Political News

సంచలనం… ఏకంగా 3 కోట్ల ఓట్లు గల్లంతు!

ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన విషయం బయటపడింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) విడుదల చేసిన కొత్త డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ఏకంగా 2.89 కోట్ల మంది పేర్లు మాయమయ్యాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత ఈ భారీ ప్రక్షాళన జరిగింది. ఇంతకుముందు 15.44 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 12.55 కోట్లకు పడిపోయింది.

ఈ తగ్గింపు ఎంత భారీగా ఉందంటే, మొత్తం ఓటర్లలో దాదాపు 18.7 శాతం మంది పేర్లు గల్లంతయ్యాయి. అంటే సింపుల్ గా చెప్పాలంటే, ప్రతి ఐదుగురు ఓటర్లలో ఒకరి పేరు లిస్ట్ నుంచి ఎగిరిపోయింది. ఇలాంటి భారీ మార్పు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఇంతమందిని ఎందుకు తొలగించారు అనే సందేహం మీకు రావచ్చు. దీనికి అధికారులు పక్కా లెక్కలు చెప్పారు.

చనిపోయిన వారు సుమారు 46.23 లక్షల మంది, వేరే ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారు ఏకంగా 2.17 కోట్ల మంది ఉన్నారు. ఇక ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండటం వల్ల 25.46 లక్షల మంది పేర్లను తొలగించారు. అయితే కంగారు పడాల్సిన పనిలేదు. ఒకవేళ అర్హులైన ఓటర్ల పేర్లు పొరపాటున పోయి ఉంటే, వాటిని మళ్ళీ చేర్పించుకోవచ్చు. దీనికోసం జనవరి 6 నుంచి ఫిబ్రవరి 6 వరకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ సమయం ఇచ్చారు.

ఫార్మ్ 6 నింపి, తగిన ఆధారాలు చూపిస్తే మళ్ళీ ఓటు హక్కు పొందవచ్చు. కేవలం ఉత్తర ప్రదేశ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. ఇటీవల తమిళనాడులో 97 లక్షలు, గుజరాత్ లో 74 లక్షల మంది ఓటర్ల పేర్లను ఇలాగే తగ్గించారు. అలాగే అస్సాం లో కూడా 10.56 లక్షల పేర్లను లిస్ట్ నుంచి తీసేశారు. బోగస్ ఓట్లను ఏరివేయడమే లక్ష్యంగా ఈసీ ఈ పని చేస్తోంది.

This post was last modified on January 6, 2026 5:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

39 minutes ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

4 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

5 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

6 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

6 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

6 hours ago