ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏదైనా విషయంపై దృష్టి పెట్టారంటే.. అది సాధించే వరకు వెంట పడుతూనే ఉంటారు. అది ప్రజాసంక్షేమం కావొచ్చు.. పార్టీ కార్యక్రమం కావొచ్చు. ఏదైనా తన దృష్టికి వస్తే.. దానిలో మంచి చెడులు విచారించి తక్షణ చర్యలు తీసుకుంటున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతానికి చెందిన డీఎస్పీ జయ సూర్య వ్యవహారంపై కొన్నాళ్ల కిందట పవన్ సీరియస్ అయ్యారు.
ఆయన వ్యవహార శైలిపై వచ్చిన విమర్శలకు సంబంధించి నివేదిక కూడా కోరారు. స్థానిక జనసేన నాయకులను ఇబ్బంది పెట్టడం.. వేరే నేతలతో చేతులు కలపడం.. అవసరం వస్తే.. కూటమి నాయకుల పేర్లు వాడుకోవడం వంటివి జయసూర్య చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
ముఖ్యంగా పేకాట, బెల్టు షాపుల విషయంపై జనసేన నాయకులు నేరుగా పవన్ కల్యాణ్కు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో జిల్లా ఎస్పీ నుంచి పవన్ కల్యాణ్ నెల రోజుల కిందట డీఎస్పీ వ్యవహారంపై నివేదిక కోరారు.
అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చకు వచ్చింది. ముఖ్యంగా ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. డీఎస్పీ జయసూర్యను సమర్థిస్తూ.. మాట్లాడారు. అయితే.. పవన్ కల్యాణ్ దృష్టికి వచ్చిన విషయాలు తనకు తెలియకపోవచ్చని చెప్పారు.
జయసూర్య బాగానే పనిచేస్తున్నారని రఘురామ చెప్పారు. ఇక, ఈ వ్యవహారం అప్పట్లో కొంత చర్చకు దారి తీసినా.. తర్వాత అందరూ మరిచిపోయారు. అయితే.. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భీమవరం డీఎస్పీగా ఉన్న జయసూర్యను అక్కడి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో రఘు వీర్ విష్ణు అనే డీఎస్పీని నియమించింది. ఇక, జయసూర్యకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా.. డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేసింది. దీంతో జయసూర్యకు ఎలాంటి పోస్టు ఇస్తారన్నది చూడాలి.
ఇదిలావుంటే.. తప్పు చేసిన ఏ అధికారినైనా పవన్ వదిలి పెట్టకపోవడం గమనార్హం. ఇటీవల తన శాఖ పంచాయతీరాజ్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది అధికారులను తక్షణమే సస్పెండ్ చేయడం విశేషం.
This post was last modified on December 26, 2025 7:39 am
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే తమిళ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయిపై కేసు నమోదైంది. ఎక్స్లో ఆమె చేసిన…