Political News

లోకేష్, పవన్ వైసీపీని ఇలా తగులుకున్నారేంటి

వైసీపీ పరిస్థితి డోలామానంలో పడింది. పార్టీని ముందుకు నడిపించేవారు లేక, బలమైన గళాలు వినిపించే వారు కనిపించక, పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒకప్పుడు పార్టీ అధినేతను ఏమైనా అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు ముందుకు వచ్చేవారు. దీటుగా కౌంటర్లు ఇచ్చేవారు.

అయితే గత ఏడాది కాలంగా వారు సైలెంట్ అవుతున్నారు. ఎక్కడ కేసులు పెడతారో అన్న భయం వెంటాడుతోందన్నది వాస్తవం.

ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలకు చేరువ అవుతున్న నేపథ్యంలో స్పీడు పెంచాలని ఇటీవలే జగన్ పార్టీ నాయకులకు హితవు పలికారు. ఈ నేపథ్యంలోనే ఒకరిద్దరు బయటకు వస్తున్నారు. కానీ ఇంతలోనే ఇటు ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ నేత, మంత్రి నారా లోకేష్, అటు డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో మళ్లీ గుబులు రేపుతున్నాయి. నోరు విప్పితే ఏం జరుగుతుందో అన్న బెంగ వారిని వెంటాడుతోంది.

రెడ్ బుక్‌లో మూడు పేజీలు మాత్రమే ఓపెన్ చేశామని, ఇంకా ఓపెన్ చేయని పేజీలు చాలానే ఉన్నాయని, ముహూర్తం పెడతానంటూ ఇటీవల రాజమండ్రిలో నారా లోకేష్ హెచ్చరించారు. వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యే వైసీపీ నాయకులు తాజాగా ఎక్కడా స్పందించలేదు. లోకేష్‌ను కూడా ఎక్కడా కార్నర్ చేయలేదు.

ఇక పవన్ కళ్యాణ్ తాజాగా రౌడీయిజం, గూండాయిజం చేసేవారికి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తప్పదని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపైనా నేరుగా నాయకులు స్పందించలేదు. ఒకరిద్దరు మాట్లాడినా గతంలో ఉన్న రేంజ్‌లో మాత్రం తమ వ్యాఖ్యలకు పదును పెట్టలేదు.

సో మొత్తంగా చూస్తే అటు లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో వైసీపీ నాయకులు డోలాయమానంలో పడ్డారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరోవైపు అరెస్టయిన వారికి న్యాయం, సహాయం కూడా సరిగా అందించలేని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరికివారు “మనకెందుకులే” అని సరిపుచ్చుకుంటున్నారు.

మరి ఇదే పరిస్థితి కొనసాగుతుందా? లేదా? అనేది చూడాలి.

This post was last modified on December 22, 2025 10:55 am

Share

Recent Posts

`కాక్రోచ్‌`లు మ‌ళ్లీ ప‌ని మొద‌లు పెట్టేశారు…

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవ‌ల ప్ర‌క‌టించిన `పాఠ‌శాల‌ల అభివృద్ధి` కార్య‌క్ర‌మానికి 80వ స్వాతంత్ర దినోత్స‌వం వేడుక‌లే…

2 hours ago

జండా పండగ జరుపుకోలేదా జగన్?

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…

3 hours ago

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

9 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

9 hours ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

12 hours ago

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5…

12 hours ago