తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మూసీ నది ప్రక్షాళనపై వాడీవేడి చర్చ జరిగింది. అయితే, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ నేతలకు స్పీకర్ మైక్ ఇవ్వలేదు. ముఖ్యమంత్రిని విమర్శిస్తానంటే మైక్ ఇవ్వబోనని స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్పారు.
దీంతో, బీఆర్ఎస్ సభ్యులు సభను బాయ్ కాట్ చేసి వాకౌట్ చేశారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితోపాటు, స్పీకర్ గడ్డం ప్రసాద్ లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసీ నది కంటే ముందు ముఖ్యమంత్రి నోటిని ప్రక్షాళన చేయాలంటూ హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు.
మూసీ నది కంపు కంటే ముఖ్యమంత్రి మాటల కంపు ఎక్కువైందని విమర్శించారు. శాసన సభను గాంధీభవన్ గా, సీఎల్పీ మీటింగ్ గా మార్చారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చేతగాక, ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాదిరిగా, సీఎల్పీ మీటింగ్ లో మాట్లాడిన విధంగా, బహిరంగ సభలో మాట్లాడినట్లుగా శాసన సభలో రేవంత్ సొల్లు మాట్లాడారని విమర్శించారు. మూసీకి తాము వ్యతిరేకం కాదని, పేదల ఇళ్లు కూల్చడానికే తాము వ్యతిరేకమని అన్నారు.
ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, మూసీ ప్రక్షాళన మొదలుబెట్టిందే బీఆర్ఎస్ అని గుర్తు చేశారు. ఇక, తమకు సమాధానాలు చెప్పలేక ముఖ్యమంత్రి బాడీ షేమింగ్ కు దిగుతున్నారని, చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నువ్వు ముఖ్యమంత్రివా లేక స్ట్రీట్ రౌడీవా అంటూ రేవంత్ పై హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
వీధి రౌడీలు కూడా రేవంత్ కంటే మంచిగా మాట్లాడతారని అన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ మీద పదే పదే చావు భాష వాడుతున్న రేవంత్ ను తెలంగాణ ద్రోహి అని, నీళ్ల ద్రోహి అని షాకింగ్ కామెంట్స్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
This post was last modified on January 2, 2026 3:07 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…