ఎల్లుండి తిరుపతిలో మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ లాంచ్ జరగబోతోంది. ఇప్పటిదాకా ఒక లెక్క ఇకనుంచి ఒక లెక్క అనేలా ఫైనల్ కట్ ఉంటుందని మెగా ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ రోజు వరకు మూడు పాటలు మినహాయించి ఈ సినిమా నుంచి ఎలాంటి వీడియో కంటెంట్ రాలేదు.
అంటే సన్నివేశాలు, డైలాగులు, ఫైట్లు లాంటివి ఏవీ రివీల్ చేయకుండా దర్శకుడు అనిల్ రావిపూడి ఇక్కడిదాకా నెట్టుకొచ్చారు. అటుచూస్తే వందల కోట్లతో తీసిన రాజా సాబ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీ ఇప్పటికే రెండు టీజర్లు, ఒక ట్రైలర్ కలిపి మొత్తం తొమ్మిది నిమిషాల వీడియోని అభిమానులకు చూపించేసింది.
బిజినెస్ ఎంత బాగా జరుగుతున్నా మెగాస్టార్ ఇమేజ్, రావిపూడి బ్రాండ్ మీద ఎంత క్రేజ్ నెలకొన్నా, గ్రౌండ్ లెవెల్ లో ముఖ్యంగా సోషల్ మీడియాలో దీని తాలూకు సౌండ్ ఇంకా పెరగాలి. ఇప్పుడు ట్రైలర్ లో చూపించే విజువల్స్, కామెడీ యాంగిల్స్, యాక్షన్ బిట్స్ మీదే ఇది ఆధారపడి ఉంటుంది.
ఎందుకంటే భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి తెరమీద కనిపించి రెండు సంవత్సరాల అయిదు నెలలైపోయాయి. ఇది చాలా ఎక్కువ గ్యాప్. అవతల బాలకృష్ణ ఇదే టైంలో దూసుకుపోయారు. అఖండ 2 టాక్ తో సంబంధం లేకుండా ఎంతో కొంత వసూళ్లు తెస్తూనే ఉండటానికి కారణం బాలయ్య స్క్రీన్ కంటిన్యూటీ మెయిన్ టైన్ చేయడం.
సో ఇప్పుడు ఒక్కసారిగా మన శంకరవరప్రసాద్ గారు మీద హైప్ పెరిగిపోవాలంటే ఆ మేజిక్ చేసే బాధ్యత ట్రైలర్ మీదే ఉంది. ఇన్ సైడ్ టాక్ అయితే అనిల్ రావిపూడి ఏదీ దాచకుండా మెయిన్ లైన్ రివీల్ చేశారని, చిరు నయన్ ప్రేమ,పెళ్లి, విడాకులతో పాటు ఫ్యామిలీ సెటప్, విలన్ గ్యాంగ్ వ్యవహారం లాంటివన్నీ చూపించబోతున్నారట.
ముఖ్యంగా మెగాస్టార్ స్వాగ్ చూపించే కీలకమైన క్లిప్స్ ఇందులో పొందుపరిచారని తెలిసింది. అదే నిజమైతే మటుకు ట్రైలర్ మీదున్న మెగా ఒత్తిడి పాజిటివ్ గా మారిపోయి అంచనాలు పెంచేస్తుంది. ముఖ్యంగా టార్గెట్ చేసుకున్న ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పిస్తే లక్ష్యం నెరవేరినట్టే.
This post was last modified on January 2, 2026 2:49 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…