ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత తిరుపతిలో తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులకు దర్శనం సందర్భంగా తగినంత ప్రాధాన్యత దక్కడం లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు కూడా ఆ విషయంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సభలో ప్రస్తావించారు. అంతేకాదు, తిరుపతిలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తిరుపతిలో ఆల్రెడీ కర్ణాటక భవన్, తమిళనాడు భవన్ ఉన్నాయని కమలాకర్ గుర్తు చేశారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుపతికి వెళ్లినప్పుడు వారికి బస చేసేందుకు ఇబ్బంది లేదని అన్నారు. కానీ, తెలంగాణ ప్రజా ప్రతినిధులకు మాత్రం ఇబ్బంది ఎదురవుతోందని, అందుకే తిరుపతిలో తెలంగాణ భవన్ కూడా నిర్మిస్తే బాగుంటుందని, తెలంగాణ నేతలు వెళ్లినప్పుడు బసతోపాటు ప్రాధాన్యత కూడా ఉంటుందని అన్నారు. మరి, ఈ ఆలోచన కార్యరూపం దాలుస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…