వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ నాయకుల నుంచే వస్తున్నాయి. తాజాగా మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ఇచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వంపై జగన్ సమరం చేస్తున్నారు. ఈ మొత్తం క్రెడిట్ను తానే తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. కమ్యూనిస్టులు కూడా ఉద్యమాలు చేస్తున్నారు. ఈ కీలక సమయంలో వైసీపీతో కలిసి పోరాడేందుకు తాము సిద్ధమని కూడా ప్రకటించారు.
కానీ.. జగన్ కమ్యూనిస్టులను దూరం పెట్టి.. తానే స్వయంగా ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. తద్వారా ప్రభుత్వం వెనక్కి తగ్గితే.. ఆ క్రెడిట్ మొత్తాన్నీ తన పార్టీని అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితిలో కమ్యూనిస్టులు సహా.. ఇతర చిన్న చితకా పార్టీలతో జగన్ దోస్తీ చేయడం బెటర్ అన్న సూచనలు పార్టీలోనే చర్చ సాగుతోంది. పోయిన ప్రాభవంతిరిగి దక్కించుకునేందుకు ఇతర పార్టీలను కూడా కలుపుకొని ముందుకు సాగాలని సూచిస్తున్నారు.
వైసీపీతో కలిసి నడిచేందుకు, ఉద్యమాలు సహా వచ్చే ఎన్నికల నాటికి కలిసి ముందుకు సాగేందుకు కూడా.. కమ్యూనిస్టులే కాకుండా.. జై భీం భారత్ పార్టీ, జైభారత్ సర్క్యులర్ పార్టీ, సహా పలు చిన్న పార్టీలు ఎదురు చూస్తున్నాయి. వీటిని కలుపుకొని ముందుకు సాగితే.. వైసీపీకి బలం చేకూరుతుందన్న చర్చ కూడా సాగుతోంది. కానీ, జగన్ మాత్రం ఆదిశగా ఆలోచన చేయడం లేదు.
దీనికి ప్రధానంగా.. తన ప్రభుత్వంపై ఆయా పార్టీలు విమర్శలు చేయడం.. తనను వ్యక్తిగతంగా దూషించడం వంటి కారణాలను ఆయన భూతద్దంలో చూస్తున్నారన్న వాదన ఉంది. కానీ… వాస్తవానికి రాజకీయాల్లో ఇలాంటివి కామనే. ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా.. రాజకీయాల్లో అందరూ అవకాశం చూసుకుని కలుస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. కానీ, తను పట్టుకున్న కుందేలుకు మూడు కాళ్లే అన్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్న తీరుతో ఇప్పుడు ఇబ్బందులువస్తున్నాయి. మరి భవిష్యత్తులో అయినా మారుతారో లేదో చూడాలి.
This post was last modified on December 20, 2025 7:07 am
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…