Political News

కేసీఆర్ సారు… మీ వాళ్ళని ఇరకాటంలో పడేసారే

కోనసీమ కొబ్బరి చెట్ల గురించి తెలంగాణ నాయకులు పదే పదే మాట్లాడుతూ ఉంటారని, కోనసీమకు దిష్టి తగిలిందని, కోనసీమ ప్రాంతం వల్లే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందేమో అని తనకు అనిపిస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న సంగతి తెలిసిందే.

తన వ్యాఖ్యలపై పవన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, కల్వకుంట్ల కవిత తదితరులు డిమాండ్ చేశారు. అయితే, రైతులతో ముచ్చటిస్తున్న సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలను కొంతమంది వక్రీకరిస్తున్నారని జనసేన ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

ఆ వ్యవహారం సద్దుమణిగిన తరుణంలో తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. ఏపీ ఏర్పాటు తెలంగాణ పాలిట పెను శాపం అని కేసీఆర్ అన్నారు. కొంతమందికి ఇది నచ్చదని కూడా ఆయన చెప్పారు. దీంతో, కేసీఆర్ పై జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఆనాడు పవన్ ఫ్లో లో అన్న మాటలపై బీఆర్ఎస్ నేతలు నానా యాగీ చేశారని, మరి, ఏపీ ఏర్పాటు తెలంగాణ పాలిట పెను శాపం అంటూ నేరుగా కేసీఆర్ ప్రెస్ మీట్ లో స్టేట్మెంట్ ఇచ్చేశారని విమర్శిస్తున్నారు.

ఆ వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత తీవ్రంగా నష్టపోయింది ఏపీ అని, ఆ రకంగా చూసుకుంటే తెలంగాణ ఏర్పాటు ఏపీకి పెనుశాపం అని ఆంధ్రా నాయకులు భావించాలని గుర్తు చేస్తున్నారు.

కానీ, ఏ నాడూ ఏపీ నాయకులు అలా అనలేదని చెబుతున్నారు. వడ్డించిన విస్తరి వంటి హైదరాబాద్ మహా నగరాన్ని తెలంగాణకు వదిలేసి, పునాదుల నుంచి అమరావతి రాజధానిని నిర్మించుకుంటూ కష్టపడుతోంది ఏపీ అని, తెలంగాణ కాదని, అటువంటప్పుడు తెలంగాణకు ఏపీ పెనుశాపం ఏవిధంగా మారిందని ప్రశ్నిస్తున్నారు.

Kumar

Recent Posts

బహదూర్ VS బంధం – ఆషామాషీ పోటీ కాదు

స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…

31 minutes ago

కిచిడీ కామెడీకి వంద కోట్ల వసూళ్లు

దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…

33 minutes ago

తారక్ & త్రివిక్రమ్… యుద్ధం మొదలుకానుంది

అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…

1 hour ago

ఇరుముడికి పొంచి ఉన్న రెండు ముప్పులు

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…

2 hours ago

సూర్య సరైన దారిలోకి వచ్చినట్టే

ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…

3 hours ago

తూచ్… అమరావతికి వ్యతిరేకమని జగన్ చెప్పలేదా?

అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…

5 hours ago