గిరిజన మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుకను ప్రకటించారు. గిరిజన ప్రాంతాల్లో గర్భస్రావాలు, రక్తహీనతకు కారణమవుతున్న సికిల్ సెల్ ఎనేమియాను ఎదుర్కొనే దిశగా అరకు నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మించనున్నారు. ఈ భవనంలో అవసరాలకు అనుగుణంగా రక్త నిల్వ సదుపాయాలు ఏర్పాటు చేసి, పూర్తి అయిన అనంతరం అరకు ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానం చేయనున్నారు.
‘అడవితల్లి బాట’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా కురిడీ గ్రామంలో నిర్వహించిన మాటా–మంతి కార్యక్రమంలో ఓ గిరిజన మహిళ సికిల్ సెల్ ఎనేమియా కారణంగా ఎదురవుతున్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జన్యుపరంగా వచ్చే ఈ వ్యాధి గర్భిణుల ప్రాణాలకు ముప్పుగా మారుతోందని వివరించగా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని పవన్ కళ్యాణ్ అప్పుడే హామీ ఇచ్చారు.
ఆ హామీ మేరకు వైద్య నిపుణులతో పలు దఫాలుగా చర్చలు జరిపిన ఉప ముఖ్యమంత్రి, రక్త మార్పిడి ద్వారా ఈ వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చన్న సూచనలతో బ్లడ్ బ్యాంక్ భవన నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1,500 మంది సికిల్ సెల్ ఎనేమియా బాధితులకు గణనీయమైన ఉపశమనం లభించనుంది.
This post was last modified on December 31, 2025 9:28 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…