ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తిరుపతిలో తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులకు దర్శనం సందర్భంగా తగినంత ప్రాధాన్యత దక్కడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఆ విషయంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభలో ప్రస్తావించారు. అంతేకాదు, తిరుపతిలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తిరుపతిలో ఆల్రెడీ కర్ణాటక భవన్, తమిళనాడు భవన్ ఉన్నాయని కమలాకర్ గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుపతికి వెళ్లినప్పుడు వారికి బస చేసేందుకు ఇబ్బంది లేదని అన్నారు. కానీ, తెలంగాణ ప్రజా ప్రతినిధులకు మాత్రం ఇబ్బంది ఎదురవుతోందని, అందుకే తిరుపతిలో తెలంగాణ భవన్ కూడా నిర్మిస్తే బాగుంటుందని, తెలంగాణ నేతలు వెళ్లినప్పుడు బసతోపాటు ప్రాధాన్యత కూడా ఉంటుందని అన్నారు. మరి, ఈ ఆలోచన కార్యరూపం దాలుస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.
This post was last modified on December 29, 2025 1:31 pm
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…
నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…