Political News

‘నా కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు’.. ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్యంగా వైసీపీ నాయ‌కుల‌ను ఉద్దేశించి ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. రెండు రోజుల కిందట కూడా.. వైసీపీ నేత‌ల‌ను ముఖ్యంగా మాజీ సీఎం ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై సీరియ‌స్ అయ్యారు. తాజాగా మ‌రోసారి వాటికి కొన‌సాగింపుగా మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.

“వైసీపీ నాయకులు బెదిరింపులు మానేయాలి. ప్రజాస్వామ్య భాషకు రండి. అధికారులు ఇంకా భయపడి… వారు(వైసీపీ) వస్తే ఏమవుతుందో అనుకుంటే దానికి కూడా చెబుతున్నాను. వారు రారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రావు. నా కంఠం లో ప్రాణం ఉన్నంతవరకు దేశ సమగ్రత, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయడానికి అయినా సిద్ధం. ఎన్ని రాజకీయ ఎత్తులు వేయడానికి అయినా నేను సిద్ధం.“ అని ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు.

తాజాగా మంగ‌ళ‌గిరిలో నిర్వ‌హించిన `పదవి బాధ్యత’ కార్య‌క్ర‌మంలో నామినేటెడ్ ప‌ద‌వులు పొందిన జ‌న‌సేన‌ నాయ‌కుల‌ను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. రాజ్యాంగ పరిధిలోనే పోరాటం చేస్తామ‌ని, చివరి దశలో మాత్రమే గొడవ పెట్టుకుంటామ‌ని చెప్పారు. “ఆ గొడవ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. చొక్కా మడిచి ముందుకు వెళతాం. అది ఆఖరి అస్త్రం. సయోధ్యగా మీరు ఎంత మాట్లాడతారో అప్పటివరకు నేను శాంతంగా ఉంటాను. మీరు కూడా చర్చ చేయండి. వాదించండి. ఆమోదయోగ్యమైన భాషలో మాట్లాడండి. సామాన్యుడు హర్షించేలా మాట్లాడండి“ అని వైసీపీకి సూచించారు.

జ‌గ‌న్ బెదిరింపులు రాష్ట్రానికి న‌ష్టం..

జ‌గ‌న్ బెదిరింపులు రాష్ట్రానికి న‌ష్ట‌మ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు దెబ్బతింటే టూరిజం కూడా దెబ్బతింటుందన్నారు. “మాజీ ముఖ్యమంత్రి వచ్చి పోలీసు అధికారుల్ని తిడుతూ… మేం వస్తే కాంట్రాక్టర్లను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తుంటే చాలా తప్పుడు సంకేతం వెళ్తుంది. పర్యాటకం మీదనే కాదు… పెట్టుబడులు, అభివృద్ధి అన్ని విషయాల్లోనూ రాష్ట్రానికి న‌ష్టం చేకూరుతుంది. శాశ్వతంగా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకు తెలుసు.“ అని ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు.

This post was last modified on December 23, 2025 7:49 am

Share

Recent Posts

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

4 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

4 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

5 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

5 hours ago

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును…

5 hours ago

డాటరాఫ్ రవీనా… ఫలితం కూడా అదేనా

టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…

6 hours ago