Political News

పవన్ను ట్రాప్ లోకి లాగుతున్నారా ?

కమలంపార్టీ నేతల వ్యవహారం చూస్తుంటే ఇదే అనుమానంగా ఉంది. హైదరాబాద్ లో బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అండ్ కో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండ్ కో మధ్య పెద్ద భేటీనే జరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్దితులు, నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతుల గురించి, రాష్ట్రంలో రోడ్ల దుస్ధితితో పాటు ఏలూరులో వింతరోగం తదితర అనేక అంశాలపై చర్చించిన నేతలు తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల గురించి మాత్రం చర్చించకపోవటం ఆశ్చర్యంగా ఉంది.

తొందరలో జరగబోయే తిరుపతి ఉపఎన్నికలో పోటీ చేసే విషయంలో రెండు పార్టీల్లో దేనికదే రెడీ అయిపోతోంది. తమ అభ్యర్ధి పోటీ చేస్తేనే గెలుపు అవకాశం ఉంటుందంటే కాదు తమకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటు రెండుపార్టీల నేతల మద్య వాగ్వావాదం పెరిగిపోతోంది. దాంతో పోటీ విషయంలో ఇటు సోము వీర్రాజు, అటు పవన్ కల్యాణ్ ఇద్దరు పంతాలకు వెళ్ళిపోయారు.

మొన్న అంటే 2019లో జరిగిన ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధి బల్లి దుర్గాప్రసాదరావుకు వచ్చిన మెజారిటీయే 2.28 లక్షలు. ఆయన హఠాన్మరణం కారణంగా ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్ధికి వచ్చిన ఓట్లు 16 వేలు. జనసేన మద్దతుతో పోటీ చేసిన బిఎస్పీ అభ్యర్ధికి వచ్చింది 20 వేల ఓట్లు. అంటే రెండు పార్టీలకు కూడా కనీసం డిపాజిట్ కూడా రాలేదని అర్ధమైపోతోంది. ఇటువంటి ఓట్ బేస్ ఉన్న పార్టీలు కూడా గెలుపు మాదే అంటే మాదే అంటు టికెట్ కోసం పోటీ పడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.

సరే ప్రతి పార్టీ కూడా గెలుస్తామని చెబుతుందనటంలో సందేహం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నికల్లో పోటీ విషయంలో పవన్ ప్రస్తావంచారట. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్ధి విషయంపై భేటీ అవుదామని వీర్రాజు విషయాన్ని దాటవేసినట్లు సమాచారం. ముందైతే ఏపార్టీ అభ్యర్ధి పోటీ చేసినా రెండోవాళ్ళు విజయం కోసం పనిచేయాలనే స్ధూలమైన నిర్ణయానికి వచ్చినట్లు టాక్ నడుస్తోంది.

నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్ధి విషయం మాట్లాడాలన్న వీర్రాజు వాదనే కరెక్టయితే మరి దాదాపు రెండు నెలల క్రితమే తిరుపతిలో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారని ఎలా ప్రకటించారు ? ఆ తర్వాత కూడా ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారనే అర్ధం వచ్చేట్లుగా చాలా హడావుడే చేశారు. తీరా పోటీ చేసే అవకాశం తమకే కావాలని పవన్ పట్టుబట్టే సరికి నోటిఫికేషన్ తర్వాత భేటి అవుదామని విషయం దాటేసినట్లు కనబడుతోంది. మొత్తం మీద తిరుపతి సీటు కోసం పట్టుబట్టకుండా పవన్ కు బీజేపీ ట్రాప్ వేస్తున్నట్లే అనుమానంగా ఉంది. మరి గతంలో లాగ ట్రాపులో పడిపోతారా ? లేకపోతే మెలకువగా ఉంటారా చూడాలి.

This post was last modified on December 10, 2020 3:11 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

11 mins ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

22 mins ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

1 hour ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

2 hours ago

IPL దెబ్బకు ఇంతకన్నా సాక్ష్యం కావాలా

థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…

3 hours ago

ముద్రగడ వ్యాఖ్యలతో వైసీపీ మునుగుతుందా ?

పచ్చగా సాగుతున్న వైసీపీ కాపురంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చిచ్చుపెడుతున్నాడా ? పార్టీకి ఆయన వ్యాఖ్యలు బలం చేకూర్చకపోగా చేటు చేస్తున్నాయా…

4 hours ago