వైసీపీ పరిస్థితి డోలామానంలో పడింది. పార్టీని ముందుకు నడిపించేవారు లేక, బలమైన గళాలు వినిపించే వారు కనిపించక, పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు పార్టీ అధినేతను ఏమైనా అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు ముందుకు వచ్చేవారు. దీటుగా కౌంటర్లు ఇచ్చేవారు.
అయితే గత ఏడాది కాలంగా వారు సైలెంట్ అవుతున్నారు. ఎక్కడ కేసులు పెడతారో అన్న భయం వెంటాడుతోందన్నది వాస్తవం.
ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలకు చేరువ అవుతున్న నేపథ్యంలో స్పీడు పెంచాలని ఇటీవలే జగన్ పార్టీ నాయకులకు హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే ఒకరిద్దరు బయటకు వస్తున్నారు. కానీ ఇంతలోనే ఇటు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్, అటు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో మళ్లీ గుబులు రేపుతున్నాయి. నోరు విప్పితే ఏం జరుగుతుందో అన్న బెంగ వారిని వెంటాడుతోంది.
రెడ్ బుక్లో మూడు పేజీలు మాత్రమే ఓపెన్ చేశామని, ఇంకా ఓపెన్ చేయని పేజీలు చాలానే ఉన్నాయని, ముహూర్తం పెడతానంటూ ఇటీవల రాజమండ్రిలో నారా లోకేష్ హెచ్చరించారు. వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యే వైసీపీ నాయకులు తాజాగా ఎక్కడా స్పందించలేదు. లోకేష్ను కూడా ఎక్కడా కార్నర్ చేయలేదు.
ఇక పవన్ కళ్యాణ్ తాజాగా రౌడీయిజం, గూండాయిజం చేసేవారికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తప్పదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపైనా నేరుగా నాయకులు స్పందించలేదు. ఒకరిద్దరు మాట్లాడినా గతంలో ఉన్న రేంజ్లో మాత్రం తమ వ్యాఖ్యలకు పదును పెట్టలేదు.
సో మొత్తంగా చూస్తే అటు లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు డోలాయమానంలో పడ్డారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరోవైపు అరెస్టయిన వారికి న్యాయం, సహాయం కూడా సరిగా అందించలేని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరికివారు “మనకెందుకులే” అని సరిపుచ్చుకుంటున్నారు.
మరి ఇదే పరిస్థితి కొనసాగుతుందా? లేదా? అనేది చూడాలి.
This post was last modified on December 22, 2025 10:55 am
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…