గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుకను ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో గర్భస్రావాలు, రక్తహీనతకు కారణమవుతున్న సికిల్ సెల్ ఎనేమియాను ఎదుర్కొనే దిశగా అరకు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మించనున్నారు. ఈ భవనంలో అవసరాలకు అనుగుణంగా రక్త నిల్వ సదుపాయాలు ఏర్పాటు చేసి, పూర్తి అయిన అనంతరం అరకు ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానం చేయనున్నారు.
‘అడవితల్లి బాట’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా కురిడీ గ్రామంలో నిర్వహించిన మాటా–మంతి కార్యక్రమంలో ఓ గిరిజన మహిళ సికిల్ సెల్ ఎనేమియా కారణంగా ఎదురవుతున్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జన్యుపరంగా వచ్చే ఈ వ్యాధి గర్భిణుల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని వివరించగా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని పవన్ కళ్యాణ్ అప్పుడే హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు వైద్య నిపుణులతో పలు దఫాలుగా చర్చలు జరిపిన ఉప ముఖ్యమంత్రి, రక్త మార్పిడి ద్వారా ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చన్న సూచనలతో బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1,500 మంది సికిల్ సెల్ ఎనేమియా బాధితులకు గణనీయమైన ఉపశమనం లభించనుంది.
This post was last modified on December 31, 2025 9:28 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…