మందుబాబులం మేము మందుబాబులం…మందుకొడితె మాకు మేమె మహారాజులం…నిజంగానే చాలామంది మందుబాబులు మందేయగా ఇలాగే ఫీలవుతుంటారు. అందుకే, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడగానే…మా నాన్నఎవరో తెలుసా? మా అంకుల్ ఎవరో తెలుసా? ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ…అంటూ ట్రాఫిక్ పోలీసులను, పోలీసులను బెదిరిస్తుంటారు. అయితే, ఇకపై అలా బెదిరించే బిల్డప్ బాబాయ్ ల ఆటలు చెల్లవంటున్నారు హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్.
వీసీ సజ్జనార్ పోలీసింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. సోషల్ మీడియాలో, మీడియాలో యాక్టివ్ గా ఉండే సజ్జనార్…తన మార్క్ పోలీసింగ్ తో పాపులర్ అయ్యారు. ఆ కోవలోనే మందుబాబులకు సజ్జనార్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుబడ్డ తర్వాత మా డాడీ ఎవరో తెలుసా..అంకుల్ ఎవరో తెలుసా..అన్న ఎవరో తెలుసా…అని తమ పోలీసు ఆఫీసర్లను అడగొద్దని సజ్జనార్ అంటున్నారు.
అదే సమయంలో తాము వారి ప్రైవసీకి భంగం కలగనివ్వబోమని, గౌరవిస్తామని చెబుతున్నారు. కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే మాత్రం బండి పక్కన పెట్టి, కేసు డేట్ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం అంటున్నారు సజ్జనార్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే హైదరాబాద్ పోలీసులు అస్సలు సహించరని, జీరో టాలరెన్స్ అని చెప్పారు.
మోతాదుకు మించి డ్రింక్ చేస్తే స్టీరింగ్ పట్టుకోకూడదని, క్యాబ్ ను పిలవాలని అంటున్నారు. ఆ సమయంలో గూగుల్ లో క్యాబ్ అని వెతకాలని, లాయర్ అని కాదని చెప్పారు. ముఖ్యంగా, డిసెంబరు 31, జనవరి 1వ తేదీన న్యూ ఈయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదవుతుంటాయి. అందుకే, సజ్జనార్ ముందస్తుగానే తనదైన శైలిలో మందుబాబులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం సజ్జనార్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
This post was last modified on December 29, 2025 6:45 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…