూపిస్తే మళ్ళీ ఓటు హక్కు పొందవచ్చు. కేవలం ఉత్తర ప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. ఇటీవల తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్ లో 74 లక్షల మంది ఓటర్ల పేర్లను ఇలాగే తగ్గించారు. అలాగే అస్సాం లో కూడా 10.56 లక్షల పేర్లను లిస్ట్ నుంచి తీసేశారు. బోగస్ ఓట్లను ఏరివేయడమే లక్ష్యంగా ఈసీ ఈ పని చేస్తోంది.

This post was last modified on January 6, 2026 5:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

క‌ల‌లో కూడా ఊహించ‌ని కాంగ్రెస్‌ – బీజేపీ పొత్తు

ఔను.. మీరు చ‌దివింది నిజ‌మే. నిత్యం ఉప్పు-నిప్పుగా ఉండే.. రెండు రాజ‌కీయాలు.. ఒక‌రిపై ఒక‌రు దుమ్మె త్తిపోసుకునే రాజకీయ పార్టీలు..…

34 minutes ago

సంక్రాంతికి శ్రీలీల ఛాయిస్… తన సినిమా కాదు

ఒకే వీకెండ్లో తన సినిమాకు పోటీగా వేరే సినిమా వస్తుంటే.. ఒక చిత్ర బృందంలోని ఏ వ్యక్తి అయినా తమ…

1 hour ago

కేటీఆర్ పర్యటనలో ‘జై జగన్.. జై కేసీఆర్’

వైసీపీ శ్రేణులు బీఆర్ఎస్ విజయం కోసం, బీఆర్ఎస్ కార్యకర్తలు వైసీపీ గెలుపు కోసం కోరుకుంటున్నారని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వైసీపీ…

1 hour ago

ఐబొమ్మ ర‌వికి మ‌రిన్ని క‌ష్టాలు!

సినిమా పైర‌సీల ద్వారా గుర్తింపు పొందిన ఐబొమ్మ ర‌వికి మ‌రిన్ని క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ప్ర‌స్తుతం ఐదు కేసుల్లో ర‌వి నిందితుడిగా…

2 hours ago

మీనాక్షి… ఈ సంక్రాంతికీ జాక్‌పాట్ కొడుతుందా?

‘ఇచట వాహనములు నిలపరాదు’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయం అయింది మిస్ ఇండియా మాజీ రన్నరప్ మీనాక్షి చౌదరి.…

2 hours ago

రాజధాని రైతుల రుణమాఫీపై బాబు ఏమన్నారు?

ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు శుభవార్త చెప్పారు మంత్రి నారాయణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు…

3 hours ago