Political News

ఒకప్పుడు నేతలకు.. ఇప్పుడు పిల్లలకు..

హైదరాబాద్‌లోని గండిపేట ప్రాంతంపై తనకు ఎంతో మక్కువ ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. గండిపేటలో ఒకప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం ఉండేదని చెప్పారు. అక్కడ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు శిక్షణ ఇచ్చి వారిని మేలైన నేతలుగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో ఎన్టీఆర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేసి చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అందుకే తనకు గండిపేట అంటే అమితమైన మక్కువ అని అన్నారు.

తాజాగా ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి, సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.

తొలుత విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించిన సీఎం చంద్రబాబు, అనంతరం సతీసమేతంగా విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలను తిలకించారు. విద్యలో రాణిస్తున్న పలువురు విద్యార్థులకు పతకాలు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి చంద్రబాబు కీలక ఉపన్యాసం చేశారు.

ఒకప్పుడు రాజకీయ కేంద్రంగా ఉన్న గండిపేట కార్యాలయం ఇప్పుడు విద్యలకు నిలయంగా మారిందన్నారు. ఇక్కడ వేలాది మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ముఖ్యంగా కుటుంబాల్లో వివిధ కారణాల వల్ల తలెత్తిన వివాదాల కారణంగా అనాథలైన చిన్నారులను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నామని చెప్పారు.

ఎన్టీఆర్ విద్యాసంస్థలను భువనేశ్వరి సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో ఎన్టీఆర్ విద్యాసంస్థలకు చెందిన నలుగురు విద్యార్థులు ఎంపికయ్యారని, ఇది తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందన్నారు. అలాగే ఐఐటీలు, ఎన్ ఐటీల్లో కూడా ఎన్టీఆర్ విద్యాసంస్థల్లో చదువుతున్న చిన్నారులు రాణిస్తున్నారని తెలిపారు. మొత్తంగా 1600 మందికిపైగా పిల్లలు ఎన్టీఆర్ విద్యాసంస్థల్లో చదువుతున్నారని వివరించారు.

ఇక హైదరాబాద్‌లో ఐటీ, ఉన్నత విద్యాసంస్థల రాక వంటి అంశాలపైనా చంద్రబాబు మాట్లాడారు. ఒకప్పుడు ఐటీ చదువుల కోసం వేర్వేరు ప్రాంతాలకు, విదేశాలకు వెళ్లాల్సి వచ్చేదన్నారు. కానీ తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నత విద్యాసంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశామని, తద్వారా హైదరాబాద్ ఉన్నత విద్యకు కేర్ ఆఫ్‌గా మారిందని వివరించారు.

హైటెక్ సిటీ ద్వారా ఐటీని ప్రోత్సహించానన్నారు. ఇప్పుడు హైటెక్ సిటీ హైదరాబాద్‌కు ఒక మణిహారంగా మారిందన్నారు. అలాగే సాగు రంగానికి దన్నుగా ఉండేందుకు హెరిటేజ్ సంస్థను స్థాపించామని, దీని వల్ల వేల మంది పాడి రైతులు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. ఇదే తరహాలో ఏపీని కూడా అభివృద్ధి చేస్తున్నామని, ఐటీ, కంప్యూటింగ్, హరిత ఇంధనం, గూగుల్ డేటా సెంటర్లను తీసుకువస్తున్నామని తెలిపారు.

This post was last modified on December 27, 2025 10:51 pm

Page: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఉనికిని చాటడానికి ‘రాకాస’ ప్లాన్లు

చిన్న సినిమాను పెద్దగా ప్రమోట్ చేస్తే తప్ప జనాలకు సులభంగా రీచ్ కాలేని రోజులివి. అందుకే లిటిల్ హార్ట్స్ ప్రొడక్షన్…

3 hours ago

డీజిల్ లేదు… అంత్యక్రియలు ఆపేస్తారా?

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు థాయిలాండ్‌లోని అంత్యక్రియలపై పడింది. దేశంలో తీవ్రమైన డీజిల్ కొరత ఏర్పడటంతో బౌద్ధ దేవాలయాల్లో…

3 hours ago

సల్మాన్ సినిమా మునిగినట్లేనా?

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…

6 hours ago

ఆంటీలతో చాట్ చేయండి అంటూ…

సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…

6 hours ago

వామ్మో… కత్తిరింపుల్లోనే ఇంత హింస ఉందంటే

దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…

7 hours ago

ప్రేక్షకులపై ‘ఉస్తాద్’ నిర్మాతల ప్రేమ నిజమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…

8 hours ago