Political News

పవన్ను ట్రాప్ లోకి లాగుతున్నారా ?

కమలంపార్టీ నేతల వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. హైదరాబాద్ లో బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అండ్ కో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండ్ కో మధ్య పెద్ద భేటీనే జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్దితులు, నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతుల గురించి, రాష్ట్రంలో రోడ్ల దుస్ధితితో పాటు ఏలూరులో వింతరోగం తదితర అనేక అంశాలపై చర్చించిన నేతలు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల గురించి మాత్రం చర్చించకపోవటం ఆశ్చర్యంగా ఉంది.

తొందరలో జరగబోయే తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేసే విషయంలో రెండు పార్టీల్లో దేనికదే రెడీ అయిపోతోంది. తమ అభ్యర్ధి పోటీ చేస్తేనే గెలుపు అవకాశం ఉంటుందంటే కాదు తమకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటు రెండుపార్టీల నేతల మద్య వాగ్వావాదం పెరిగిపోతోంది. దాంతో పోటీ విషయంలో ఇటు సోము వీర్రాజు, అటు పవన్ కల్యాణ్ ఇద్దరు పంతాలకు వెళ్ళిపోయారు.

మొన్న అంటే 2019లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావుకు వచ్చిన మెజారిటీయే 2.28 లక్షలు. ఆయన హఠాన్మరణం కారణంగా ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 16 వేలు. జనసేన మద్దతుతో పోటీ చేసిన బిఎస్పీ అభ్యర్ధికి వచ్చింది 20 వేల ఓట్లు. అంటే రెండు పార్టీలకు కూడా కనీసం డిపాజిట్ కూడా రాలేదని అర్ధమైపోతోంది. ఇటువంటి ఓట్ బేస్ ఉన్న పార్టీలు కూడా గెలుపు మాదే అంటే మాదే అంటు టికెట్ కోసం పోటీ పడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

సరే ప్రతి పార్టీ కూడా గెలుస్తామని చెబుతుందనటంలో సందేహం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ ప్రస్తావంచారట. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్ధి విషయంపై భేటీ అవుదామని వీర్రాజు విషయాన్ని దాటవేసినట్లు సమాచారం. ముందైతే ఏపార్టీ అభ్యర్ధి పోటీ చేసినా రెండోవాళ్ళు విజయం కోసం పనిచేయాలనే స్ధూలమైన నిర్ణయానికి వచ్చినట్లు టాక్ నడుస్తోంది.

నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్ధి విషయం మాట్లాడాలన్న వీర్రాజు వాదనే కరెక్టయితే మరి దాదాపు రెండు నెలల క్రితమే తిరుపతిలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారని ఎలా ప్రకటించారు ? ఆ తర్వాత కూడా ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారనే అర్ధం వచ్చేట్లుగా చాలా హడావుడే చేశారు. తీరా పోటీ చేసే అవకాశం తమకే కావాలని పవన్ పట్టుబట్టే సరికి నోటిఫికేషన్ తర్వాత భేటి అవుదామని విషయం దాటేసినట్లు కనబడుతోంది. మొత్తం మీద తిరుపతి సీటు కోసం పట్టుబట్టకుండా పవన్ కు బీజేపీ ట్రాప్ వేస్తున్నట్లే అనుమానంగా ఉంది. మరి గతంలో లాగ ట్రాపులో పడిపోతారా ? లేకపోతే మెలకువగా ఉంటారా చూడాలి.

This post was last modified on December 10, 2020 3:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

2 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

3 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

3 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

3 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

3 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

4 hours ago